అన్వేషించండి

Lord Shiva Temples: జీవితంలో ఒక్కసారైనా ఈ 7 శివాలయాలను దర్శించండి.. ఆ పుణ్యక్షేత్రాల ప్రత్యేకతలు ఇవే

Lord Shiva Temples: మీరు శివ భక్తులా? అయితే మీరు జీవితంలో తప్పకుండా ఈ ఏడు శివాలయాలను తప్పకుండా దర్శించాలి. వీటి ప్రత్యేకతలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

Lord Shiva Temples: మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ప్రతి శివభక్తుడు తమ జీవితంలో ఒక్కసారైన తప్పక సందర్శించాల్సిన ప్రసిద్ధ, చారిత్రాత్మకమైన శివాలయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

జీవితకాలంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన టాప్ 7 శివాలయాలు ఇవే: 

1. కాశీ విశ్వనాథ్ ఆలయం :

పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి, లేదా శివునికి అంకితం చేసిన దేవాలయాల్లో కాశీ విశ్వనాథ్ ఆలయం ఒకటి.  పవిత్రమైన గంగా నది పశ్చిమ ఒడ్డున వారణాసిలో ఉన్నది. ఈ అద్భుతమైన కాశీ విశ్వనాథ ఆలయం. ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ లేదా విశ్వేశ్వరర్ అని పిలుస్తారు. కాశీ విశ్వనాథుడు అంటే విశ్వానికి పాలకుడు అని అర్థం. ఈ ఆలయాన్ని సందర్శించడం, పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం విముక్తి లేదా మోక్షం లభిస్తుందని నమ్ముతుంటారు. జీవితంలో చేసిన పాపాలు తొలగిపోవాలంటే కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలని పెద్దలు చెబుతుంటారు. జీవితంలో ఒక్కసారైన కాశీని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది. 

2. తుంగనాథ్ ఆలయం :

ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం రుద్రప్రయాగ్ జిల్లాలో తుంగనాథ్ అద్భుతమైన పర్వతాల మధ్య ఉంది. ఈ ఆలయం 3680 మీటర్ల ఎత్తులో ఉంది. దాదాపు ఒక సహస్రాబ్ది కాలం నాటిది. ఈ ఆలయాన్ని పంచ కేదార్లలో ఒకటిగా భావిస్తారు. అర్జునుడు (మూడవ పాండవ యువరాజు) ఈ ఆలయానికి పునాది రాయి వేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తర భారత నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం చుట్టూ వివిధ దేవుళ్లకు అంకితం చేసిన పన్నెండు మందిరాలు ఉన్నాయి.

3. మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం:

తమిళనాడులోని మదురైలో వైగై నది దక్షిణ ఒడ్డున పురాతన మీనాక్షి అమ్మన్ ఆలయం ఉంది. సుమారుగా 1623, 1655 మధ్య నిర్మించిన ఈ ఆలయం  అద్భుతమైన నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మీనాక్షి ఆలయంలో ప్రధాన దేవతలు దేవి పార్వతి, మీనాక్షి,శివుడు కొలువై ఉన్నారు. ఈ దేవాలయం దేవుణ్ణి, అమ్మవారిని ఒకేసారి పూజించడం వల్ల మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుంది.

4. లింగరాజ్ దేవాలయం:

భువనేశ్వర్‌లో ఉన్న పురాతన దేవాలయం లింగరాజ్ ఆలయం. ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో జజాతి కేశరి రాజుచే నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. దాని పేరు సూచించినట్లుగా, శివునికి అంకితం చేశారు. ఇక్కడ లింగం, శివుని అభివ్యక్తి, సహజంగా ఉద్భవించిందని చెబుతున్నారు. 

5. లేపాక్షి ఆలయం:

వీరభద్ర దేవాలయం అని కూడా పిలిచే ఈ అద్భుతమైన లేపాక్షి దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఇది అద్భుతమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఇది పైకప్పుపై అమర్చిన స్తంభాలు, ఆశ్చర్యం కలిగించే గుహలు ఉంటాయి.  వీరభద్ర క్షేత్రం కేంద్రంగా పనిచేసిన లేపాక్షి సాంస్కృతికంగా, పురావస్తుపరంగా ముఖ్యమైనది. ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది.

6. ద్రాక్షారామం :

దేశంలోని శివునికి అంకితం చేసిన ఐదు అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన ఆలయాలలో ఒకటి ద్రాక్షారామం ఆలయం. ఇది గోదావరి తూర్పు ఒడ్డున ఉంది. రాజమండ్రి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ  ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

7. మల్లికార్జున స్వామి ఆలయం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం శ్రీశైలం ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివపార్వతులు కొలువై ఉన్నారు. పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం హిందూమతంలో శైవమతం, శక్తిమతం రెండింటికీ ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget