అన్వేషించండి

Covid 19 Third Wave: కరోనా థర్డ్ వేవ్‌ ఈ నెలలోనే.. ఆ సమయానికి మరింత తీవ్రం, ఐఐటీ నిపుణుల వెల్లడి

కరోనా మూడో వేవ్‌పై ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు అధ్యయనం చేశారు. మూడో వేవ్‌ ఈ నెలలోనే ప్రారంభం అవుతుందని వారు తెలిపారు.

మన దేశంలో కరోనా వైరస్ విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళన పడుతున్న వేళ అందుకు మరింత బలం చేకూర్చే వార్తను ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ప్రకటించారు. ప్రస్తుతం అందరూ కరోనా మూడో వేవ్ వస్తుందేమోనన్న భయంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు కీలక ప్రకటన చేశారు. భారత్‌లో ఈ ఆగస్టు నెలలోనే మరోసారి కరోనా విశ్వరూపం చూపడం మొదలుపెడుతుందని వివరించారు. ఇలా కేసులు క్రమంగా పెరుగుతూ అక్టోబరు నాటికి కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చునని అంచనా వేశారు. అయితే, రెండో వేవ్ మిగిల్చిన తీవ్రమైన ప్రాణ నష్టాలతో పోల్చితే.. మూడో వేవ్ విజృంభణ కాస్త తక్కువగానే ఉంటుందని తెలిపారు.

ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన విద్యాసాగర్‌, కాన్పూర్ ఐఐటీకి చెందిన మణీంద్ర అగర్వాల్‌ నాయకత్వంలో పరిశోధకులు కరోనా మూడో వేవ్ తీవ్రతను అంచనా వేశారు. మూడో వేవ్ అత్యధిక స్థాయిలో ఉన్న దశలో రోజువారీ కేసుల సంఖ్య దేశంలో లక్ష లోపు ఉంటుందని అంచనా వేశారు. వైరస్ వ్యాప్తి పరిస్థితులు ఇంకా అధ్వానంగా ఉంటే అది 1.5 లక్షలకూ చేరొచ్చని అంచనా వేశారు.

రెండో వేవ్‌‌లో ఈ ఏడాది మేలో కరోనా తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. అత్యధికంగా రోజుకు 4 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల గ్రాఫ్ అమాంతం ఊహించని స్థాయికి పెరిగిపోయింది. ఆ తర్వాత అదే తరహాలో వేగంగా తగ్గుముఖం పట్టింది. అయితే, మూడో వేవ్ మరీ దారుణం కాకుండా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని వేగం చేయాలని సూచించారు. వైరస్‌కు హాట్‌స్పాట్‌లుగా మారుతున్న ప్రాంతాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు పరిశీలన అవసరం ఉంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ తాజా విజృంభణకు కారణమైన డెల్టా రకం కరోనా వైరస్‌ మన దేశంలోనే తొలిసారి వెలుగు చూసిన అంశాన్ని ఐఐటీ హైదరాబాద్ నిపుణులు గుర్తు చేశారు.

ప్రజల్లోనూ అలసత్వం..
ప్రస్తుతం కరోనా కేసులు కొత్తవి తక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు చురుగ్గా బయట తిరుగుతున్నారు. గత ఏడాది కరోనా మొదటి వేవ్ ముగిశాక.. జనం పెళ్లిళ్లు, వేడుకల్లో బాగా పాల్గొన్నారు. ఫలితంగా ఈ ఏడాది మార్చిలో రెండో వేవ్ మొదలైంది. ఇది రేపిన విలయతాండవం అందరికీ తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ మార్చిలో మొదలై ఇప్పటికి 5 నెలలు గడించింది. ఇప్పుడు దేశంలో రోజువారీ కేసుల సంఖ్య దాదాపు 40 వేల వరకూ నమోదవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకూ కూడా 26 వేల వరకూ ఉంటున్న కేసులు ఇప్పుడు మళ్లీ 40 వేలకు పెరిగాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget