US Ambassador Sergio Gore: టారిఫ్ వార్ మధ్య డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం, భారత్లో కొత్త US రాయబారి నియామకం !
US Ambassador Sergio Gore: భారత్లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ నియమితులయ్యారు. ఈ మేరకు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక దూతగా కూడా వ్యవహరిస్తారు.

US Ambassador Sergio Gore: భారత్తో టారిఫ్ వార్ నడుస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తన నమ్మకస్తుల్లో ఒకరైన సెర్గియో గోర్ను భారతదేశానికి తదుపరి అమెరికా రాయబారిగా నియమించారు. దీనితో పాటు, గోర్కు సౌత్ అండ్ మిడిల్ ఈస్ట్ ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి బాధ్యతను కూడా అప్పగించారు. భారత్పై భారీ టారిఫ్లు విధించిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్లో దీనిపై ప్రకటన చేస్తూ, 'సెర్గియో గోర్ను భారతదేశానికి తదుపరి అమెరికా రాయబారిగా, దక్షిణ - మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. సెర్గియో అండ్ అతని బృందం రికార్డు సమయంలో మా సమాఖ్య ప్రభుత్వ విభాగాల్లో 4,000 కంటే ఎక్కువ మంది అమెరికా ఫస్ట్ పాట్రియట్లను నియమించారు. వారు నా ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి అమెరికాను తిరిగి గొప్పగా చేయడానికి సహాయం చేస్తారు.
US President Donald Trump posts, "I am pleased to announce that I am promoting Sergio Gor to be our next United States Ambassador to the Republic of India, and Special Envoy for South and Central Asian Affairs... For the most populous Region in the World, it is important that I… pic.twitter.com/KI3ytYuZXG
— ANI (@ANI) August 22, 2025
సెర్గియో గోర్ చాలా కాలంగా ట్రంప్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నారు. ఆయన డొనాల్డ్ ట్రంప్ జూనియర్తో కలిసి Winning Team Publishingని స్థాపించారు. దీని కింద, అధ్యక్షుడు ట్రంప్ రెండు పుస్తకాలు ప్రచురించారు. దీనితో పాటు, ట్రంప్ ప్రచారాలకు మద్దతు ఇచ్చే అతిపెద్ద సూపర్ PACలలో ఒకదానిని నిర్వహించారు. ట్రంప్ గోర్ను ప్రశంసిస్తూ, సెర్గియో ఒక గొప్ప స్నేహితుడు, సహచరుడు, ఎన్నికల ప్రచారాల నుంచి ప్రచురణల వరకు ప్రతి అడుగులో నాతో ఉన్నారు. అతను ఈ ప్రాంతానికి అద్భుతమైన రాయబారిగా నిరూపితమవుతాడు అని అన్నారు.
భారతదేశానికి రాయబారిగా నియమితులైనప్పుడు సెర్గియో గోర్ ఏమన్నారు?
భారతదేశానికి తదుపరి రాయబారిగా నామినేట్ అయినప్పుడు సెర్గియో గోర్ స్పందించారు. అమెరికాను భారతదేశంలో ప్రతినిధిగా ఉంచడం తన జీవితంలోనే అతిపెద్ద గౌరవంగా భావిస్తున్నానని ఆయన Xలో రాశారు. ఈ పరిపాలన గొప్ప పనుల ద్వారా అమెరికా ప్రజలకు సేవ చేయడమే తనకు గర్వకారణం. ఆయన అధ్యక్షుడు ట్రంప్ అపారమైన నమ్మకం, విశ్వాసానికి ధన్యవాదాలు తెలిపారు. ఇది తన కెరీర్లో ఒక మైలురాయి అని అన్నారు.
ట్రంప్ నమ్మకస్తుడు సెర్గియో గోర్
ట్రంప్ పరిపాలనలో గోర్ సీనియర్ అధికారుల నియామక ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల, ఆయన నాసా చీఫ్ కోసం బిలియనీర్ జారెడ్ ఐసాక్మాన్ నామినేషన్ ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. పరిపాలనా నిర్మాణాన్ని ట్రంప్ దృష్టికి అనుగుణంగా మార్చగల వ్యక్తిగా గోర్ పేరు పొందారు.
ప్రస్తుతం భారతదేశంలో అమెరికా రాయబారి ఎవరు?
మే 11, 2023 నుంచి జనవరి 20, 2025 వరకు భారతదేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ఎరిక్ గార్సెట్టి స్థానంలోకి సెర్గియో గోర్ వస్తారు. అంతకుముందు కెన్నెత్ జస్టర్ (2017–2021) ఈ పదవిని నిర్వహించారు. గార్సెట్టి పదవీకాలం ముగిసిన తర్వాత, జనవరి 20, 2025న బాధ్యతలు స్వీకరించిన జోర్జెన్ కె. ఆండ్రూస్ భారత దేశంలో అమెరికా రాయబార కార్యాలయానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు గోర్ నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంది. అప్పటి వరకు, అతను వైట్ హౌస్లో తన ప్రస్తుత పాత్రను కొనసాగిస్తారు.





















