By: ABP Desam | Updated at : 04 Jul 2022 01:24 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
భారీ షాట్ ఆడుతున్న పుజారా (Image Source: BCCI)
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా మెల్లగా పట్టు బిగిస్తుంది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (17 బ్యాటింగ్: 39 బంతుల్లో, రెండు ఫోర్లు), హనుమ విహారి (10 బ్యాటింగ్: 37 బంతుల్లో, ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. దీంతో టీమిండియా మొత్తం ఆధిక్యం 169 పరుగులకు చేరుకుంది.
132 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో బంతికే ఓపెనర్ శుభ్మన్ గిల్ను అవుట్ చేసి అండర్సన్ టీమిండియాను తొలి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత హనుమ విహారి, పుజారా కలిసి మరో వికెట్ పడకుండా సెషన్ ముగించారు.
ప్రస్తుతానికి టీమిండియా 169 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మన్ 300 పరుగులు చేసినా మొత్తం ఆధిక్యం 442 పరుగులకు చేరుతుంది. అది ఇంగ్లండ్కు కచ్చితంగా భారీ లక్ష్యమే. కాబట్టి రెండో ఇన్నింగ్స్లో కనీసం 300 పరుగులు చేయడాన్ని టీమిండియా లక్ష్యంగా పెట్టుకోవాలి. దాన్ని కూడా వేగంగా చేరుకోవాలి. ప్రస్తుతానికి ఇంకా ఏడు సెషన్ల ఆట మిగిలి ఉంది. నాలుగో రోజు లంచ్ సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే ఐదు సెషన్లలో ఇంగ్లండ్ను ఆలౌట్ చేయడంపై ఆశలు పెట్టుకోవచ్చు.
Vinod Kambli: సచిన్ అంతటోడికి ఎందుకీ దుస్థితి!
India Vs Zimbabwe: పోరాడిన జింబాబ్వే టెయిలెండర్లు - భారత లక్ష్యం ఎంతంటే?
IND Vs ZIM 1st ODI: దీపక్ చాహర్ దెబ్బ అదుర్స్ - కష్టాల్లో జింబాబ్వే!
KKR New Head Coach: కప్పులు కొట్టే కోచ్ను నియమించుకున్న కేకేఆర్! మెక్కలమ్తో ఖేల్ ఖతం!
Virat Kohli Workout Video: జిమ్లో విరాట్ కసరత్తులు! చూస్తే మనకు చెమటలు పడతాయేమో!!
Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?
ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?
Rajinikanth as Governor: రజనీకాంత్కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?
SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!