అన్వేషించండి

Redmi Smart TV X43: రెడ్‌మీ చవకైన 4కే స్మార్ట్ టీవీ వచ్చేస్తుంది.. ఫిబ్రవరి 9న లాంచ్.. ధర ఎంత ఉండనుంది?

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ షియోమీ తన కొత్త స్మార్ట్ టీవీని మనదేశంలో ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 మనదేశంలో ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో 43 అంగుళాల 4కే డిస్‌ప్లేను అందించనున్నారు. రెడ్‌మీ నోట్ 11ఎస్, రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోలతో పాటు ఈ టీవీ లాంచ్ కానుంది.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్50, ఎక్స్55, ఎక్స్65 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎక్స్ సిరీస్ లైనప్‌లో అన్నిటి కంటే చిన్న డిస్‌ప్లే ఉన్న టీవీ ఇదే కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెడ్‌మీ స్మార్ట్ టీవీలో 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. కానీ త్వరలో లాంచ్ కానున్న 43 అంగుళాల టీవీలో 4కే డిస్‌ప్లేను అందించనున్నారు. దీంతోపాటు ఇది 4కే హెచ్‌డీఆర్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.

ఈ స్మార్ట్ టీవీలో అందించే ప్రాసెసర్ గురించి కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ టీవీ ‘ఫ్యూచర్ రెడీ ఫ్లాగ్ షిప్ పెర్ఫార్మెన్స్‌’ను అందిస్తుందని కంపెనీ తన ఈవెంట్ పేజీలో పేర్కొంది. రెడ్‌మీ గతంలో లాంచ్ ఎక్స్-సిరీస్ స్మార్ట్ టీవీల్లో క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను అందించారు. వీటిలో 2 జీబీ ర్యామ్ కూడా ఉంది. 30W సౌండ్ అవుట్‌పుట్‌ను ఈ స్మార్ట్ టీవీ అందించనుంది. డాల్బీ ఆడియో ఫీచర్ కూడా ఇందులో ఉంది.

ఇక సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే.. రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో కంపెనీ లేటెస్ట్ ప్యాచ్‌వాల్ సాఫ్ట్ వేర్‌ను అందించనున్నారు. ఐఎండీబీ ఇంటిగ్రేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. ప్యాచ్‌వాల్ అనేది షియోమీ లాంచర్. ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి కంటెంట్‌ను ఇది మీ స్మార్ట్ టీవీలో డిస్‌ప్లే చేయనుంది.

దీంతోపాటు స్మార్ట్ లైట్స్, ఎంఐ ఎయిర్ ప్యూరిఫయర్ వంటి వాటిని ఇది సపోర్ట్ చేయనుంది. షియోమీ దీని ధరను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్50 ధర రూ.37,999గా ఉంది. సాధారణంగా 43 అంగుళాల టీవీల ధరలు రూ.30 వేలలోపే ఉంటాయి. కాబట్టి దీని ధర కూడా ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget