అన్వేషించండి

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో విషాదం, వేర్వేరు చోట్ల ఆరుగురు మృత్యువాత

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పడుగులు పడ్డాయి.

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పడుగులు పడ్డాయి. జయశంకర్ జిల్లలాలో మగ్గురు మృతి చెందారు. అలాగే ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పిడుగు పడడంతో మొబైల్ పేలి యువకుడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయి ఓ చిరు వ్యాపారి మృత్యువాత పడ్డారు. నంద్యాల జిల్లాలో మట్టి మిద్దె కూలి వృద్ధురాలు మత్యువాత పడింది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. స్థానికుల వివరాల మేరకు.. చిట్యాల మండల కేంద్రానికి చెందిన చిలువేరు సరిత(30), నేర్పాటి మమత(32), పర్లపెల్లి భద్రమ్మ, ఆరెపల్లి కొమరమ్మ, మైదం ఉమా, కుమార్‌ శాంతినగర్ శివారులో మంగళవారం మిరప మొక్కలు నాటేందుకు వెళ్లారు. 

మధ్యాహ్న సమయంలో పని చేస్తుండగా పెద్ద వర్షం కురిసింది. దీంతో కూలీలంతా పని ఆపేసి తడవకుండా ఉండేందుకు చేను పక్కనే ఉన్న చెట్టు కిందికి వచ్చారు.  ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో సరిత, మమత అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని 108 వాహనంలో చిట్యాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పనికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. అలాగే కాటారం మండలం దామెరకుంటలో పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి రైతు రాజేశ్వర్‌రావు(46) మృతి చెందారు.  

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో యువకుడి దుర్మరణం
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జోగుంపేటలో సోమవారం విషాద ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం సూదవరపు జయంత్(23), మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగుపాటుకు గురయ్యారు. ఈ క్రమంలో జయంత్ జేబులోని ఫోన్ పేలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది. 

ప్రకాశం జిల్లాలో కూడా ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. తురిమెళ్ళకు చెందిన మహమ్మద్ ఖాశిం బైక్ పై వెళ్తూ రాచర్ల మండలం అక్కపల్లి వద్ద ప్రవహిస్తున్న వాగులో పడి కొట్టుకుపోయాడు. మంగళవారం ఉదయం మృతదేహం సంఘటన స్థలానికి కొంత దూరంలో లభ్యమైంది. బంధువులు మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుని స్వగ్రామం గిద్దలూరు మండలం బురుజు పల్లె గ్రామం. కంభంలో ఉంటూ కూరగాయాల వ్యాపారం చేసుకునేవాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మట్టి మిద్దె కూలి ఒకరు మృతి 
నంద్యాల జిల్లా పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో గ్రామంలో మట్టి మిద్దె కూలి వనం నాగమ్మ (85) అనే వృద్ధురాలు మృతి చెందింది. మరో వృద్ధురాలు శివనాగమ్మ (75) తీవ్రంగా గాయపడింది.  బాధితురాలిని చికిత్స నిమిత్తం శాంతిరాం ఆసుపత్రికి తరలించారు. దీనిపై నంద్యాల జిల్లా సీపీఐ కార్యదర్శి రంగనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టిమిద్దెలపై ప్రచారం చేయడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షలు, గాయపడిన మహిళ కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget