అన్వేషించండి

Bhatti Vikramarka: ఈ 10 సమస్యలు తీర్చండి, సీఎం కేసీఆర్‌కు భట్టి విక్రమార్క వినతిపత్రం

పోడువ్యవసాయం చేస్తున్న రైతులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సింగరేణి బొగ్గుగనులు, ధరణి సమస్యలు పరిష్కరించాలని పలు సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

Congress Leader Bhatti Vikramarka : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనాదిగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క. ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు వినతి పత్రం అందజేశారు. పోడువ్యవసాయం చేస్తున్న రైతులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సింగరేణి బొగ్గుగనుల్లో సమస్యలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరి, ధరణి సమస్యలు పరిష్కరించాలని పలు సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కంటి వెలుగు రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. 

1) అనాదిగా అడవిప్రాంతాన్ని నమ్ముకొని పోడువ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అటవి భూమి రక్షణ చట్టం ద్వారా వారు సాగుచేస్తున్న భూమికి పట్టాలు తక్షణమే అబ్దిదారులకు అందజేయాలి. ఇటీవల జరిగిన భూమి సర్వే అవకతవకలను సరిచేయవలసినటువంటి అవసరం ఉన్నది.

2) గడిచిన ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామి మేరకు రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం అశించిన స్థాయిలో లేదు. తక్షణమే ఖమ్మం జిల్లాకు రెండు పడకల గదుల ఇండ్లు మంజూరు చేయగలరని కోరుతున్నాము

3) గతంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మధిర ప్రాంతంలో మహిళలు అసక్తిచూపిన “ఇందిరమ్మ డైరి" స్కీమ్‌ను విస్తృత ప్రాతిపదికన మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాము.

4) సింగరేణి బొగ్గుగనుల్లో 51 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం దానిపై అజమాయిషి వహించి బొగ్గుగనులను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపించి ప్రైవేటీకరణను అడ్డుకోవలసినదిగా కోరుతున్నాము.

5) ప్రతి ఉమ్మడి జిల్లాకు రాష్ట్రంలో యునివర్సిటిని మంజూరు చేశారు. అందుకు ఖమ్మం జిల్లా మాత్రం యునివర్సిటికి నోచుకోలేదు. తక్షణమే ఖమ్మం జిల్లాకు యునివర్సిటిని మంజూరు చేయవలసినదిగా కోరుచున్నాము.

6 మధిర శాసనసభ నియోజక వర్గానికి జిల్లా మొత్తానికి ఉపాధ్యాయులను అందించినటువంటి ఘనత పొందిన మధిరకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కలశాల మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాము.

7) రాష్ట్ర విభజనలో హక్కుగా పొందిన బయ్యారం ఉక్కుప్యాక్టరిని మంజూరు చేయించి తక్షణమే సంబంధిత పనులు ప్రారంబించి జిల్లా ప్రజల కలలు నేరవేర్చాలని కోరుచున్నాము.

8) ధరణి సమస్యలు తక్షణమే పరిష్కరించి పాస్పుస్తకాలు అందజేయుటకు రెవిన్యూ అధికారులను అదేశించవలసినదిగా కోరుచున్నాము.

9) జర్నలిస్టులకు ఇండ్ల ప్లాట్లు మంజూరు చేయవలసినదిగా కోరుచున్నాము. 

10) అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయవలసినదిగా కోరుచున్నాము.

పైన పేర్కొన్న అంశాలు జిల్లా ప్రజల అకాంక్షలు వీటితో ముడిపడి ఉన్నాయి. అందుచేత ఇవి ప్రాధాన్యత కలిగిన సమస్యలుగా మిగిలి ఉన్నాయి. వీటిని సహృదయంతో మీరు పరిశీలించి వీటిపై తగినంత త్వరలో నిర్ణయం తీసుకొని ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్షలు నేరవేరుస్తారని ఆశిస్తున్నామని సీఎం కేసీఆర్ ను సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కోరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget