అన్వేషించండి

Tamil Nadu Assembly Elections: తమిళనాడులో బ్రాహ్మణ నేతలకు నిరాదరణ - ఒక్క టిక్కెట్ కూడా కేటాయించని ప్రధాన పార్టీలు - ఇదేం రాజకీయం?

Assembly elections: తమిళనాడులో గత 35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా డీఎంకే , ఏఐఏడీఎంకే తో పాటు బీజేపీ, కాంగ్రెస్ కూడా ఒక్క బ్రాహ్మణ అభ్యర్థిని కూడా బరిలోకి దింపలేదు

No Brahmins in Tamil Nadu Assembly elections:  తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక చారిత్రక పరిణామానికి వేదికయ్యాయి. గత 35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన డీఎంకే , ఏఐఏడీఎంకే  తో పాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా ఒక్క బ్రాహ్మణ అభ్యర్థిని కూడా బరిలోకి దింపలేదు. ద్రవిడ ఉద్యమ పురిటిగడ్డపై మారుతున్న కుల సమీకరణాలు, సామాజిక ప్రాధాన్యతలకు ఈ పరిణామం అద్దం పడుతోంది.
  
జయలలిత అనంతర శూన్యం 

ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత స్వయంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆమె హయాంలో పార్టీలో ఆ వర్గానికి ప్రాధాన్యత ఉండేది. ఎంజీఆర్ కాలం నుంచి హెచ్.వి. హండే వంటి నేతలు మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించేవారు. అయితే, జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకేలో థేవర్‌, గౌండర్‌ వంటి ఓబీసీ సామాజిక వర్గాల ఆధిపత్యం పెరిగింది. 2021లో మైలాపూర్‌ నుంచి ఆర్. నటరాజ్‌ను బరిలోకి దింపిన ఏఐఏడీఎంకే, ఈసారి పూర్తిగా ఆ వర్గాన్ని పక్కన పెట్టడం గమనార్హం.

 బీజేపీ వ్యూహాత్మక మార్పు 

సాధారణంగా బ్రాహ్మణ సామాజిక వర్గం తమ సహజ మిత్రపక్షమని భావించే బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో ఏ ఒక్క బ్రాహ్మణుడికి టికెట్ ఇవ్వలేదు. హెచ్. రాజా, కేటీ రాఘవన్ వంటి ఉద్ధండులు రేసులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఓట్లు రాబట్టగల ఇతర బలమైన సామాజిక వర్గాలు నడార్, గౌండర్, వన్నియర్  అభ్యర్థులకే కమలం పార్టీ మొగ్గు చూపింది. ద్రవిడ పార్టీల బ్రాహ్మణ వ్యతిరేక  ముద్ర నుంచి బయటపడి, బహుజన పార్టీగా ఎదిగేందుకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

 చిన్న పార్టీల  బ్రాహ్మణ  అస్త్రం 

ప్రధాన పార్టీలు పక్కన పెట్టిన ఈ వర్గాన్ని చేరదీసేందుకు చిన్న పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి ఏకంగా ఆరుగురు బ్రాహ్మణ అభ్యర్థులను  బరిలోకి దింపింది.  బ్రాహ్మణులు కూడా తమిళులే అనే నినాదంతో సీమాన్ కొత్త ప్రయోగానికి తెరలేపారు. అలాగే, నటుడు విజయ్ నేతృత్వంలోని  తమిళగ వెట్రి కళగం కూడా మైలాపూర్, శ్రీరంగం వంటి నియోజకవర్గాల్లో ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టి, తాము అందరి పార్టీ అని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.

 ద్రవిడ సిద్ధాంతం - సామాజిక న్యాయం 

ద్రవిడ మున్నేట్ర కజగం ఎప్పుడూ బ్రాహ్మణేతర సాధికారతనే తన ఎజెండాగా పెట్టుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా డీఎంకే అదే పంథాను అనుసరిస్తూ ఓబీసీ, ఎస్సీ వర్గాలకే పెద్దపీట వేసింది. కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పటికీ, ఆయన నాస్తికుడిగా తనను తాను ప్రకటించుకోవడం వల్ల అది రాజకీయంగా మతపరమైన ప్రాతినిధ్యం కిందకు రాదు. అధికారం ఎప్పుడూ మెజారిటీ ఓటు బ్యాంకు ఉన్న కులాల చేతుల్లోనే ఉండాలనే సూత్రం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో బలంగా పాతుకుపోయింది.

 అధికార కేంద్రాల మార్పు 

ఒకప్పుడు బ్యూరోక్రసీ, విద్య, రాజకీయాల్లో బ్రాహ్మణులది పైచేయిగా ఉండేది. కానీ, గత మూడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు, ద్రవిడ సిద్ధాంత ప్రభావంతో రాజకీయ ప్రాతినిధ్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. కేవలం 3 శాతం జనాభా ఉన్న ఈ వర్గం, ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల్లో తమ ప్రభావాన్ని కోల్పోయింది. అయితే, వీరు తెర వెనుక సలహాదారులుగా, మేధావులుగా ప్రభావం చూపుతున్నప్పటికీ, ప్రత్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడే స్థాయి నుంచి పూర్తిగా కనుమరుగవడం తమిళ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం.  2026 ఎన్నికలు తమిళనాడులో  బ్రాహ్మణేతర రాజకీయాల పరాకాష్టను చూపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ గెలుపు గుర్రాలను కేవలం కుల గణాంకాల ఆధారంగానే ఎంపిక చేయడంతో, దశాబ్దాల కాలం నాటి రాజకీయ ప్రాతినిధ్యం ఈసారి శూన్యమైంది. ఇది భవిష్యత్తులో ఆ వర్గపు ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.            

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget