By: ABP Desam | Updated at : 14 May 2022 01:19 PM (IST)
తెలంగాణ నుంచి కేంద్రం అదనపు ధాన్యం సేకరణ
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అదనపు ధాన్యం సేకరణకు అంగీకారం తెలిపింది. తెలంగాణ నుంచి మరో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారా బాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు బియ్యాన్ని బియ్యం భారత ఆహార సంస్థ (FCI) కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం పంపింది.తెలంగాణలో 2020-21 రబీ సీజన్లో సేకరించాల్సిన గడువును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇటీవల మే- 2022 వరకు ఏడోసారి పొడిగించారు.
హైదరాబాద్ మినహా తెలుగు రాష్ట్రాల్లో అన్ని లోక్ సభ స్థానాలు గెలుస్తాం, అమిత్ షాతో కేఏ పాల్
తెలంగాణ - కేంద్ర ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ధాన్యం సేకరణ అంశంలో తీవ్రంగా పోరాటం జరుగుతోంది. వడ్లు కొనాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తే.. బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం సేకరణ నిర్వహించి మిల్లర్లకు పంపుతోంది. ఆ తర్వాత బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వనుంది. ఇప్పటికీ ఈ ప్రక్రియ నడుస్తోంది. అయితే తెలంగాణలో ధాన్యం అధికంగా పండినందున అదనపు సేకరణ కోసం కేంద్రం అంగీకారం తెలిపింది.
ఛీ ఛీ పాల్ ను మేం టార్గెట్ చెయ్యడమేంటి ?
ఒప్పందం మేర బియ్యం ఇవ్వడం లేదని కూడా కేంద్రం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో ఎఫ్సీఐతో విచారణ కూడా చేయించింది. ప్రాథమిక విచారణలో భారీగా అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. దీంతో అన్ని రైస్ మిల్లుల్లోనూ విచారణ చేయాలని ఆదేశించారు. వారం రోజుల పాటు ఎఫ్సీఐ బృందాలు తనిఖీలు చేశాయి. ధాన్యం, బియ్యం బస్తాల నిల్వ ఎంత ఉంది? సీఎంఆర్ ఎంత ఇచ్చారో లెక్క చూసుకొని.. అంతా సరిగ్గా ఉంటే వెరిఫైడ్ అని ఆఫీసర్లు ధ్రువీకరించారు.
48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు - బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీస్!
లెక్కించలేకుండా బస్తాలు పెట్టిన మిల్లులకు సంబంధించి బియ్యం తీసుకునే ప్రసక్తే లేదని ఎఫ్సీఐ స్పష్టం చేసింది. బియ్యం ఎఫ్సీఐ తీసుకోవాలని మిల్లులు అనుకుంటే.. మళ్లీ ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సిందేనని ధాన్యం బస్తాలు, బియ్యం బస్తాల లెక్క సరిచూసుకోవాల్సిందేనని తెలిపింది. ఇప్పుడు తనిఖీలు కూడా పూర్తయినందున అదనపు బియ్యం సేకరణకు అనుమతి ఇచ్చారు. దీంతో సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు.
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్పై కేసీఆర్ ప్రశంసల జల్లు !
Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్బాడీ అప్పగింత
KTR London Tour : తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలి- ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపు
Bhadrachalam ఎక్సైజ్ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కారు - పోలీసుల ఛేజింగ్తో చివరకు ఊహించని ట్విస్ట్
Petrol Diesel Prices down: పెట్రోల్పై రూ.9.5, డీజిల్పై రూ.7 తగ్గింపు - గుడ్న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Revant Reddy : కేసిఆర్ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
Thailand Open: ప్చ్.. సింధు! చెన్యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !