అన్వేషించండి

యాదాద్రిలాగే బాసర కూడా కృష్ణశిలాశోభితం

ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి ఐకేరెడ్డి

బాసర ఆలయం మహిమాన్విత క్షేత్రంగా రూపుదిద్దుకోబోతోంది. ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. రూ.150 కోట్ల నిధులతో బాసరను అద్భుత ఆలయంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించారు.

బాసర! జ్ఞానసరస్వతీ అమ్మవారు కొలువైన పుణ్యక్షేత్రం! దేశంలో రెండే రెండు జ్ఞాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటి జమ్మూలో ఉంటే, రెండో ఆలయం తెలంగాణలోని బాసరలో కొలువై ఉంది. జ్ఞాన సరస్వతీ అమ్మవారు- మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారిక్కడ. వేద వ్యాసుడు ఈ క్షేత్రాన్ని స్థాపించాడని స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత కాలంలో ఆలయం నిర్మితమైందని చరిత్ర చెబుతోంది. పుణ్యగోదావరి తీరాన ప్రశాంతమైన వాతావరణంలో ఈ కోవెల అలరారుతోంది. ఈ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే బాగా చదువుతారని జనం నమ్మకం. జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండజ్యోతికి నూనె సమర్పించడానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు. బాసర క్షేత్రానికి నిత్యం పదివేలకు తగ్గకుండా భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు అక్షర శ్రీకార పూజలు వందల సంఖ్యలో అవుతుంటాయి. యేటా శరన్నవరాత్రులు కన్నుల పండువగా జరుగుతుంటాయి. ఈ పరిస్థితుల్లో భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టింది ప్రభుత్వం

రాష్ట్రంలోని ఆలయాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్.. నిర్మల్ జిల్లాలోని బాసర ఆలయాన్ని కూడా దివ్యక్షేత్రంగా పునర్నిర్మించడానికి నడుం బిగించారు. సీఎం ఆదేశాల మేరకు బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. అంతకు ముందు ఆలయంలో శ్రీ పీఠం నాచగిరి మధుసూదనంద సరస్వతీ స్వామి సమక్షంలో వివిధ పూజలు చేశారు.

బాసర ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.8 కోట్ల వ్యయంతో 50 ఏసీ గదులను నిర్మించారు. వాటికి ఆన్ లైన్‌లో బుకింగ్ సదుపాయం కల్పించారు. శృంగేరీ పీఠం సూచనల ప్రకారం గర్భగుడి, నాలుగు రాజగోపురాలు, కోనేరు, మాడవీధులన్నీ పునర్నిర్మిస్తారు. యాదాద్రి ఆలయం తరహాలోనే బాసరలో కూడా పూర్తిగా కృష్ణశిలలనే ఉపయోగిస్తారు. గోదావరి దగ్గర భక్తుల పుణ్యస్నానాల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మొత్తం రూ.150 కోట్లు ఖర్చుపెట్టి యాదాద్రి తరహాలో బాసరను అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

బాసర క్షేత్రానికి తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రతీ రోజు భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం బాసర వరకు రైల్వే లైన్ ఉంది. తాజాగా ఫకీరాబాద్- భైంసా వరకు నేషనల్ హైవే కూడా మంజూరైంది. ఈ హైవే కూడా అందుబాటులోకి వస్తే, భక్తులు మరింత సులభంగా బాసర చేరుకోవచ్చు. మొత్తమ్మీద మరో వెయ్యి ఏళ్లు అయినా చెక్కు చెదరకుండా బాసరను అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు.

మాస్టర్‌ ప్లాన్‌ను సీఎం కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్తామని, ఆమోదం పొందగానే 15 రోజుల్లో టెండర్లు పిలిచి వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మొదటి విడతలో రూ.100 కోట్లతో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇప్పటికే రూ. 50 కోట్ల నిధుల్లో రూ.8 కోట్లతో ఆలయ అతిథి గృహాలను నిర్మించినట్టు చెప్పారు. ప్రస్తుతం రూ.42 కోట్లు అందుబాటులో ఉండగా, మరో రూ.50 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఆలయ అధికారులు, అర్చకులు, ఇంజినీర్లతో కలిసి మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలించి అభివృద్ధి పనులపై చర్చించారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget