అన్వేషించండి

GVL On Jagan :అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నానని చెప్పి రాజధాని లేకుండా చేశారుగా ? - జగన్‌పై బీజేపీ నేత జీవీఎల్ సెటైర్ !

ఇక్కడే ఉంటానన్న జగన్ వ్యాఖ్యలపై జీవీఎల్ వినూత్నంగా స్పందించారు. గతంలో అమరావతి విషయంలోనూ అలాగే ప్రకటన చేసి.. ఇప్పుడు రాజధాని లేకుండా చేశారన్నారు.

GVL On Jagan : రిజర్వేషన్ల అంశంపై కాపులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కాపులకు రిజర్వేషన్లు కేంద్రం ఇవ్వడం లేదని  అబద్దాలు చెప్పారని, పార్లమెంటు సాక్షి గా కాపుల రిజర్వేషన్ కరెక్ట్ అని తేలిందన్నారు. కాపులకు బీజేపీ అండగా ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కేటాయించిన పది శాతం కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది చెల్లదని జగన్ ప్రభుత్వం  తర్వాత రద్దు చేసింది. పార్లమెంట్ ఇటీవల ఆ నిర్ణయం చెల్లుతుందని రిజర్వేషన్లు ఇవ్వవొచ్చని తెలిపింది. దీన్నేగుర్తు  చేసి.. జీవీఎల్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

అధికారంలో లేకపోయే సరికి చంద్రబాబుకు హైదరాబాద్ గుర్తుకు వస్తుందని.. 2024 ఎన్నికల తరువాత జగన్ కూడా హైదరాబాద్ లో కూర్చుంటారని జోస్యం చెప్పారు.   ఐటీ రంగంలో  ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దారుణం గా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు ఏపీకి చెందిన పది శాతంమ మందికిపైగా ఉన్నారని కానీ ఏపీ నుంచి ఐటీ రంగ ఉత్పత్తులు, ఎగుమతులు వాటా జీరో అని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉందా అని నిలదీశారు.ఇక్కడ ఐటీని ఎందుకు ముందుకు తీసుకెళ్ల లేదని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబు, జగన్‌కు అధికారం కోసం ఏపీ కావాలికానీ..  ప్రతిపక్షంలో ఉంటే మాత్రం హైదరాబాదే కావాలన్నారు.  నేను ఇక్కడే ఉంటా అన్న జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా  అమరావతి లోనే ఉంటా అన్నారని ఆ తరువాత అధికారంలోకి వచ్చి  రాజధాని  లేకుండా చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకున్నారని అన్నారు. ముందు గతంలొ ఇచ్చిన హామీలు ముందు నిలబెట్టుకోండని జగన్ కు సూచించారు. హైదరాబాద్ లో మీ సొంత ఆస్తులు,  కేంద్రం సహకారం లేకుండా ఏపికి మీరేమి చేశారో‌ చెప్పాలని  టీడీపీ, వైసీపీలను జీవీఎల్ నిలదీశారు. ఏపీ అభివృద్ధి పై చంద్రబాబు, జగన్ లకు చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు.హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పుకునే వాళ్లు ఎపికి ఎందుకు చేయ లేదని ప్రశ్నించారు. ఏపీకి  కంపెనీలు తీసుకు రావడానికి ఇప్పుడు మంచి అవకాశం ఉందని,అయినా కంపెనీలు తీసుకురకపోగా, వచ్చినా ప్రోత్సహించటం లేదని జీవీఎల్  మండిపడ్డారు. 

డిసెంబరు 25 వాజపేయి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు బీజేపి నేతలు రెడీ అవుతున్నారు.  మాకు ఎంపీలు లేకున్నా... మేము రాష్ట్ర క్షేమం కోసం పని చేస్తున్నామని,69 జాతీయ రహదారుల ప్రాజెక్టు లు 1056కిమి మేర పది వేల‌కోట్లతో పనులు చేస్తున్నారని వివరించారు.12,509కోట్ల తో గ్రీన్ ఫీల్డ్ ఎకనామికల్‌ కారిడర్ కడప, విజయవాడ ల్లో నిర్మాణం రెండు ఏళ్లల్లో పూర్తి అవుతుందని,భోగాపురం ఎయిర్ పోర్ట్, రిషికొండ తవ్వకాలు పై కూడా పార్లమెంటు లో ప్రశ్నించిట్లు వివరించారు.కోవిడ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని,బూస్టర్ డోస్ కింద వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని,ప్రజలంతా స్వీయ రక్షణ కోసం వ్యాక్సిన్ వేయించు కోవాలని సూచించారు.కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాలను పూర్తిగా పాటించాలన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
YSRCP Mavigun Vs Amaravati 2026: వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Embed widget