Undavalli On Jagan : మళ్లీ జగన్ క్విడ్ ప్రో కో - గేంబ్లింగ్ చేస్తున్నారని ఉండవల్లి ఆరోపణలు !
జగన్మోహన్ రెడ్డి మళ్లీ క్విడ్ ప్రో కో కు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. గేంబ్లింగ్ ఆడుతున్నారని విమర్శించారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) క్విడ్ ప్రో కో చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ( Undavalli Arun kumar ) ఆరోపించారు. ప్రజలకు డబ్బులు ఇచ్చాను. వాళ్లు నాకు ఓటు వేయాల్నట్లుగా జగన్ విధానం ఉందన్నారు. అసలు క్విడ్ ప్రోకో అంటే ఇదేనన్నారు. ఓటు వేస్తారు అనుకున్న వారికి మాత్రమే పథకాలు ఇస్తున్నారని ఉండవల్లి స్పష్టం చేస్తున్నారు. అయితే పథకాల ( Nagadu Badili ) పేరుతో ఇచ్చి పన్నుల పేరుతో వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో పరిస్థితులపై ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ కు ధైర్మం ఉంటే రాజధానికి కమ్మరావతి అని పేరు పెట్టాలి : రేణుకా చౌదరి
ఏపీలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ( Financial Management ) లేదని.. జగన్ ఎంత కాలం ఇలా బటన్స్ కొట్టి డబ్బులు ఇవ్వగలరో తెలియదన్నారు. ఇలాంటి గ్యాంబ్లింగ్ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ( Chandra babu ) పదివేలు పంచినా ఓట్లు వేయలేదన్నారు కేంద్రం నిధుల ( Central Funds ) మళ్లింపుపై విచారణ జరుగుతోందని.. విచారణలో ఫలితం ఏమొచ్చినా.. జగన్ ఏమీ ఫీల్ కారు. ఎందుకంటే.. పేద ప్రజలకు ఇచ్చానంటారన్నారు. జగన్కు ( CM Jagan )ఎవరూచెప్పేవారు లేరన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన జగన్ పోలవరం ప్రాజెక్టును ( Polavaram Project ) కేంద్రానికి ఎందుకు అప్పగించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ప్రశ్నించారు.
ఏపీలో మొదటి మొబైల్ సినిమా థియేటర్, మెగాస్టార్ ఆచార్య మూవీతో ఓపెనింగ్!
పొరుగు రాష్ట్రం తెలంగాణలో ( Telangana ) కరెంట్ కోతల్లేవని.. ఏపీలో విపరీతంగా కరెంట్ కోతలున్నాయని. ( Power Cuts ) .. మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని జగన్ ఇలా తయారు చేశారన్నారు. విద్యుత్ కష్టాల నుంచి బయటపడటానికి ఎన్ని యుగాలు పడుతుందో చెప్పలేమన్నారు. ఏపీలో బీజేపీ ( AP BJP ) అధికారంలోకి వచ్చే అవకాశాలు లేనందున డబ్బులు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేదన్నారు. అందుకే పోలవరం ప్రాజెక్ట్ను ( Polavaram )నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎంపీలు గట్టిగా అడగలేరు. ఇప్పటి వరకు ఎప్పుడైనా పార్లమెంట్లో అడిగారా?. ఏపీ పునర్విభజన చట్టం ఎందుకు అమలు చేయట్లేదని కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం జగన్ మోదీని ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















