అన్వేషించండి

YS Jagan Politics: పార్టీ నేతలకే పరామర్శలు -ఎన్ని విషాదాలు జరిగినా పట్టించుకోని వైసీపీ అధినేత -ప్రజలపై అలిగారా?

YSRCP Chief: ఏపీలో ఘోర విషాదాలు జరిగినా జగన్ సోషల్ మీడియా ట్వీట్లకే పరిమితమవుతున్నారు. బాధితుల వద్దకు వెళ్లడం లేదు. ప్రతిపక్ష నేతగా ఆయన అడ్వాంటేజ్ తీసుకోవడం లేదు. ప్రజలపై అలిగారా?

Jagan is not showing much interest in consoling the people: గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా వెళ్లి బాధితుల్ని పరామర్శించేవారు. కానీ ఇప్పుడు ఆయన రూట్ మారిపోయింది. ఘోర విషాదాలు జరిగినా పట్టించుకోవడం లేదు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఓదార్చడానికి పెద్దగా   ఆసక్తి చూపించడం లేదు. పార్టీ నేతలు అరెస్టు అయితే  యాత్రగాతో వెళ్లి పరామర్శలు చేస్తున్నారు.  అదికూడా కొంత మంది కే. మిగిలిన వారిని ఇంటికి పిలిపిచుకుని ఓదారుస్తున్నారు. ఇక ప్రజాసమస్యలు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మాత్ర అసలు వెళ్లడం లేదు. ఈ నెలలో రెండు, మూడు ఘోర విషాదాలు ఏపీలో జరిగాయి. ఒకటి కల్తీ పాల విషాదం, రెండు బాణసంచా విషాదం. ఉత్తరాధ్రలో డయోరియా వల్ల కూడా కొంతమంది చనిపోయారు. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడుప్రతిపక్ష పార్టీలు హడావుడి చేస్తాయి. కానీ  జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు జగన్ పరామర్సలు చేస్తారని వైసీపీ వర్గాలు అనుకున్నా.. ఈ వారం ఆయన పెళ్లిళ్లకు మాత్రమే పరిమితమయ్యారు.  గత రెండేళ్లుగా జగన్ చేస్తున్నది ఇదే. 

రాజకీయ కారణాలపైనే ఎక్కువగా స్పందన 

వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్ రాజకీయం పూర్తిగా విజిటింగ్ ప్రొఫెసర్ తరహాలో జరుగుతోంది.  వారానికి మూడు, నాలుగు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు.  బుధవారం వచ్చి శుక్రవారం బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో ఓ ప్రెస్మీట్ లేకపోతే పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా మాట్లాడి ఆ వీడియోలను విడుదల చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు తక్కువ. ఓ సారి చిత్తూరులో మామిడి రైతులకు సంఘిభావం తెలిపేందుకు వెళ్లారు. ఆ తర్వాత పార్టీ నేతల ఇళ్లకు పరామర్శలకే వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలను ఎక్కువగా రాజకీయ కారణాలకే పరిమితం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

ప్రజలపై అలిగారా ? 

కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించారన్న భావనలో జగన్ ఉన్నారని .. ఆ అసంతృప్తి ఆయనలో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  అయితే జగన్ స్వయంగా తనకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని చెబుతూ ఉంటారు. ఆ కోణంలోనే   ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా, ఆయన కేవలం ప్రెస్ నోట్లు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కావడం పార్టీ క్యాడర్ ను అసంతృప్తికి గురి చేస్తోంది.  అయితే వైసీపీ పెద్దలు మాత్రం మరో విధంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైకాపా నాయకులపై కేసులు బనాయిస్తోందని, వారిని కాపాడుకోవడమే ప్రస్తుతానికి ప్రాధాన్యత అని జగన్ భావిస్తున్నట్లు  చెబుతున్నారు.  

చివరి రెండేళ్లు పాదయాత్రతో ప్రజల్లో ఉంటే చాలనుకుంటున్నారా? 
 
2019లో గెలిచిన దగ్గర నుండే జగన్ జనంతో నేరుగా మమేకం అవ్వడం తగ్గించారనే విమర్శలు ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగించడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒకప్పుడు ఓదార్పు యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్, ఇప్పుడు అదే ప్రజలు కష్టాల్లో ఉంటే వెళ్లడానికి వెనకాడుతుండటం ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తోంది. అయితే జగన్ మూడేళ్ల పాటు ప్రజా సమస్యలను పట్టించుకోకూడదని..చివరి రెండేళ్లు పాదయాత్ర చేస్తారు కాబట్టి అంతా కవర్ అయిపోతుదంని పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.  ప్రజలు ఆయన మూడేళ్లు ఏం చేశారన్నది మర్చిపోతారని. చివరి రెండేళ్ల పోరాటంతోనే ఓట్లేస్తారని అంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget