By: ABP Desam | Updated at : 05 Sep 2021 10:25 AM (IST)
కృష్ణ నాగర్
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. శక్తి వంచన లేకుండా పతకాల కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కృష్ణ నాగర్ నేడు జరిగిన పురుషుల సింగిల్స్ ఎస్హెచ్6 ఫైనల్లో హాంకాంగ్ ప్లేయర్ మన్ కై చుపై విజయం సాధించాడు. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని యావత్ భారతావని గర్వించేలా చేశాడు.
అయితే తొలి గేమ్ను 21-17తో నాగర్ ముగించాడు. రెండో గేమ్ లో ప్రత్యర్థి, హాంకాంగ్ ఆటగాడు 21-16తో నెగ్గి మ్యాచ్ టై చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ ను 21-15ను నెగ్గడంతో పాటు మ్యాచ్లో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దాంతో పారాలింపిక్స్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో నాగర్ పట్టు వదలకుండా పాయింట్లు సాధించాడు. స్వర్ణమే లక్ష్యంగా పాయింట్లు సాధిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసి విజయం సాధించాడు. రెండో గేమ్ లో చేసిన పొరపాట్లను రిపీట్ చేయకుండా ఎదురుదాడికి దిగడంతో విజయం వరించింది.
Also Read: Suhas Yathiraj Wins Silver: భారత్ ఖాతాలో మరో పతకం.. రజతం సాధించిన సుహాస్ యతిరాజ్
Tokyo Paralympics, Badminton Men's Singles SH6: Krishna Nagar beats Kai Man Chu to win Gold pic.twitter.com/r6jpcFhxuc
— ANI (@ANI) September 5, 2021
జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది. అందులో 5 స్వర్ణాలుండగా.. 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్లో భారత్ తరఫున స్వర్ణం నెగ్గిన తొలి మహిళా అథ్లెట్ అవని లేఖరా నేటి ముగింపు వేడుకల్లో భారత పతాకధారిగా వ్యవహరించనున్నారు.
పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత ఆటగాడు కృష్ణ నాగర్ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు.
Historic performance by Krishan Nagar. Strong and determined, you proved your mettle by winning the gold medal in badminton at #Paralympics and keeping the tricolour high. Your excellence is commendable. Many Indians will be inspired by you. Congratulations and best wishes.
— President of India (@rashtrapatibhvn) September 5, 2021
భారతీయుల ముఖాల్లో చిరునవ్వును తీసుకొచ్చావంటూ ప్రధాని మోదీ కొనియాడారు. స్వర్ణం నెగ్గినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Happy to see our Badminton players excel at the Tokyo #Paralympics. The outstanding feat of @Krishnanagar99 has brought smiles on the faces of every Indian. Congratulations to him for winning the Gold Medal. Wishing him the very best for his endeavours ahead. #Praise4Para pic.twitter.com/oVs2BPcsT1
— Narendra Modi (@narendramodi) September 5, 2021
Cricket: క్రికెట్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ - 2028లో కూడా!
డోపింగ్ టెస్ట్ అంటే ఏమిటి.? ఈ టెస్ట్ చేసేటప్పుడు బట్టలన్నీ విప్పేయాలా?
Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్కౌంటర్- ఓ ఉగ్రవాది హతం
Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే
Neeraj Chopra: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!