అన్వేషించండి

Hyderabad News: భాగ్యనగరంలో భారీ వర్షాలు - వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాత

Telangana News: భారీ వర్షాలతో భాగ్యనగరంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రహరీ గోడ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. విద్యుత్ షాక్ తో ఐదేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు.

14 People Died Due To Heavy Rains In Hyderabad: భాగ్యనగరంలో భారీ వర్షాల వల్ల మంగళవారం రాత్రి జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ (Bachupally Police Station) పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ ప్రహరీ మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయి దాన్ని ఆనుకొని ఉన్న రేకుల షెడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో షెడ్డులో నివసిస్తోన్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఇక్కడ గతంలో 10 - 15 అడుగుల ఎత్తు వరకూ ప్రహరీ నిర్మించగా.. తర్వాత దానినే 30 - 40 అడుగులకు పెంచడంతో వర్షపు నీటికి పునాదులు బలహీనపడి కూలినట్లు తెలుస్తోంది. మృతులంతా ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన ఆయన.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆరుగురి అరెస్ట్

ఈ ప్రమాదంలో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం ఆరుగురిని అరెస్ట్ చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్ రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రాన్సిస్, కాంట్రాక్టర్ రాజేష్, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు.

విద్యుత్ షాక్ తో

మొయినాబాద్ మండలం చిన్నమంగళారానికి చెందిన జహేరాబేగం (47) మంగళవారం రాత్రి కూరగాయలు కొనేందుకు బయటకు రాగా.. ఆర్చ్ కూలి ఆమె తలపై పడింది. దీంతో తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. అలాగే, హయత్ నగర్ ముదిరాజ్ కాలనీకి చెందిన అంజలి అనే మహిళ బుధవారం ఉదయం పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ కోసం స్వచ్ఛ ఆటోలో తన ముగ్గురు పిల్లలను వెంట తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి భారీ గాలులకు కుంట్లూర్ సన్ రైజ్ కాలనీ రోడ్డు 3లో విద్యుత్ తీగ తెగిపడింది. దీన్ని గమనించిన ఆమె సమీపంలోని భవన నిర్మాణ కార్మికులను పిలవడానికి వెళ్లారు. ఈలోపు ఆటో దిగిన ఆమె కుమారుడు శివశంకర్ (5) విద్యుత్ తీగ తగలి విద్యుత్ షాక్ తో చనిపోయాడు. అటు, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్ మెట్ కు చెందిన షేక్ పర్వేజ్ (40) వర్షంలో తన పంక్చర్ దుకాణం బయట ట్యూబ్ లైట్ తీస్తుండగా విద్యుత్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, చందానగర్ లోని గంగారంలో బీహార్ కు చెందిన దమేంద్ర కుమార్ యాదవ్ (33) తాను పని చేసే టీ బండిని విద్యుత్ స్తంభానికి గొలుసుతో కడుతుండగా.. విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. అటు, మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) మంగళవారం రాత్రి వర్షానికి జారి పడి ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: Ys Sharmila: 'కడపలో న్యాయం గెలుస్తుందా? నేరం గెలుస్తుందా?' - అవినాష్ పై షర్మిల తీవ్ర విమర్శలు, జైల్లో ఉండే నాయకుడు అవసరం లేదన్న సునీత

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha Letter CM Revanth : దేవాదాయశాఖలో కడియం శ్రీహరి జోక్యం - కొండా సురేఖ ఆగ్రహం - సీఎంకు ఘాటు లేఖ
దేవాదాయశాఖలో కడియం శ్రీహరి జోక్యం - కొండా సురేఖ ఆగ్రహం - సీఎంకు ఘాటు లేఖ
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
Kavitha New Party TRS Name Dispute : టీఆర్‌ఎస్ పేరుపై కవితకు దిల్లీ హైకోర్టులో ట్విస్ట్! ఈసీనే తేల్చాలని ఆదేశం.. అసలు ఊరట దక్కినట్లేనా?
టీఆర్‌ఎస్ పేరుపై కవితకు దిల్లీ హైకోర్టులో ట్విస్ట్! ఈసీనే తేల్చాలని ఆదేశం.. అసలు ఊరట దక్కినట్లేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Embed widget