అన్వేషించండి

Brain-Eating Amoeba: బ్రెయిన్ ఈటింగ్ అమిబాతో రెండేళ్ల బాలుడు మృతి- చెరువులు, నదుల్లో స్నానాలు చేసేవారికి సోకే ప్రమాదం!

బ్రెయిన్ ఈటింగ్ అమిబా వ్యాధితో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో నదులు, చెరువుల్లో స్నాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నెవడాలో నెగ్లేరియా ఫౌలేరీ ఇన్‌ఫెక్షన్‌తో రెండేళ్ల బాలుడు రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఈ వ్యాధిని బ్రెయిన్ ఈటింగ్ అమిబా అని కూడా అంటారు. ఇంటికి సమీపంలో ఉన్న వాటర్‌లో ఆడుకుంటున్న టైంలోనే ఈ ఇన్‌ఫెక్షన్ సోకి ఉంటుందని ప్యామిలీ మెంబర్ అనుమానిస్తున్నారు. 

కుమారుడి మరణంపై బాలుడి తల్లి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు షేర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బిడ్డ తన కుమారుడని చెప్పుకొచ్చారు. ఏడు రోజులు మృత్యువుతో పోరాడుతూ తన బిడ్డ స్వర్గానికి తన తండ్రి వద్దకు వెళ్లిపోయారని రాసుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన  వాళ్లు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు బతకలేదని తన కుమారుడు మాత్రం ఏడు రోజులు ఉన్నాడని చెప్పుకొచ్చారు.  

తన బిడ్డే తనకు నిజమైన హీరో అనిఅన్నారు. అలాంటి మంచి బిడ్డను ఇచ్చిన దేవుడి ఎప్పుడూ రణపడి ఉంటానని చెప్పారు. ఏదో ఒక రోజు తన బిడ్డను స్వర్గంలో కలుసుకుంటాని అన్నారు. 

ఫ్వూ లక్షణాలు కనిపించిన వెంటనే బాలుడి ఫ్యామిలీకి అనుమానం వచ్చింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు మెనింజైటీస్‌ అనుకున్నారు. తర్వాత అది మెనింజైటీస్ కాదు ప్రమాదకరమైన బ్రెయిన్ ఈటింగ్ అమిబా అని గుర్తించారు. 2023 ఫిబ్రవరిలో అమెరికాలో ఇదే వ్యాధితో 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. 

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తన రెండేళ్ల చిన్నారికి చికిత్స అందించడానికి నిరాకరించిందని బాలుడి తల్లి బ్రియానా ఫేస్‌బుక్ పోస్ట్‌ ఆరోపించారు. తన కొడుకు ఎటువంటి రోగం నుంచైన ప్రాణాలతో బయటపడే శక్తి ఉన్నవాడని పేర్కొన్నారు. ఆమె ఆరోపణలపై CDC స్పందించలేదు.

CDC ప్రకారం, నెగ్లేరియా ఫౌలెరి అనేది సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటి వెచ్చని మంచినీటి వాతావరణాలలో కనిపించే ఒక రకమైన అమీబా (ఏకకణ జీవి). ఇది నీరు ద్వారా ముక్కులోకి వెళ్లి మెదడుకు సోకుతుంది. ఈ కారణంగా దీనిని బ్రెయిన్-ఈటింగ్ అమీబా అని అంటారు. ఇది అరుదైన వ్యాధి. అత్యంత ప్రాణాంతకమైనది. దాని బారిన పడితే బ్రతికే శాతం చాలా తక్కువ.

నెగ్లేరియా సోకిన తరువాత ఒకటి నుంచి 12 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. CDC ప్రకారం, లక్షణాలు కనిపించిన తర్వాత ఒకటి నుంచి 18 రోజులలోపు వ్యక్తులు మరణిస్తారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ పట్టేయడం, మూర్ఛ, ప్రధాన లక్షణాలు. నీటి నుంచి ప్రాణాంతక జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని, బయట చెరువులు, జలాశయాల్లో స్నానాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని CDC అధికారులు సూచిస్తున్నారు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
US Woman Liz Shocked Indian Medicine Prices Cancer: అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
అమెరికాలో రూ.85,000.. ఇండియాలో రూ.35! క్యాన్సర్ మందుల ధరలు చూసి అమెరికన్ మహిళ షాక్!
New Jersey Indian Grocery Store Parval Sale: కూరగాయల మార్కెట్టే.. ఇక్కడయినా.. అమెరికా అయినా ! మనోళ్లు మారరుగా !
కూరగాయల మార్కెట్టే.. ఇక్కడయినా.. అమెరికా అయినా ! మనోళ్లు మారరుగా ! వీడియో
Iraq Anti Corruption Raid: ఇరాక్ మహిళా ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు .. అవినీతి సోదాల్లో అధికారులకే మైండ్ బ్లాంక్!
ఇరాక్ మహిళా ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు .. అవినీతి సోదాల్లో అధికారులకే మైండ్ బ్లాంక్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget