అన్వేషించండి

YS Jagan Politics: పార్టీ నేతలకే పరామర్శలు -ఎన్ని విషాదాలు జరిగినా పట్టించుకోని వైసీపీ అధినేత -ప్రజలపై అలిగారా?

YSRCP Chief: ఏపీలో ఘోర విషాదాలు జరిగినా జగన్ సోషల్ మీడియా ట్వీట్లకే పరిమితమవుతున్నారు. బాధితుల వద్దకు వెళ్లడం లేదు. ప్రతిపక్ష నేతగా ఆయన అడ్వాంటేజ్ తీసుకోవడం లేదు. ప్రజలపై అలిగారా?

Jagan is not showing much interest in consoling the people: గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా వెళ్లి బాధితుల్ని పరామర్శించేవారు. కానీ ఇప్పుడు ఆయన రూట్ మారిపోయింది. ఘోర విషాదాలు జరిగినా పట్టించుకోవడం లేదు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఓదార్చడానికి పెద్దగా   ఆసక్తి చూపించడం లేదు. పార్టీ నేతలు అరెస్టు అయితే  యాత్రగాతో వెళ్లి పరామర్శలు చేస్తున్నారు.  అదికూడా కొంత మంది కే. మిగిలిన వారిని ఇంటికి పిలిపిచుకుని ఓదారుస్తున్నారు. ఇక ప్రజాసమస్యలు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మాత్ర అసలు వెళ్లడం లేదు. ఈ నెలలో రెండు, మూడు ఘోర విషాదాలు ఏపీలో జరిగాయి. ఒకటి కల్తీ పాల విషాదం, రెండు బాణసంచా విషాదం. ఉత్తరాధ్రలో డయోరియా వల్ల కూడా కొంతమంది చనిపోయారు. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడుప్రతిపక్ష పార్టీలు హడావుడి చేస్తాయి. కానీ  జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోలేదు జగన్ పరామర్సలు చేస్తారని వైసీపీ వర్గాలు అనుకున్నా.. ఈ వారం ఆయన పెళ్లిళ్లకు మాత్రమే పరిమితమయ్యారు.  గత రెండేళ్లుగా జగన్ చేస్తున్నది ఇదే. 

రాజకీయ కారణాలపైనే ఎక్కువగా స్పందన 

వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్ రాజకీయం పూర్తిగా విజిటింగ్ ప్రొఫెసర్ తరహాలో జరుగుతోంది.  వారానికి మూడు, నాలుగు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు.  బుధవారం వచ్చి శుక్రవారం బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. ఈ సమయంలో ఓ ప్రెస్మీట్ లేకపోతే పార్టీ నేతలతో సమావేశం సందర్భంగా మాట్లాడి ఆ వీడియోలను విడుదల చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు తక్కువ. ఓ సారి చిత్తూరులో మామిడి రైతులకు సంఘిభావం తెలిపేందుకు వెళ్లారు. ఆ తర్వాత పార్టీ నేతల ఇళ్లకు పరామర్శలకే వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలను ఎక్కువగా రాజకీయ కారణాలకే పరిమితం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

ప్రజలపై అలిగారా ? 

కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరించారన్న భావనలో జగన్ ఉన్నారని .. ఆ అసంతృప్తి ఆయనలో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  అయితే జగన్ స్వయంగా తనకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని చెబుతూ ఉంటారు. ఆ కోణంలోనే   ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా, ఆయన కేవలం ప్రెస్ నోట్లు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కావడం పార్టీ క్యాడర్ ను అసంతృప్తికి గురి చేస్తోంది.  అయితే వైసీపీ పెద్దలు మాత్రం మరో విధంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైకాపా నాయకులపై కేసులు బనాయిస్తోందని, వారిని కాపాడుకోవడమే ప్రస్తుతానికి ప్రాధాన్యత అని జగన్ భావిస్తున్నట్లు  చెబుతున్నారు.  

చివరి రెండేళ్లు పాదయాత్రతో ప్రజల్లో ఉంటే చాలనుకుంటున్నారా? 
 
2019లో గెలిచిన దగ్గర నుండే జగన్ జనంతో నేరుగా మమేకం అవ్వడం తగ్గించారనే విమర్శలు ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగించడం రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒకప్పుడు ఓదార్పు యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్, ఇప్పుడు అదే ప్రజలు కష్టాల్లో ఉంటే వెళ్లడానికి వెనకాడుతుండటం ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తోంది. అయితే జగన్ మూడేళ్ల పాటు ప్రజా సమస్యలను పట్టించుకోకూడదని..చివరి రెండేళ్లు పాదయాత్ర చేస్తారు కాబట్టి అంతా కవర్ అయిపోతుదంని పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.  ప్రజలు ఆయన మూడేళ్లు ఏం చేశారన్నది మర్చిపోతారని. చివరి రెండేళ్ల పోరాటంతోనే ఓట్లేస్తారని అంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget