అన్వేషించండి

Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన

Bonda Uma: వైసీపీ నేత అంబటి రాంబాబుతో భేటీ వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు త్రిసభ్య కమిటీకి వివరణ ఇచ్చారు. పార్టీ లైన్ దాటలేదని, తన మాటలను వక్రీకరించారని పేర్కొంటూ యూటర్న్ తీసుకున్నారు.

TDP Three Member Committee:   విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల వైసీపీ నేత అంబటి రాంబాబుతో భేటీ కావడంపై చెలరేగిన రాజకీయ వివాదం నడుమ ఆయన కీలక వివరణ ఇచ్చారు. అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరైన బోండా ఉమ, తన వైఖరిని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్‌ను దాటలేదని, భవిష్యత్తులో కూడా దాటే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు ఆదేశాలను శిరసావహిస్తానని, అనవసరంగా ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారని ఆయన పేర్కొన్నారు.

 ముద్రగడ సభలో పరిచయం.. వక్రీకరించారంటూ ఆవేదన 

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లిన సమయంలో అక్కడ వైఎస్సార్‌సీపీ నేతలను కలవాల్సి వచ్చిందని బోండా ఉమ కమిటీకి వివరించారు. అంబటి రాంబాబుతో తనకు దాదాపు మూడు దశాబ్దాలుగా వ్యక్తిగత పరిచయం ఉందని, ఆ క్రమంలోనే ఆయన తన వద్దకు వచ్చి పలకరించారని తెలిపారు. తాము కేవలం కాపు సామాజికవర్గ సమస్యలపైనే సాధారణంగా మాట్లాడుకున్నామని, అంతకుమించి ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని వివరణ ఇచ్చారు. అయితే, కొందరు దుష్టశక్తులు ఈ చిన్న విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో తన మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

 పార్టీకి కట్టుబడి ఉంటాను.. తప్పు చేయలేదు 

కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణే ప్రాధాన్యమని పేర్కొన్న బోండా ఉమ, ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తాను దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నానని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని, మున్ముందు కూడా చేయబోనని చెప్పుకొచ్చారు. ముద్రగడ సభ వద్ద జరిగిన సంఘటన అనుకోకుండా జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని త్రిసభ్య కమిటీకి హామీ ఇచ్చారు.

 పార్టీ హెచ్చరికలు              

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలతో సొంత పార్టీ నాయకులు సఖ్యతగా కనిపిస్తే క్యాడర్‌కు తప్పు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ  కారణంగానే బోండా ఉమను వివరణ కోరడం, ఆయన త్రిసభ్య కమిటీ ముందుకు  వచ్చి వివరణ ఇచ్చారు.  గతంలో అంబటితో భేటీపై కాస్త ఘాటుగానే స్పందించిన బోండా ఉమ, కమిటీ ముందు మాత్రం పూర్తిగా తగ్గి వ్యాఖ్యానించడంపై పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధిష్టానం కఠిన వైఖరి వల్లే ఆయన ఈ రకంగా  యూటర్న్  తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.  ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలతో వేదికలు పంచుకోవడంపై కఠినంగా ఉండాలని నిర్ణయించిన టీడీపీ అధిష్టానానికి బోండా ఉమ ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లే కనిపిస్తోంది. త్రిసభ్య కమిటీ తన నివేదికను పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించనుంది.                                

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget