అన్వేషించండి

Jaggareddy On Chiranjeevi | చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana News | చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులపై సినిమా తీసి చిరంజీవి కోట్లు సంపాదించినా, వారి కోసం నిరసన తెలపలేదన్నారు.

Jaggareddy About Chiranjeevi| హైదరాబాద్: రైతుల రుణమాఫీలో భాగంగా రూ.1 లక్ష లోపు ఉన్న అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. ఆగస్టు 15 లోపే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ విషయం తెలిసి, బీఆర్ఎస్ నేతలు రాత్రి నిద్రపోయి ఉండకపోవచ్చు అంటూ సెటైర్లు వేశారు. స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రపోయి ఉండొచ్చు అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది అమలు చేసి తీరుతారని చెప్పడానికి రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడటమే నిదర్శనం అన్నారు.

మెగా బ్రదర్స్‌పై జగ్గారెడ్డి విమర్శలు 
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తీసిన ఖైదీ నం150 అనే సినిమా మొత్తం రైతుల గురించి, వారి సమస్యల గురించి ఉంది. రైతుల ఆత్మహత్యలను సైతం సినిమాలో చూపించారు. సినిమాలో హీరో అయిన చిరంజీవి రైతుల గురించి పోరాటం చేసినట్లు ఉంది. ఆ సినిమా హిట్ అయింది. చిరంజీవికి కోట్ల రూపాయలు వచ్చాయి. నిర్మాత, దర్శకుడికి కోట్లు డబ్బులొచ్చాయి. కానీ నడిరోడ్డు మీద రైతులను బీజేపీ ప్రభుత్వం చంపుతుంటే, వారిని హింసిస్తుంటే చిరంజీవి ఢిల్లీకి వెళ్లి ఎందుకు నిరసన తెలపలేదో. నీ సినిమాతో నువ్వు బాగు పడ్డావు. నీ సినిమా రైతుల కడుపు నింపలేదు. సినిమా హిట్ అయ్యింది. నీ తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీకి, ప్రధాని మోదీకి దోస్త్. బీజేపీతో కలిసి పనిచేసే చంద్రబాబు సైతం రైతుల సమస్యలపై ఎందుకు పోరాటం చేయలేదు. మీ అందరూ ఢిల్లీకి వెళ్లి ఎందుకు రైతుల పక్షాన నిలిచి, కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలపై ఎందుకు నిరసన తెలపలేదని’ జగ్గారెడ్డి ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ ఎండ, వాన లెక్క చేయకుండా దేశ వ్యాప్తంగా 9 వేల కోట్లు కిలోమీటర్ల యాత్ర చేశారు. చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ అయితే సినిమాల్లో సమస్యలపై పోరాడతారు కానీ, నిజ జీవితంలో రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చిన వారిపై ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. రైతుల పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తారు, కానీ నిజ జీవితంలో మాత్రం వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీకి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీకి కట్టుబడి ఉందన్నారు.

‘హరీష్ రావు ఆర్థిక మంత్రిగా, మీ మామ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో మీరు రూ.7 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ ఆ మొత్తం నుంచి రైతులకు మీరు ఇచ్చింది కేవలం రూ.26 వేల కోట్లు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కేవలం 6 నెలల్లో రూ. 31 వేల కోట్లు మాఫీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఒకేసారి రూ.75 వేల కోట్లు రుణమాఫీ చేశాం. వైఎస్సార్ ఆరోజు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నారని’ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Konda Surekha: కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
కొండా సురేఖకు ప్రత్యామ్నాయం ఎవరు? సూటబుల్‌ నేతలను వెతికే పనిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం!
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Embed widget