అన్వేషించండి

యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం

ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి ఐకేరెడ్డి

బాసర ఆలయం మహిమాన్విత క్షేత్రంగా రూపుదిద్దుకోబోతోంది. ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. రూ.150 కోట్ల నిధులతో బాసరను అద్భుత ఆలయంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించారు.

బాసర! జ్ఞానసరస్వతీ అమ్మవారు కొలువైన పుణ్యక్షేత్రం! దేశంలో రెండే రెండు జ్ఞాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి జమ్మూలో ఉంటే, రెండో ఆలయం తెలంగాణలోని బాసరలో కొలువై ఉంది. జ్ఞాన సరస్వతీ అమ్మవారు- మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారిక్కడ. వేద వ్యాసుడు ఈ క్షేత్రాన్ని స్థాపించాడని స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత కాలంలో ఆలయం నిర్మితమైందని చరిత్ర చెబుతోంది. పుణ్యగోదావరి తీరాన ప్రశాంతమైన వాతావరణంలో ఈ కోవెల అలరారుతోంది. ఈ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే బాగా చదువుతారని జనం నమ్మకం. జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండజ్యోతికి నూనె సమర్పించడానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు. బాసర క్షేత్రానికి నిత్యం పదివేలకు తగ్గకుండా భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు అక్షర శ్రీకార పూజలు వందల సంఖ్యలో అవుతుంటాయి. యేటా శరన్నవరాత్రులు కన్నుల పండువగా జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టింది ప్రభుత్వం

రాష్ట్రంలోని ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్.. నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయాన్ని కూడా దివ్యక్షేత్రంగా పునర్నిర్మించడానికి నడుం బిగించారు. సీఎం ఆదేశాల మేరకు బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. అంతకు ముందు ఆలయంలో శ్రీ పీఠం నాచగిరి మధుసూదనంద సరస్వతీ స్వామి సమక్షంలో వివిధ పూజలు చేశారు.

బాసర ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.8 కోట్ల వ్యయంతో 50 ఏసీ గదులను నిర్మించారు. వాటికి ఆన్ లైన్‌లో బుకింగ్ సదుపాయం కల్పించారు. శృంగేరీ పీఠం సూచనల ప్రకారం గర్భగుడి, నాలుగు రాజగోపురాలు, కోనేరు, మాడవీధులన్నీ పునర్నిర్మిస్తారు. యాదాద్రి ఆలయం తరహాలోనే బాసరలో కూడా పూర్తిగా కృష్ణశిలలనే ఉపయోగిస్తారు. గోదావరి దగ్గర భక్తుల పుణ్యస్నానాల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మొత్తం రూ.150 కోట్లు ఖర్చుపెట్టి యాదాద్రి తరహాలో బాసరను అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

బాసర క్షేత్రానికి తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రతీ రోజు భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం బాసర వరకు రైల్వే లైన్ ఉంది. తాజాగా ఫకీరాబాద్- భైంసా వరకు నేషనల్ హైవే కూడా మంజూరైంది. ఈ హైవే కూడా అందుబాటులోకి వస్తే, భక్తులు మరింత సులభంగా బాసర చేరుకోవచ్చు. మొత్తమ్మీద మరో వెయ్యి ఏళ్లు అయినా చెక్కు చెదరకుండా బాసరను అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు.

మాస్టర్‌ ప్లాన్‌ను సీఎం కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్తామని, ఆమోదం పొందగానే 15 రోజుల్లో టెండర్లు పిలిచి వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మొదటి విడతలో రూ.100 కోట్లతో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇప్పటికే రూ. 50 కోట్ల నిధుల్లో రూ.8 కోట్లతో ఆలయ అతిథి గృహాలను నిర్మించినట్టు చెప్పారు. ప్రస్తుతం రూ.42 కోట్లు అందుబాటులో ఉండగా, మరో రూ.50 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఆలయ అధికారులు, అర్చకులు, ఇంజినీర్లతో కలిసి మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలించి అభివృద్ధి పనులపై చర్చించారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వాహనదారులకు షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Bandi Bhagirath: అమ్మాయి బాగుంది... మూసుకుని పెళ్లి చేసుకో - బండి భగీరథపై పబ్లిక్ స్టార్ ట్వీట్
అమ్మాయి బాగుంది... మూసుకుని పెళ్లి చేసుకో - బండి భగీరథపై పబ్లిక్ స్టార్ ట్వీట్
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Hyderabad To Visakha Trains: నేడు హైదరాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్.. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు
నేడు హైదరాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్.. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
AP University Posts: ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
Prateek Yadav Last Rites: అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
Formula E Race Case: కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Embed widget