అన్వేషించండి

Dharmana Brothers : ధర్మాన బ్రదర్స్ రాజకీయ సన్యాసం - సైలెంట్‌ అయిపోవడానికి అదేనా కారణం ?

Srikakulam : ధర్మాన బ్రదర్స్ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఓడిపోయిన దగ్గర నుంచి వారు బయట కనిపించడం లేదు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

Dharmana brothers retiring from politics : శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ధర్మాన సోదరులు పొలిటికల్ రిటైర్మెంట్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ తరపున పోటీ చేసి ఇద్దరూ ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇద్దరూ మంత్రులుగా చేశారు. మొదట ధర్మాన కృష్ణదాసు.. తర్వాత ధర్మాన ప్రసాదరావు మంత్రులుగా చేశారు. ఇద్దరూ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఈ కారణంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. వారి వారి నియోజకవర్గాల్లో వైసీపీ కార్యక్రమాలు చేపట్టడం లేదు. జగన్ తో సమావేశాల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. 

ఎన్నికల్లో అయిష్టంగానే పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు 

ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో కృష్ణదాసు కంటే సీనియర్. ఆయన 1989లో మొదటి సారి నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తంగా నాలుగు సార్లు గెలిచారు. మూడు సార్లు మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలోనే సీనియర్ నేతగా  పేరు పొందారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయ పయనం గందరగోళంగా మారింది. ఆయన కంటే ముందే ఆయన సోదరుడు కృష్ణదాస్ జగన్ వెంట నడిచారు. దాంతో ఆయనకే వైసీపీలో ప్రాధాన్యం లభించింది. ఆ తర్వాత మరో ఆప్షన్ లేకపోవడంతో ధర్మాన కూడా వైసీపీలో చేరారు. శ్రీకాకుళం నుంచి ఓ సారి గెలిచి రెండు సార్లు ఓడిపోయారు. గత ఎన్నికల్లో మంత్రిగా ఉండి కూడా యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. 

వారసుడికి రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నం 

నిజానికి ధర్మాన ప్రసాదరావు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. తన వారసుడికి అవకాశం ఇవ్వాలని జగన్ పై ఒత్తిడి తెచ్చారు.కానీ జగన్ మాత్రం ధర్మాన ప్రసాదరావునే పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. చివరికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఎన్నికలకు ముందే తాను పోటీ చేయలేను అన్నానని జగన్ ఒత్తిడి మేరకే పోటీ చేస్తున్నానని  చెప్పుకొచ్చేవారు. ఇది ప్లస్ అయిందో.. మైనస్ అయిందో కానీ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు. 

పక్క చూపులు చూస్తారా ?                                                   

ధర్మాన కృష్ణదాసు కూడా తన వారసుడ్ని ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకున్నారు.కానీ అవకాశం లభించలేదు.  టీడీపీ కూటమి భారీ విజయంతో వైసీపీకి ఇక భవిష్యత్ ఉంటుందా లేదా అన్న అనుమానం సిక్కోలు వైసీపీ నేతల్లో ప్రారంభమయింది. దానికి కారణం భారీగా వచ్చిన మెజార్టీలే. సంక్షేమ పథకాల ప్రభావం అసలేమీ లేకపోవడం వారిని ఆశ్చర్యపరిచింది. అందుకే రాజకీయ భవిష్యత్ పై ఆశలు వదిలేసుకున్నారని అంటున్నారు. కుదిరితే తమ వారసుల్ని టీడీపీ లేదా జనసేనల్లోకి పంపించడం మంచిదని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతల్లో ఒక్క దువ్వాడ శ్రీనివాస్ తప్ప ఎవరూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
YS Jagan : హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల -  వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందువులకు రిప్రజెంటేటివ్‌లు అయితే చంద్రబాబును తిట్టాల - వాళ్లకు సగం తెలుసు సగం తెలియదు - బీజేపీ నేతలపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
India vs Bangladesh 1st Test: తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?
Jagan About Tirumala: తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
తిరుమలలో మా హయాంలో విప్లవాత్మక మార్పులు, వీటిని కాదనగలరా?: వైఎస్ జగన్
Amazon Great Indian Festival Sale: అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌ -  స్మార్ట్‌ ఫోన్లపై అదిరే  ఆఫర్లు -  రూ.10 వేల కన్నా తక్కువకే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Embed widget