అన్వేషించండి

Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన

Bonda Uma: వైసీపీ నేత అంబటి రాంబాబుతో భేటీ వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు త్రిసభ్య కమిటీకి వివరణ ఇచ్చారు. పార్టీ లైన్ దాటలేదని, తన మాటలను వక్రీకరించారని పేర్కొంటూ యూటర్న్ తీసుకున్నారు.

TDP Three Member Committee:   విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల వైసీపీ నేత అంబటి రాంబాబుతో భేటీ కావడంపై చెలరేగిన రాజకీయ వివాదం నడుమ ఆయన కీలక వివరణ ఇచ్చారు. అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరైన బోండా ఉమ, తన వైఖరిని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్‌ను దాటలేదని, భవిష్యత్తులో కూడా దాటే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు ఆదేశాలను శిరసావహిస్తానని, అనవసరంగా ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారని ఆయన పేర్కొన్నారు.

 ముద్రగడ సభలో పరిచయం.. వక్రీకరించారంటూ ఆవేదన 

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లిన సమయంలో అక్కడ వైఎస్సార్‌సీపీ నేతలను కలవాల్సి వచ్చిందని బోండా ఉమ కమిటీకి వివరించారు. అంబటి రాంబాబుతో తనకు దాదాపు మూడు దశాబ్దాలుగా వ్యక్తిగత పరిచయం ఉందని, ఆ క్రమంలోనే ఆయన తన వద్దకు వచ్చి పలకరించారని తెలిపారు. తాము కేవలం కాపు సామాజికవర్గ సమస్యలపైనే సాధారణంగా మాట్లాడుకున్నామని, అంతకుమించి ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని వివరణ ఇచ్చారు. అయితే, కొందరు దుష్టశక్తులు ఈ చిన్న విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో తన మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

 పార్టీకి కట్టుబడి ఉంటాను.. తప్పు చేయలేదు 

కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణే ప్రాధాన్యమని పేర్కొన్న బోండా ఉమ, ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తాను దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నానని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని, మున్ముందు కూడా చేయబోనని చెప్పుకొచ్చారు. ముద్రగడ సభ వద్ద జరిగిన సంఘటన అనుకోకుండా జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని త్రిసభ్య కమిటీకి హామీ ఇచ్చారు.

 పార్టీ హెచ్చరికలు              

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలతో సొంత పార్టీ నాయకులు సఖ్యతగా కనిపిస్తే క్యాడర్‌కు తప్పు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ  కారణంగానే బోండా ఉమను వివరణ కోరడం, ఆయన త్రిసభ్య కమిటీ ముందుకు  వచ్చి వివరణ ఇచ్చారు.  గతంలో అంబటితో భేటీపై కాస్త ఘాటుగానే స్పందించిన బోండా ఉమ, కమిటీ ముందు మాత్రం పూర్తిగా తగ్గి వ్యాఖ్యానించడంపై పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధిష్టానం కఠిన వైఖరి వల్లే ఆయన ఈ రకంగా  యూటర్న్  తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.  ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలతో వేదికలు పంచుకోవడంపై కఠినంగా ఉండాలని నిర్ణయించిన టీడీపీ అధిష్టానానికి బోండా ఉమ ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లే కనిపిస్తోంది. త్రిసభ్య కమిటీ తన నివేదికను పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించనుంది.                                

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Breaking News: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్-మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్!
Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget