అన్వేషించండి

Rishabh Pant :రిషబ్‌ పంత్‌ బ్యాటింగ్‌కి వచ్చాడోచ్‌! టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్!

Rishabh Pant : మాంచెస్టర్‌ టెస్టులో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్‌ రిషబ్‌ పంత్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్ చేశాడు.

Rishabh Pant : భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ రిషబ్‌ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. తన కాలి గాయం దిగమింగుతూనే బ్యాటింగ్ చేశాడు. గాయం వల్ల ఇబ్బంది పడుతూనే గ్రౌండ్‌లోకి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

314 పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ అవుటవ్వడంతో అతని స్థానంలో రిషబ్‌పంత్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను బ్యాటింగ్‌కు వస్తున్నప్పుడు ఇంగ్లండ్ అభిమానులు కూడా లేచి నిల్చొని స్వాగతం పలికారు. 

Image

మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే పంత్ బ్యాటింగ్‌కు వస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అవసరమైతే అతను బ్యాటింగ్‌కు సిద్ధమవుతాడని కూడా తెలిపింది. అయితే కీపింగ్‌కు మాత్రం చేయలేడదని అతని బదులు జురైల్ ఆ విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

Image

భారతదేశం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ వేసిన బంతి పంత్ కాలికి తగిలింది. ఆ ప్రభావం వెంటనే అసౌకర్యానికి దారి తీసింది.  దెబ్బతగిలిన వెంటనే బాధతో గ్రౌండ్‌లో కాసేపు తిరిగిన పంత్ తర్వాత కిందపడిపోయాడు. వెంటనే వైద్య సిబ్బంది వచ్చి చికిత్స అందించారు. అయినా నయం కాలేదు. దీంతో ప్రత్యేక వాహనంలో అతన్ని తరలించారు. అలా వెళ్లడంతో అంతా షాక్ అయ్యారు. అసలు పంత్ మళ్లీ ఆడతాడా అనే అనుమానం కలిగింది. అతను టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు బ్యాటింగ్‌కు రావడంతో అభిమానులు హ్యాపిగా ఫీల్ అవుతున్నారు. 

Image

"మాంచెస్టర్ టెస్ట్‌లో మొదటి రోజు కుడి పాదానికి గాయమైన రిషబ్ పంత్, మ్యాచ్‌లోని మిగిలిన ఆటలో వికెట్ కీపింగ్ విధులను నిర్వర్తించబోడు. ధృవ్ జురెల్ వికెట్ కీపర్ పాత్రను పోషిస్తాడు.

"గాయం ఉన్నప్పటికీ, రిషబ్ పంత్ రెండో రోజు జట్టులో చేరాడు. జట్టు అవసరాలకనుగుణంగా బ్యాటింగ్‌కు అందుబాటులో ఉంటాడు." BCCI Xలో ఒక పోస్ట్‌లో తెలిపింది.

Image

పెద్ద ప్రమాదం ఏమీ లేదు!
BCCI అధికారిక ప్రకటన ప్రకారం, స్కానింగ్‌లు, వైద్య సహాయం కోసం పంత్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ, పెద్ద ప్రమాదం ఏదీ లేదు, కానీ గాయం తీవ్రంగా ఉండటం వల్ల ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ దూరంగా ఉంటాడు. 

వికెట్‌ కీపర్‌గా ధ్రువ్ జురెల్
మిగిలిన టెస్ట్‌కు ధ్రువ్ జురెల్ ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా అడుగుపెట్టాడు. సిరీస్‌లో ముందుగా అరంగేట్రం చేసిన జురెల్, పంత్ కోలుకునే వరకు ఆ బాధ్యతలు తీసుకుంటాడు. జట్టుకు అవసరమైతే భారతదేశ రెండో ఇన్నింగ్స్‌లో పంత్ తిరిగి బ్యాటింగ్‌కు రావడానికి అవకాశాలు ఉన్నాయి.  

లోయర్-మిడిల్ ఆర్డర్‌లో పంత్ బ్యాటింగ్ జట్టుకు చాలా సార్లు ఆదుకుంది. మ్యాచ్‌ స్వభావాన్ని మార్చే సత్తా ఉన్న ఆటగాడు. అతని స్ట్రోక్‌ప్లే, ఎదురుదాడి చేసే సామర్థ్యం పంత్ ప్రత్యర్థులకు భయం పుట్టిస్తుంది. ముఖ్యంగా సవాలుతో కూడిన పిచ్‌లపై విలువైన ఆటగాడిగా ఉన్నాడు. అందుకే జట్టు యాజమాన్యం అతని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుంది, 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
BCCI Announces Reward: భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
Sanju Samson and Sachin Tendulkar: సంజూ శామ్సన్ విశ్వరూపం వెనుక ఆ 25 నిమిషాల ఫోన్ కాల్! సచిన్ చెప్పిన మంత్రం ఏంటీ?
సంజూ శామ్సన్ విశ్వరూపం వెనుక ఆ 25 నిమిషాల ఫోన్ కాల్! సచిన్ చెప్పిన మంత్రం ఏంటీ?
Team India : ఒక మ్యాచ్ ఆడినందుకు టీం ఇండియాకు రూ. 3 కోట్లు, పాకిస్తాన్‌కు రూ. 49 లక్షలు మాత్రమే, ఎలాగో తెలుసా?
ఒక మ్యాచ్ ఆడినందుకు టీం ఇండియాకు రూ. 3 కోట్లు, పాకిస్తాన్‌కు రూ. 49 లక్షలు మాత్రమే, ఎలాగో తెలుసా?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget