అన్వేషించండి

Revanth Reddy Target Kishan Reddy: కేసీఆర్‌పై సైలెంట్.. కిషన్ రెడ్డే టార్గెట్! రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం-ఇక జాతీయ పార్టీల మధ్యే పోరు?

Telangana Two Way Contest 2026: సీఎం రేవంత్ఇ టీవలి కాలంలో బీఆర్‌ఎస్ కంటే ఎక్కువగా బీజేపీని, కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. 15వ తేదీ తర్వాత సంగతి చూస్తామంటున్నారు. ఎందుకంటే?

Revanth Reddy Political Strategy:  తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇటీవలి కాలంలో ఒక స్పష్టమైన, వ్యూహాత్మక మార్పు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన రాజకీయ విమర్శల పంథాను పూర్తిగా మార్చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువుగా ఉన్న భారత్ రాష్ట్ర సమితి , దాని అధినేత కేసీఆర్‌లను ఆయన ఇప్పుడు తక్కువగా టార్గెట్ చేస్తున్నారు. దానికి భిన్నంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిపై విమర్శల పదును పెంచారు.  ఎక్కడ బహిరంగ సభ జరిగినా కిషన్ రెడ్డి లక్ష్యంగా ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు,  రాష్ట్రానికి నిధులు రాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారు అంటూ  ఆరో చేస్తున్నారు. 

15వ తేదీ వరకూ కిషన్ రెడ్డికి డెడ్ లైన్ 

ఈ వ్యూహంలో భాగంగానే "ఈ నెల 15వ తేదీ తర్వాత కిషన్ రెడ్డి సంగతి చూస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్, బీజేపీల మధ్య తెరవెనుక ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను కాదని, కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే.. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ను పూర్తిగా మూడో స్థానానికి పరిమితం చేయడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ కేవలం జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉందనే వాతావరణాన్ని కల్పించడం ద్వారా, వచ్చే ఎన్నికల నాటికి ద్విముఖ పోరు   జరిగేలా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని అనుకోవచ్చు.

యాంటీ బీజేపీ ఓట్లను పోలరైజ్ చేయాలని రేవంత్ ప్లాన్ 

 బీఆర్‌ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో   రాణించలేకపోవడంతో ఆ పార్టీ క్యాడర్ ,  ఓటు బ్యాంక్ బలహీనపడింది. ఈ తరుణంలో బీఆర్‌ఎస్‌ను ఇంకా టార్గెట్ చేయడం వల్ల ఆ పార్టీకి అనవసర మైలేజ్ ఇచ్చినట్లవుతుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే, క్షేత్రస్థాయిలో బలపడుతున్నట్లు కనిపిస్తున్న బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా నిలబెట్టడం ద్వారా, యాంటీ-బీజేపీ   ఓట్లన్నీ ముఖ్యంగా మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లు సహజంగానే కాంగ్రెస్ వైపు ఏకీకృతం  అవుతాయని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు.

అభివృద్ధి పనులకు తెలంగాణ సెంటిమెంట్ 

మరోవైపు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి  తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. మోదీ గుజరాత్‌లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకుంటే ఆహా ఓహో అనే కిషన్ రెడ్డి, తాము మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడం వెనుక ప్రాంతీయ సెంటిమెంట్‌ను రచ్చకెక్కించే వ్యూహం ఉంది. చేవెళ్ల, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ ఎంపీలుగా బీజేపీ నేతలే ఉన్నా.. కేంద్రం నుండి నిధులు తేవడంలో వారు విఫలమయ్యారని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, బీజేపీకి లభించిన పార్లమెంటరీ బలాన్ని రాజకీయంగా బలహీనపరచాలని రేవంత్ చూస్తున్నారు.

కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ రెడీ 

దీనికి కౌంటర్‌గా బీజేపీ సైతం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా ఢీకొట్టడానికే మొగ్గు చూపుతోంది. రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలను, కేంద్ర పెద్దలతో ఆయన జరిపే భేటీలను కిషన్ రెడ్డి క్షుణ్ణంగా గమనిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాము కూడా బీఆర్‌ఎస్‌ను పక్కన పెట్టి, కేవలం కాంగ్రెస్ వైఫల్యాలనే ఎండగట్టడం ద్వారా తెలంగాణలో తామే ప్రత్యామ్నాయ శక్తీ అని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. అంటే, ఉభయ పక్షాలు పరస్పరం లబ్ధి పొందేలా, బీఆర్‌ఎస్ ఉనికిని క్రమంగా తుడిచిపెట్టేలా ఈ  ద్విముఖ పోరు  వ్యూహానికి ఇరు పార్టీలూ సహకరించుకుంటున్నాయనే భావన వ్యక్తమవుతోంది.

 సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ సరికొత్త రాజకీయ వ్యూహం తెలంగాణను భవిష్యత్తులో కేవలం రెండు జాతీయ పార్టీల రణరంగంగా మార్చబోతోంది. రాబోయే 24 నెలల కాలం అభివృద్ధిపైనే దృష్టి పెడతామని చెబుతూనే, రాజకీయంగా ప్రత్యర్థులను కోలుకోకుండా చేయడం రేవంత్ మార్క్ పాలిటిక్స్. ఈ నెల 15వ తేదీ తర్వాత ఆయన తీసుకోబోయే రాజకీయ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, .దీనిని కిషన్ రెడ్డి నేతృత్వంలోని బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది అనే అంశాలపైనే తెలంగాణ భవిష్యత్ రాజకీయ చిత్రం ఆధారపడి ఉంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Breaks Nehru Record: నవభారత చరిత్రలో సరికొత్త మైలురాయి - నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ.. 12 ఏళ్ల అప్రతిహత ప్రస్థానం
నవభారత చరిత్రలో సరికొత్త మైలురాయి - నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ.. 12 ఏళ్ల అప్రతిహత ప్రస్థానం
Jharkhand Rajya Sabha Elections 2026: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా - రేసులోకి విజయసాయిరెడ్డి -ఆ ‘ఆరు’ ఓట్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయ చదరంగం!
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా - రేసులోకి విజయసాయిరెడ్డి -ఆ ‘ఆరు’ ఓట్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయ చదరంగం!
Congress North vs South Strategy: రేవంత్ దక్షిణాదివాదం - ఉత్తరాదిన కాంగ్రెస్‌కు ఇబ్బంది కాదా?
రేవంత్ దక్షిణాదివాదం - ఉత్తరాదిన కాంగ్రెస్‌కు ఇబ్బంది కాదా?
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant Fire Accident: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం - ద్రవ ఉక్కు ఒలికి భారీగా ఎగసిపడిన మంటలు - భారీ ప్రాణనష్టం?
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం - ద్రవ ఉక్కు ఒలికి భారీగా ఎగసిపడిన మంటలు - భారీ ప్రాణనష్టం?
Rains In AP and Telangana: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Slumdog Teaser : స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
Chandrababu Naidu Siddhantam tour: 1500 కోట్ల భూ కబ్జా కేసులో అరెస్టయిన లీడర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు - వైసీపీపై చంద్రబాబు విమర్శలు
1500 కోట్ల భూ కబ్జా కేసులో అరెస్టయిన లీడర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు - వైసీపీపై చంద్రబాబు విమర్శలు
Tiago EV Smart 19 vs Pure Plus 19: టాటా టియాగో ఈవీ: స్మార్ట్ 19 vs ప్యూర్ ప్లస్‌ 19- లక్షరన్నర తేడాతో మీకు దక్కేదేంటీ?
టాటా టియాగో ఈవీ: స్మార్ట్ 19 vs ప్యూర్ ప్లస్‌ 19- లక్షరన్నర తేడాతో మీకు దక్కేదేంటీ?
Embed widget