అన్వేషించండి

YSRLP Meeting: అందులో పేరు తెచ్చుకుంటేనే సీట్‌, లేకుంటే అవుట్‌- ఎమ్మెల్యేలకు జగన్ టార్గెట్ !

ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. గడపగడపకూ వెళ్లి ప్రజలకు పథకాల గురించి చెప్పాలన్నారు.


ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతీ రోజూ నివేదిక తెప్పించుకుని సమీక్షిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎఆర్ఎల్‌పీ సమావేశంలో స్పష్టం చేశారు. ఇక నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పార్టీ విజయం సాధించినప్పుడు తొలి సారి వైఎస్ఆర్‌ఎల్పీ మీటింగ్ జరిగింది. దాదాపుగా మూడేళ్ల తర్వాత మరోసారి ఎల్పీ మీటింగ్‌ను సీఎం జగన్ నిర్వహించారు.ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. గత రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నామని జగన్ వారికి తెలిపారు. 

బూత్ కమిటీల్ని బలోపేతం చేయండి !

ఎమ్మెల్యేలు సంక్షేమ పథకాల అమలు విషయంలో పూర్తి స్థాయిలో లబ్దిదారులతో మమేకం అవ్వాలని జగన్ స్పష్టం చేశారు. గ్రామ  సచివాలాయలను సందర్శించాలని.. కనీసం నెలకు పది గ్రామ సచివాలాయలను సందర్శించి... పనితీరును పరిశీలించాలన్నారు. సంక్షేమ పథకాల అమలలో ఎక్కడ లోపాలు ఉన్నా తక్షణం సరి చేయాలన్నారు. పార్టీ బూత్ కమిటీల విషయంపై సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. బూత్ కమిటీల్ని తక్షణం బలోపేతం చేయాలన్నారు. ఆ కమిటీల్లో సగం మంది మహిళలకు చాన్సివ్వాలని సూచించారు. 

గడప గడపకూ వెళ్లి పథకాల ప్రచారం చేయండి !

గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఈసందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్లులన్నిటినీ ఏప్రిల్‌లోగా క్లియర్ చేస్తామని జగన్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే నియోజకవర్గానికి రూ. రెండు కోట్ల చొప్పున నిధులు ఇచ్చేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించామని అవి కూడా ఏప్రిల్‌ నుంచి ఇచ్చే అవకాశం ఉందని తెలిపినట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్‌సీపీ నేతలు గడపగడపకూ వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. దీని కన్నా ప్రభావంతమైన కార్యక్రమం ఏదీ ఉండదన్నారు. 

మంత్రి పదవులు దక్కకపోతే పక్కన పెట్టినట్లు కాదు !

మంత్రివర్గ ప్రక్షాళనపై కూడా సీఎం జగన్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ఎమ్మెల్యేలకు తెలిపారు. మంత్రి పదవి దక్కకపోతే పక్కన పెట్టినట్లు కాదని జగన్ ఆశావహులను అనునయించే ప్రయత్నం చేశారు. సమర్థులైన వారికి పార్టీ  బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తామన్నారు. మళ్లీ అవకాశాలు వస్తాయని.. ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతుందని జగన్ స్పష్టం చేశారు.  26 కొత్త జిల్లాలకు అధ్యక్షుల్ని నియమిస్తామన్నారు. సామాజిక సమీకరణాల వల్ల కొన్ని మినహాయింపులు మంత్రివర్గ విస్తరణలో ఉంటుందని జగన్ తెలిపారు. అంటే.. కొంత మందిని కొనసాగించబోతున్నారని ఎమ్మెల్యేలు ఓ అంచనాకు వచ్చారు.  2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని పదే పదే ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వ పరంగా నిధుల వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  

మంత్రివర్గ విస్తరణ ప్లీనరీ తర్వాతేనా ?

ఏపీ మంత్రివర్గ విస్తరణ.. ఉంటుందని చెప్పారు కానీ ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం చెప్పలేదు. ప్లీనరీ సహజంగా జూలై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా నిర్వహిస్తూ ఉంటారు.  ఈ సారి కూడా అప్పుడే నిర్వహిస్తారు. ఆ ప్లీనరీ అయిపోయిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సంకేతాలను సీఎం జగన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఆశావహులకు షాక్ తగిలినట్లయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Jiu-Jitsu Strategy: రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?
రాహుల్ జియాజిట్సు వ్యూహం - మార్షల్ ఆర్ట్స్ పాఠాలు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశాయా ?
Bengal Assembly Elections 2026 : బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
బెంగాల్‌లో ఉన్నట్లుగా కూడా తెలియకుండా మాయమైన కమ్యూనిస్టులు - ఇలా ఎలా?
Telangana Govt: కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
కూల్చివేతల్లో ప్రజాస్వామ్య దారి మర్చిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం - వ్యతిరేకతను ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
CPM leader impeached: జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
జీవిత కాలం కమ్యూనిస్టుని అభిశంసించిన సీపీఎం - తమ్మినేని వీరభద్రం చేసిన తప్పేమిటి?
Pawan Kalyan Meets CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, చర్చించిన అంశాలివే
Renu Desai: సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
సైబర్ క్రైమ్ డీసీపీని కలిసిన రేణూ దేశాయ్... ట్రోలర్స్‌పై కంప్లైంట్!
Jubilee Hills traffic: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభం - ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఇవిగో ప్రత్యామ్నాయ రూట్స్
Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ సమయంలో వైరల్ అవుతున్న బాబా వాంగ భవిష్యవాణి!
Embed widget