అన్వేషించండి

GVL On Jagan :అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నానని చెప్పి రాజధాని లేకుండా చేశారుగా ? - జగన్‌పై బీజేపీ నేత జీవీఎల్ సెటైర్ !

ఇక్కడే ఉంటానన్న జగన్ వ్యాఖ్యలపై జీవీఎల్ వినూత్నంగా స్పందించారు. గతంలో అమరావతి విషయంలోనూ అలాగే ప్రకటన చేసి.. ఇప్పుడు రాజధాని లేకుండా చేశారన్నారు.

GVL On Jagan : రిజర్వేషన్ల అంశంపై కాపులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కాపులకు రిజర్వేషన్లు కేంద్రం ఇవ్వడం లేదని  అబద్దాలు చెప్పారని, పార్లమెంటు సాక్షి గా కాపుల రిజర్వేషన్ కరెక్ట్ అని తేలిందన్నారు. కాపులకు బీజేపీ అండగా ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కేటాయించిన పది శాతం కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది చెల్లదని జగన్ ప్రభుత్వం  తర్వాత రద్దు చేసింది. పార్లమెంట్ ఇటీవల ఆ నిర్ణయం చెల్లుతుందని రిజర్వేషన్లు ఇవ్వవొచ్చని తెలిపింది. దీన్నేగుర్తు  చేసి.. జీవీఎల్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

అధికారంలో లేకపోయే సరికి చంద్రబాబుకు హైదరాబాద్ గుర్తుకు వస్తుందని.. 2024 ఎన్నికల తరువాత జగన్ కూడా హైదరాబాద్ లో కూర్చుంటారని జోస్యం చెప్పారు.   ఐటీ రంగంలో  ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దారుణం గా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు ఏపీకి చెందిన పది శాతంమ మందికిపైగా ఉన్నారని కానీ ఏపీ నుంచి ఐటీ రంగ ఉత్పత్తులు, ఎగుమతులు వాటా జీరో అని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వానికి ఏమైనా బాధ్యత ఉందా అని నిలదీశారు.ఇక్కడ ఐటీని ఎందుకు ముందుకు తీసుకెళ్ల లేదని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబు, జగన్‌కు అధికారం కోసం ఏపీ కావాలికానీ..  ప్రతిపక్షంలో ఉంటే మాత్రం హైదరాబాదే కావాలన్నారు.  నేను ఇక్కడే ఉంటా అన్న జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా  అమరావతి లోనే ఉంటా అన్నారని ఆ తరువాత అధికారంలోకి వచ్చి  రాజధాని  లేకుండా చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకున్నారని అన్నారు. ముందు గతంలొ ఇచ్చిన హామీలు ముందు నిలబెట్టుకోండని జగన్ కు సూచించారు. హైదరాబాద్ లో మీ సొంత ఆస్తులు,  కేంద్రం సహకారం లేకుండా ఏపికి మీరేమి చేశారో‌ చెప్పాలని  టీడీపీ, వైసీపీలను జీవీఎల్ నిలదీశారు. ఏపీ అభివృద్ధి పై చంద్రబాబు, జగన్ లకు చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు.హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని చెప్పుకునే వాళ్లు ఎపికి ఎందుకు చేయ లేదని ప్రశ్నించారు. ఏపీకి  కంపెనీలు తీసుకు రావడానికి ఇప్పుడు మంచి అవకాశం ఉందని,అయినా కంపెనీలు తీసుకురకపోగా, వచ్చినా ప్రోత్సహించటం లేదని జీవీఎల్  మండిపడ్డారు. 

డిసెంబరు 25 వాజపేయి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు బీజేపి నేతలు రెడీ అవుతున్నారు.  మాకు ఎంపీలు లేకున్నా... మేము రాష్ట్ర క్షేమం కోసం పని చేస్తున్నామని,69 జాతీయ రహదారుల ప్రాజెక్టు లు 1056కిమి మేర పది వేల‌కోట్లతో పనులు చేస్తున్నారని వివరించారు.12,509కోట్ల తో గ్రీన్ ఫీల్డ్ ఎకనామికల్‌ కారిడర్ కడప, విజయవాడ ల్లో నిర్మాణం రెండు ఏళ్లల్లో పూర్తి అవుతుందని,భోగాపురం ఎయిర్ పోర్ట్, రిషికొండ తవ్వకాలు పై కూడా పార్లమెంటు లో ప్రశ్నించిట్లు వివరించారు.కోవిడ్ కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని,బూస్టర్ డోస్ కింద వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని,ప్రజలంతా స్వీయ రక్షణ కోసం వ్యాక్సిన్ వేయించు కోవాలని సూచించారు.కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాలను పూర్తిగా పాటించాలన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget