అన్వేషించండి

CM Revanth Reddy: మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు - పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటానన్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana News: ఎవరివో మాయమాటలు నమ్మి పరిశ్రమలను, అభివృద్ధిని అడ్డుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దని అన్నారు.

CM Revanth Reddy Comments In Rythu Panduga Event In Mahabubnagar: మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని.. ఇంటికో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం తలరాత మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మహబూబ్‌నగర్‌లో (Mahabubnagar) ఏర్పాటు చేసిన 'రైతు పండుగ' సభలో శనివారం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం రైతుల కోసం ఇప్పటివరకూ రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిందని.. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని గుర్తు చేశారు. 'సరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కోసం ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేసి.. నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు వలస వెళ్లాయి. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి చేసిందా.?. ఈ ప్రభుత్వం మాత్రం వరి వేస్తే.. రూ.500 బోనస్ ఇచ్చి వరి రైతులకు పండుగ తెచ్చింది. ఈ ఏడాది రాష్ట్రంలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండింది. ఏడాదిలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం ఇది. అన్నదాతలకు ఉచిత కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీది.' అని రేవంత్ తెలిపారు.

'అవకాశాన్ని వదులుకోవద్దు'

తన జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలని తాను భావించినట్లు సీఎం రేవంత్ తెలిపారు. 'గతంలో ఎవరూ భూసేకరణ చేయలేదా.?. ప్రాజెక్టులు కట్టలేదా..?. పరిశ్రమలు నిర్మించలేదా.?. మాయగాళ్ల మాటలు విని పరిశ్రమలను అడ్డుకుంటున్నారు. వారి మాటలు విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుక్కున్నారు. జిల్లా అభివృద్ధి చేయాలంటే భూసేకరణ చేయాలా..? వద్దా..?. అధికారులను కొడితే.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తయ్యేవా.?. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చెప్పిన మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఇంటికో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం తలరాత మారుతుంది. నష్టపరిహారం ఎక్కువ ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దు. పాలమూరు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా. జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటాను.' అని సీఎం స్పష్టం చేశారు.

'ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం'

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినవేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, యువతకు ఉద్యోగాల కోసమని.. గత ప్రభుత్వం మూలన పడేసిన ప్రాజెక్టులన్నీ క్రమంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. 'ప్రతి నెలా సమీక్షలు చేస్తూ బిల్లులు చెల్లిస్తూ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. కేసీఆర్ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి పదేళ్లలో కూడా పూర్తి చేయలేదు. ఈ ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసింది. నెల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేశాం.' అని భట్టి వివరించారు.

Also Read: Anti Maoism Movement: అడవుల్లో యాంటీ మావోయిజం - ములుగు ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Asifabad News: ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
ఆసిఫాబాద్ జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ
Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget