అన్వేషించండి

Hyderabad News: భాగ్యనగరంలో భారీ వర్షాలు - వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత

Telangana News: భారీ వర్షాలతో భాగ్యనగరంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రహరీ గోడ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. విద్యుత్ షాక్ తో ఐదేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు.

14 People Died Due To Heavy Rains In Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షాల వల్ల మంగళవారం రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ (Bachupally Police Station) పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ ప్రహరీ మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయి దాన్ని ఆనుకొని ఉన్న రేకుల షెడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో షెడ్డులో నివసిస్తోన్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఇక్కడ గతంలో 10 - 15 అడుగుల ఎత్తు వరకూ ప్రహరీ నిర్మించగా.. తర్వాత దానినే 30 - 40 అడుగులకు పెంచడంతో వర్షపు నీటికి పునాదులు బలహీనపడి కూలినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన ఆయన.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆరుగురి అరెస్ట్

ఈ ప్రమాదంలో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం ఆరుగురిని అరెస్ట్ చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రాన్సిస్, కాంట్రాక్టర్ రాజేష్, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు.

విద్యుత్ షాక్ తో

మొయినాబాద్ మండలం చిన్నమంగళారానికి చెందిన జహేరాబేగం (47) మంగళవారం రాత్రి కూరగాయలు కొనేందుకు బయటకు రాగా.. ఆర్చ్ కూలి ఆమె తలపై పడింది. దీంతో తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. అలాగే, హయత్ నగర్ ముదిరాజ్ కాలనీకి చెందిన అంజలి అనే మహిళ బుధవారం ఉదయం పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ కోసం స్వచ్ఛ ఆటోలో తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి భారీ గాలులకు కుంట్లూర్ సన్ రైజ్ కాలనీ రోడ్డు 3లో విద్యుత్ తీగ తెగిపడింది. దీన్ని గమనించిన ఆమె సమీపంలోని భవన నిర్మాణ కార్మికులను పిలవడానికి వెళ్లారు. ఈలోపు ఆటో దిగిన ఆమె కుమారుడు శివశంకర్ (5) విద్యుత్ తీగ తగలి విద్యుత్ షాక్ తో చనిపోయాడు. అటు, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ కు చెందిన షేక్ పర్వేజ్ (40) వర్షంలో తన పంక్చర్ దుకాణం బయట ట్యూబ్ లైట్ తీస్తుండగా విద్యుత్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, చందానగర్ లోని గంగారంలో బీహార్ కు చెందిన దమేంద్ర కుమార్ యాదవ్ (33) తాను పని చేసే టీ బండిని విద్యుత్ స్తంభానికి గొలుసుతో కడుతుండగా.. విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. అటు, మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) మంగళవారం రాత్రి వర్షానికి జారి పడి ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: Ys Sharmila: 'కడపలో న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా?' - అవినాష్ పై షర్మిల తీవ్ర విమర్శలు, జైల్లో ఉండే నాయకుడు అవసరం లేదన్న సునీత

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget