అన్వేషించండి

Bandi Sanjay Protest: గ్రూప్ 1 వివాదంపై రోడ్డుపై బైఠాయించి బండి సంజయ్ నిరసన, ఛలో సెక్రటేరియట్‌కు పిలుపు

Telangana Group 1 News | తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ వివాదం ముదురుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అశోక్ నగర్ కు వెళ్లి గ్రూప్ 1 అభ్యర్థులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Bandi Sanjay meeets Group 1 aspirants at Ashok Nagar | హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. గ్రూప్ 1 అభ్యర్థుల కష్టాలకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ బాధితులు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులను ఆశ్రయించి తమకు న్యాయం జరిగేలా చేయాలని కోరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను గ్రూప్ 1 బాధితులు కలిశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన గ్రూప్ 1 అభ్యర్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి, తమకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 29 ఉత్వర్వులతో తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు వాపోయారు.

రోడ్డెక్కి నిరసన, ఛలో సెక్రటేరియట్ కు పిలుపు
గ్రూప్ 1 అభ్యర్థులను  కలిసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అశోక్ నగర్ కు వెళ్లారు. కేంద్ర మంత్రిని అయినా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం రోడ్డెక్కి నిరసన తెలిపారు. గ్రూప్స్ అభ్యర్థుల పరిస్కారం కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఛలో సెక్రటేరియట్ కు బండి సంజయ్ పిలుపునిచ్చారు. గ్రూప్ 1 వాయిదా వేయాలని, జీవో 29 వెనక్కి తీసుకుని తమ సమస్యలు పరిష్కరించేందుకు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దాంతో గ్రూప్ అభ్యర్థులు వేలాదిగా సెక్రటేరియట్ వైపు కదులుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

అంతకు ముందు గ్రూప్ 1 అభ్యర్థుల పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. తాము హాస్టళ్లలో చదువుకుంటున్నా కూడా బయటకు లాక్కొచ్చి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలం అని కూడా చూడకుండా హాస్టల్ లోకి చొరబడి బట్టలు చింపేస్తున్నారని మహిళా అభ్యర్థులు కేంద్ర మంత్రికి చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఏమైనా ప్రశ్నిస్తే తమపై నక్సలైట్స్ అని, లేక ఏవైనా ముద్ర వేస్తారని చెప్పారు. రాముడి వనవాసం మాదిరిగా గ్రూప్ 1 పరీక్షల కోసం 12 ఏళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చిందని అభ్యర్థులు బండి సంజయ్ కి తమ సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలుగు అకాడమీ సిలబస్ చదవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని అభ్యర్థులు వాపోయారు. మీడియా నుంచి తమకు సహకారం అందడం  లేదని అభ్యర్థులు ఆరోపించారు. తమకు ఎవరూ న్యాయం చేయడం లేదని, మీరు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ ని గ్రూప్ 1 అభ్యర్థులు కోరారు. నిరుగ్యోగులు, అభ్యర్థుల వినతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మీ పక్షాన బీజేపీ నేతలు పోరాడుతారని భరోసా ఇచ్చారు. ప్రశాంతంగా చదువుకోవాలని, న్యాయం జరిగేవరకు పోరాడతామని హామీ ఇచ్చారు. కాగా, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ మొదలవుతాయి.

Also Read: Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Telugu TV Movies Today: ఈ సోమవారం (డిసెంబర్ 29) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
ఈ సోమవారం (డిసెంబర్ 29) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Tension in Nuzvid: నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. న్యాయం కోసం యువతి రోడ్డుపై బైఠాయింపు - నూజివీడులో ఘటన
నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. న్యాయం కోసం యువతి రోడ్డుపై బైఠాయింపు - నూజివీడులో ఘటన
Embed widget