అన్వేషించండి

పాముల నాలుక రెండుగా ఎందుకు చీలిపోయింది? గరుత్మంతుడు, అమృతం, దాస్యం వెనుక అసలు కథ ఇదే! | Snake Facts

పాములకు రెండు నాలుకలుంటాయి..ఈ విషయం అందరకీ తెలిసిందే. అయితే పాములకు మాత్రమే 2 నాలుకలు ఎందుకుంటాయి? మొదట్లో ఒక నాలుకే ఉన్నప్పటికీ ఆ తర్వాత 2 నాలుకలు ఎలా అయ్యాయి...దీనివెనుకున్న పురాణగాథేంటి!

Why Do Snakes Have Forked Tongues:  కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువలకు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు. కద్రువ కోరిక ప్రకారం వెయ్యి పొడుగాటి శరీరం కలిగిన సంతానం, వినత కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానం కోరుతాడు కశ్యప ప్రజాపతి. ఈ మేరకు కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు ఉత్పన్నమవుతాయి. కద్రువ అండాల నుంచి  వాసుకి, ఆదిశేషుడు ఆదిగా మొత్తం 1000 పాములు జన్మిస్తాయి. వినత అది చూసి తొందరపడి తన అండాన్ని చిదిమేస్తుంది...అందులోంచి కాళ్లులేకుండా మొండెం మాత్రమే ఉండేవాడు జన్మిస్తారు. తనే అనూరుడు...అనూరుడు అంటే తొడలు లేనివాడు అని అర్థం. అలా జన్మించిన అనూరుడు...తల్లి వినతతో..నువ్వు సవతిని చూసి నన్ను చిదిమేశావు అందుకే ఆమెకు దాసిగా ఉండు..రెండో అండాన్ని జాగ్ర్తతగా చూసుకో..తనే నిన్ను దాస్యం నుంచి విముక్తుడిని చేస్తాడని చెప్పి సూర్యుడి రథసారధిగా వెళ్లిపోతాడు అనూరుడు.  
 
దాసిగా ఉండిపోయిన  వినత
వినత, కద్రువలు ఓ రోజు సముద్రం ఒడ్డుకి వెళ్లినప్పుడు క్షీర సాగరమథనంలో వచ్చిన ఉచ్చైశ్రవము అనే ఇంద్రుడి గుర్రం కనిపిస్తుంది. ఆ గుర్రాన్ని చూసిన కద్రువ తన సవతితో చూడు ఆ గుర్రం శరీరం తెల్లగా తోక నల్లగా ఉంది అంటుంది. కాదు కాదు గుర్రం తోక కూడా తెల్లగా ఉంది అంటుంది వినత. మర్నాడు వచ్చి చూద్దామని ఇద్దరూ పందెం వేసుకుంటారు...తోక తెల్లగా ఉంటే నీకు నేను దాస్యం చేస్తాను లేదంటే నువ్వు నాకు దాసిగా ఉండాలంటుంది. సరే అనుకుని ఇద్దరూ వెళ్లిపోతారు. కద్రువ తన సంతానాన్ని పిలిచి పందెం గురించి చెప్పి తోక నల్లగా ఉండేట్టు చేయమంటుంది. అది సరికాదని కొడుకులు అంగీకరించకపోవడంతో కోపంతో ...మీరు జనమేజయుడు చేసే యాగంలో మరణిస్తారని శాపం ఇస్తుంది. అది విన్న కర్కోటకుడు అమ్మా నేను వెళ్లి ఆ గుఱ్ఱం తోకకు చుట్టుకుని నల్లగా కనిపించేటట్లు చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత రోజు వినత, కద్రువ వెళ్లి చూడగా గుర్రం తోక నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత..దాస్యం చేసేందుకు అంగీకరిస్తుంది  

గరుత్ముంతుడి పుట్టుక
కొన్ని రోజులకు వినతకు గరుత్మంతుడు జన్మిస్తాడు. గరుడుడిని చూసిన కద్రువ...వినతా! నువ్వు దాసీ వి కాబట్టి నీ కుమారుడు కూడా నా దాసుడే అంటుంది. అలా గరుత్మంతుడు కూడా తన సవతి తమ్ముళ్లను ఎత్తుకుని తిప్పుతూ ఉండేవాడు. ఓ రోజు గరుత్మంతుడు సూర్యమండలం వైపు వెళ్లగా ఆ వేడికి సర్పాలు మాడిపోతుంటాయి...ఆ సమయంలో కత్రువ ఇంద్రుడిని ప్రార్థించి వాన కురిపించి..గరుడుడిని దూషిస్తుంది. ఆ క్షణం బాధపడిన గరుడుడు తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించాలని నిర్ణయించుకుని...అందుకోసం ఏం చేయాలని సవతి తల్లిని అడుగుతాడు. అప్పుడు కద్రువ... అమృతం తెచ్చి ఇస్తే దాస్యం నుంచి నీ తల్లికి విముక్తి కలిగిస్తానంటుంది.  
 
తల్లికి దాస్యం నుంచి విముక్తి
గరుత్మంతుడు అమృతం తీసుకుని వెళుతుండగా మార్గ మధ్యలో ఇంద్రుడు కనిపించి..అందరకీ అమరత్వం తగదని అడ్డుకుంటాడు. ఆ మాటలు అంగీకరించిన గరుడుడు...ఇంద్రుడితో ఒప్పందం కుదుర్చుకుంటాడు. తన తల్లి దాస్య విముక్తి కోసం అమృతం తీసుకెళుతున్నానని చెప్పి తన వంతుగా వాళ్ల చేతిలో అమృత కలశం పెడతాను మీరు వెంటనే తీసుకెళ్లిపోండి అని చెబుతాడు. అలా అమృత కలశాన్ని తీసుకెళ్లి తన సవతి సోదరులకు చూపించి దర్భలపై పెడతాడు. ఆ వెంటనే వినతకు దాస్యం నుంచి విముక్తి లభిస్తుంది. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనంగా వెళ్లిపోతాడు...

పాములకు రెండు నాలుకలకు కారణం ఇదే
అమృత కలశం చూసిన తర్వాత దాన్ని సేవించడానికి ముందు పవిత్రులవ్వాలని భావించి పాములన్నీ స్నానమాచరించేందుకు వెళ్లాయి. అదే తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని ఎత్తుకుపోతాడు. తిరిగి వచ్చిన సర్పాలు జరిగింది గ్రహించి.. కనీసం ఆ కలశం పెట్టిన దగ్గర ఏమైనా ఒలికిందేమో అనే ఆలోచనతో దర్భలని నాకుతాయి..దర్భ చాలా పదునుగా ఉండడం వల్ల పాముల నాలుకలు రెండుగా చీలిపోతాయి. అప్పటి నుంచి పాములకు రెండునాలుకలు శాశ్వతం అయిపోయాయి.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Advertisement

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget