అన్వేషించండి

KCR Delhi Tour: ఢిల్లీలో ఆ ముగ్గుర్నీ కలిసే యోచనలో కేసీఆర్.. ఆ తర్వాతే హైదరాబాద్‌కు..

సీఎంవో కార్యాలయం ముగ్గురి అపాయింట్‌మెంట్ కోరింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సహా కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌లను కేసీఆర్ కలవాలని ప్రయత్నిస్తున్నారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీఎంవో కార్యాలయం ముగ్గురి అపాయింట్‌మెంట్ కోరింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సహా కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌లను కేసీఆర్ కలవాలని ప్రయత్నిస్తున్నారు. వారిని కలిసిన తర్వాతే సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ రావాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ ముగ్గురు అపాయింట్‌మెంట్లను సీఎంవో ఇప్పటికే కోరగా.. ప్రధాన మంత్రి మోదీ, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లను శుక్రవారమే కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శనివారం అమిత్‌ షాను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముగ్గురిని కలిసిన అనంతరం ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తారని పార్టీ వర్గాలు వర్గాలు వెల్లడించాయి.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై జారీ చేసిన గెజిట్, వివిధ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై జల​శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కేసీఆర్ చర్చించనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే పలువురు నిపుణులు, అధికారులతో హైదరాబాద్‌లో ఉండగానే సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు మంత్రికి వివరించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Rain In Hyderabad: హైదరాబాద్ లో జోరువాన.. ఆకాశానికి చిల్లు పడిందా ఏంటీ?

ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీసుకు శంకుస్థాపన
రాజధానిలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం దీనికి భూమి పూజ చేశారు. ఢిల్లీలో పార్టీ భవనం నిర్మాణం కావడం ఓ మైలురాయిగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణం కోసం పార్టీ చేసిన అభ్యర్థన మేరకు కేంద్రం ఈ స్థలం కేటాయించింది. గతేడాది అక్టోబరు 9న వసంత విహార్ ప్రాంతంలో టీఆర్ఎస్‌కు వెయ్యి చదరపు గజాలకు పైగా భూమిని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. నవంబరు 4న టీఆర్ఎస్‌కు కేంద్రం అప్పగించింది. కొవిడ్ పరిస్థితుల కారణంగా అప్పటి నుంచి టీఆర్ఎస్ వర్గాలు వేచి చూశాయి. అప్పటి నుంచి మంచి ముహూర్తం కోసం వేచి చూసి ఇవాళ భూమి పూజ చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.

Also Read: Khammam: ఊరెళ్లిన మహిళ.. ఇంటికొచ్చి తలుపు తీయగానే హడల్! ఏం జరిగిందంటే..

Also Read: Weather Updates: రాగల రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Embed widget