అన్వేషించండి

CM Revanth: బీఆర్ఎస్ నేతల నుంచి బీజేపీ నేతలు లంచాలు తీసుకుంటున్నారు -సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు

CM Revanth accused BJP leaders : బీఆర్ఎస్ నేతల నుంచి బీజేపీ నేతలు లంచాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. అందుకే ఆరు నెలలు అయినా కాళేశ్వరంపై చర్యలు తీసుకోలేదన్నారు.

Telangana Municipal Elections 2026:  బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పరోక్షంగా ఒక్కటయ్యాయని, ఆ రెండు పార్టీల మధ్య అపవిత్ర కలయిక ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అక్రమాల నుంచి వారిని కాపాడేందుకు బీజేపీ నేతలు భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, పరస్పర ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలు పని చేస్తున్నాయని, అందుకే బీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాలను ప్రస్తావిస్తూ.. బీజేపీ నేతలు ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తమ అక్రమ సంపాదనను బీజేపీ నేతలకు చేరవేస్తున్నారని, దానికి ప్రతిఫలంగా బీజేపీ ప్రభుత్వం వారిపై ఎలాంటి విచారణ జరగకుండా అడ్డుకుంటుందని ఆయన విశ్లేషించారు. రాష్ట్ర సంపదను దోచుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రజల సొమ్మును కక్కిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. కాళేశ్వరం రిపోర్టు పంపి ఆరు నెలలు అయినా చర్యలు తీసుకోలేదన్నారు. 

బీజేపీ ఎంపీలు, నేతలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని, తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కుల గురించి కేంద్రం వద్ద నోరు మెదపడం లేదని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్‌తో ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లే బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను కూడా రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. అక్షింతలు వేసే వారు ఒకవైపు, అభివృద్ధి చేసే వారు మరొకవైపు ఉన్నారని.. ప్రజలు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవాలని సూచించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఆ అప్పులను తీర్చుకుంటూనే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.                              

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ సమ్మక్క జాతరకు హాజరు కాలేదన్నారు. గతంలో భద్రాచలం వి,యంలోనూ అలాగే చేశారని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
KTR On Polavaram Project: దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget