అన్వేషించండి

Lord Krishna: శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత అర్జునుడు ఏమయ్యాడో తెలుసా?

Lord Krishna: శ్రీకృష్ణుడు, అర్జునుడు వ‌రుస‌కు బావ‌బావ‌మ‌రుదులైనా ప్రాణ స్నేహితులు. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత అర్జునుడు ఏమ‌య్యాడు.? అర్జునుడు కూడా చనిపోయాడా.?

Lord Krishna: హిందూ ధ‌ర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవుళ్లలో శ్రీకృష్ణుడు ముఖ్యుడు. శ్రీకృష్ణుడు నేతృత్వంలో జరిగిన మహాభారత యుద్ధంలో 100 మంది కౌరవ సోదరులు మరణించారు. దీని వల్ల ధృతరాష్ట్రుడు, గాంధారి కృంగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? అర్జునుడు, శ్రీకృష్ణుల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి..?

1.గాంధారి కోపం
మహాభారత యుద్ధం తరువాత, శ్రీకృష్ణుడు హస్తినాపుర రాజభవనానికి తిరిగి వస్తాడు. శ్రీకృష్ణుడిని చూడగానే గాంధారి కోపం దుఃఖంతో అగ్నిపర్వతంలా మారింది. తన 100 మంది కుమారులైన కౌరవులను రక్షించడానికి ఏమి చేయలేదని ఆమె శ్రీకృష్ణునిపై కోపంతో ఉంటుంది.

Also Read : శ్రీకృష్ణుడికి 8 అంకెకు విడదీయరాని సంబంధం, ఎందుకో తెలుసా?

2. గాంధారి శాపం
కొడుకులను కోల్పోయిన బాధతో గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. యుద్ధంలో కౌరవులు మరణించినందున యాదవ వంశం నాశనమైపోతుందని ఆమె శపించింది. గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుడు మరణిస్తాడు. య‌దు వంశం మొత్తం నశిస్తుంది.

3. ద్వారక నాశనం
గాంధారి తన ఒక్క శాపంతో విశ్రమించదు. ఆమె తన రెండవ శాపంగా ద్వారక నాశనం కావాల‌ని శపిస్తుంది. ఫలితంగా, శ్రీకృష్ణుడి ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుంది.

4. శ్రీకృష్ణుని నిర్యాణం
మృత్యువు తనను వేగంగా అధిగమించడానికి ప్రయత్నిస్తోందని గ్రహించిన శ్రీకృష్ణుడు దట్టమైన అడవికి వెళ్లి అక్కడ తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కడో ద్వారక. దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ అందుబాటులో బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణునికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనానికి వచ్చాడు. తపోవనమంతా రెండురోజులు కాళ్లరిగేలా తిరిగాడు. అలా వెతగ్గా.. వెతగ్గా మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు. కానీ ప్రాణం లేకుండా.! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలి పోయాడు, రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల తన దేహాన్ని విడిచి 4-5 రోజులు గడిచాయి. ఇక ఆ మృత దేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక , అక్కడే అర్జునుడొక్కడే ఏ అర్భాటమూ లేకుండా అంత్యక్రియలు పూర్తిచేశాడు. అష్టభార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావైన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు.

శ్రీకృష్ణుడు తనకు ఎంతో ఇష్ట‌మైన వేణువును విర‌గ్గొట్టడానికి కారణం ఎవ‌రో తెలుసా!

5. అర్జునుడి పరివర్తన
శ్రీకృష్ణుని మరణానంతరం అర్జునుడు తన శక్తులన్నింటినీ కోల్పోతాడు. కృష్ణుడి ఆత్మ ఆయ‌న‌ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆయ‌న‌ 16,100 మంది భార్యలతో సహా ద్వారకలోని పౌరులందరినీ అర్జునుడు ఇంద్రప్రస్థానికి తీసుకువెళతాడు.

శ్రీకృష్ణుడు అర్జునుడికి అత్యంత శక్తివంతమైన బంధువు, మార్గ‌ద‌ర్శి. శ్రీకృష్ణుడు చనిపోవడంతో అర్జునుడు తన శక్తినంతా కోల్పోయి సాధారణ పౌరుడిగా మిగిలిపోతాడు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Srael War: మంత్రవిద్య, దైవిక శక్తుల కథలు నిజమేనా? యుద్ధంలో సోషల్ మీడియా మాయాజాలం!
మంత్రవిద్య, దైవిక శక్తుల కథలు నిజమేనా? యుద్ధంలో సోషల్ మీడియా మాయాజాలం!
Lucky Birth Dates for Women: ఈ తేదీల్లో పుట్టిన స్త్రీలు భర్తలకు అదృష్టం తెస్తారా? సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?
ఈ తేదీల్లో పుట్టిన స్త్రీలు భర్తలకు అదృష్టం తెస్తారా? సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
2026 మార్చి 08 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 08 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Vijay Deverakonda: బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
బుజ్జితల్లి... ఇంటికి పిలుస్తా, భోజనం చేద్దాం - చిట్టి ఫ్యాన్‌కు విజయ్ దేవరకొండ ప్రామిస్
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Rapappa Song: అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Embed widget