అన్వేషించండి

Maharashtra Political Crisis : "మహా" రాజకీయ సంక్షోభంలో కీలక మలుపు - రెబల్ ఎమ్మెల్యేలకు మరింత గడువిచ్చిన సుప్రీంకోర్టు !

అనర్హతా వేటు పడకుండా మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు కాస్త ఊరట లభించింది. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అనర్హతా నోటీసులకు సమాధానం ఇచ్చే గడువును వచ్చే నెల 12వ తేదీ వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది.

Maharashtra Political Crisis : మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హతా నోటీసులకు ఇచ్చిన గడువును జూలై 12 వరకూ పెంచుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. డిప్యూటీ స్పీకర్ తమకు ఇచ్చిన  అనర్హత నోటీసులపై  తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శాసనసభాపక్ష నేతగా తనను తొలగించడంపైనా షిండే అత్యున్నత న్యాయస్థానంలో మరో  పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  అనర్హత నోటీసులపై ముంబై హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని తిరుగుబాటు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని ఎమ్మెల్యేల తరపు లాయర్ వాదించారు.  నోటీసులు జారీచేసే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 

వచ్చే నెల 12 వరకూ అనర్హతా నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు గడువు ! 

జూన్ 27 సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 12 వరకూ పొడిగించింది. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్‌, మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత 3 రోజుల్లోగా రిజాయిండర్‌ దాఖలు చేయాలని తెలిపింది. తదుపరి విచారణ జులై 11కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 

రెబల్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వమే రక్షణ కల్పించాలన్న సుప్రీంకోర్టు ! 

అనర్హతా పిటిషన్లపై వివరణ ఇవ్వకపోతే  సోమవారం సాయంత్రం తర్వాత వారిపై డిప్యూటీ స్పీకర్ అనర్హతా వేటు వేసి ఉండేవారు. అయితే సుప్రీంకోర్టు గడువు పెంచడంతో వారికి రిలీఫ్ లభించినట్లయింది. అదే సమయంలో మహారాష్ట్రలో పరిస్థితులు బాగో లేవని చెప్పినందున  రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ 39 మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల భద్రత.. వారి ఆస్తులను కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.  

రెబల్ ఎమ్మెల్యేల తదుపరి వ్యూహం ఏమిటి ?

ప్రస్తుతం రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉంటున్నారు. సంక్షోభం ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరిస్తే అనర్హతా వేటు పడుతుంది. ఇప్పటికే శివసేన విప్ జారీ చేసింది. దాన్ని రెబల్ ఎమ్మెల్యేలు ఉల్లంఘించారు. వారు వెనక్కి రాకపోతే...  ఆలస్యం అవ్వొచ్చేమో కానీ అనర్హతా వేటు ఖాయమని శివసేన వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TVK Vijay: పొత్తులను పట్టించుకోకపోవడమే టీవీకే విజయ్‌కు సమస్య - అందరూ మూడో స్థానమేనని ఎలా అంచనా వేస్తున్నారు?
పొత్తులను పట్టించుకోకపోవడమే టీవీకే విజయ్‌కు సమస్య - అందరూ మూడో స్థానమేనని ఎలా అంచనా వేస్తున్నారు?
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
U.S రెడ్‌లైన్ దాటితే మేమేంటో చూపిస్తాం... ఇరాన్ తీవ్ర హెచ్చరికలు
U.S రెడ్‌లైన్ దాటితే మేమేంటో చూపిస్తాం... ఇరాన్ తీవ్ర హెచ్చరికలు

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Embed widget