అన్వేషించండి

YSRLP Meeting: అందులో పేరు తెచ్చుకుంటేనే సీట్‌, లేకుంటే అవుట్‌- ఎమ్మెల్యేలకు జగన్ టార్గెట్ !

ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. గడపగడపకూ వెళ్లి ప్రజలకు పథకాల గురించి చెప్పాలన్నారు.


ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతీ రోజూ నివేదిక తెప్పించుకుని సమీక్షిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎఆర్ఎల్‌పీ సమావేశంలో స్పష్టం చేశారు. ఇక నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పార్టీ విజయం సాధించినప్పుడు తొలి సారి వైఎస్ఆర్‌ఎల్పీ మీటింగ్ జరిగింది. దాదాపుగా మూడేళ్ల తర్వాత మరోసారి ఎల్పీ మీటింగ్‌ను సీఎం జగన్ నిర్వహించారు.ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. గత రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నామని జగన్ వారికి తెలిపారు. 

బూత్ కమిటీల్ని బలోపేతం చేయండి !

ఎమ్మెల్యేలు సంక్షేమ పథకాల అమలు విషయంలో పూర్తి స్థాయిలో లబ్దిదారులతో మమేకం అవ్వాలని జగన్ స్పష్టం చేశారు. గ్రామ  సచివాలాయలను సందర్శించాలని.. కనీసం నెలకు పది గ్రామ సచివాలాయలను సందర్శించి... పనితీరును పరిశీలించాలన్నారు. సంక్షేమ పథకాల అమలలో ఎక్కడ లోపాలు ఉన్నా తక్షణం సరి చేయాలన్నారు. పార్టీ బూత్ కమిటీల విషయంపై సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. బూత్ కమిటీల్ని తక్షణం బలోపేతం చేయాలన్నారు. ఆ కమిటీల్లో సగం మంది మహిళలకు చాన్సివ్వాలని సూచించారు. 

గడప గడపకూ వెళ్లి పథకాల ప్రచారం చేయండి !

గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఈసందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్లులన్నిటినీ ఏప్రిల్‌లోగా క్లియర్ చేస్తామని జగన్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే నియోజకవర్గానికి రూ. రెండు కోట్ల చొప్పున నిధులు ఇచ్చేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించామని అవి కూడా ఏప్రిల్‌ నుంచి ఇచ్చే అవకాశం ఉందని తెలిపినట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్‌సీపీ నేతలు గడపగడపకూ వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. దీని కన్నా ప్రభావంతమైన కార్యక్రమం ఏదీ ఉండదన్నారు. 

మంత్రి పదవులు దక్కకపోతే పక్కన పెట్టినట్లు కాదు !

మంత్రివర్గ ప్రక్షాళనపై కూడా సీఎం జగన్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ఎమ్మెల్యేలకు తెలిపారు. మంత్రి పదవి దక్కకపోతే పక్కన పెట్టినట్లు కాదని జగన్ ఆశావహులను అనునయించే ప్రయత్నం చేశారు. సమర్థులైన వారికి పార్టీ  బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తామన్నారు. మళ్లీ అవకాశాలు వస్తాయని.. ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతుందని జగన్ స్పష్టం చేశారు.  26 కొత్త జిల్లాలకు అధ్యక్షుల్ని నియమిస్తామన్నారు. సామాజిక సమీకరణాల వల్ల కొన్ని మినహాయింపులు మంత్రివర్గ విస్తరణలో ఉంటుందని జగన్ తెలిపారు. అంటే.. కొంత మందిని కొనసాగించబోతున్నారని ఎమ్మెల్యేలు ఓ అంచనాకు వచ్చారు.  2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని పదే పదే ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వ పరంగా నిధుల వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  

మంత్రివర్గ విస్తరణ ప్లీనరీ తర్వాతేనా ?

ఏపీ మంత్రివర్గ విస్తరణ.. ఉంటుందని చెప్పారు కానీ ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం చెప్పలేదు. ప్లీనరీ సహజంగా జూలై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా నిర్వహిస్తూ ఉంటారు.  ఈ సారి కూడా అప్పుడే నిర్వహిస్తారు. ఆ ప్లీనరీ అయిపోయిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సంకేతాలను సీఎం జగన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఆశావహులకు షాక్ తగిలినట్లయింది. 

టాప్ హెడ్ లైన్స్

Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
BRS YSRCP Silent on BJP Centre: జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
జాతీయ అంశాలపై రీజినల్ పార్టీల సైలెంట్ రాజకీయం! BRS, YSRCP మౌనం వెనుక మర్మమేంటి?
Telangana Delimitation 2026: తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
తెలంగాణలో డిలిమిటేషన్ ధమాకా - గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్న రాష్ట్ర రాజకీయం?
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget