అన్వేషించండి

Maharashtra Crisis: వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చు, కొత్త శివసేనను సృష్టిస్తానన్న ఉద్దవ్ థాక్రే

పార్టీని కాదని వెళ్లిపోయిన వారికి మరోసారి ఉద్దవ్ థాక్రే చురకలు అంటించారు. భాజపాతో కుమ్మక్కై ఈ నాటకం ఆడుతున్నారంటూ విమర్శించారు.

భాజపా,మా ఉనికి లేకుండా చేయాలని చూస్తోంది: ఉద్దవ్ థాక్రే

"వెళ్లిపోవాలనుకునే వాళ్లు వెళ్లిపోవచ్చు,నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కొత్త శివసేనను సృష్టించే పనిలో ఉన్నాను" అని అంటున్నారుఉద్దవ్ థాక్రే. ఈ కుట్ర వెనకాల భాజపా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీపైనా విరుచుకుపడ్డారు థాక్రే. భాజపా,షిండేకుమ్మక్కై శివసేన నేతల్ని లాక్కుపోతున్నారని, తమ పార్టీ ఉనికే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగానే కొత్త శివసేననుసృష్టిస్తానంటూ వ్యాఖ్యానించారు. పార్టీ సభ్యులే తనకు ఆస్తి అని, తనపై వచ్చే విమర్శల్ని అసలు పట్టించుకోని స్పష్టం చేశారు థాక్రే. శివసేనను సొంత వాళ్లే మోసం చేస్తున్నారంటూ షిండేని ఉద్దేశిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులపై పార్టీ కార్యకర్తల్తో 
వర్చువల్‌గా సమావేశమైన ఆయన ఇంత కఠినమైన సమయంలోనూ అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

శిక్షలు తప్పించుకునేందుకే భాజపా వైపు..

"మా కూటమిలో ఏదో జరుగుతోందని, మిగతా పక్షాలు ఏయే అంశాల్లో అసహనంగా ఉన్నాయో తెలుసుకోవాలని గతంలోనే షిండేతో నేను మాట్లాడాను. శివసేన భాజపాతో చేతులు కలపాలనే చాలా మంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని షిండే నాతో చెప్పారు. కానీ నేను అందుకు అంగీకరించలేదు. ఎవరైతే అలా కోరుకుంటున్నారో వాళ్లందరితోనూ మాట్లాడతానని చెప్పాను. భాజపా మా ఆశల్ని, ఆశయాల్ని పట్టించుకోలేదు. హామీల్నీ నెరవేర్చ లేదు. ఇప్పుడు షిండే శిబిరానికి వెళ్లిన వారందరిపైనా కేసులున్నాయి. వాటిని మాఫీ చేసుకునేందుకే భాజపా చెప్పినట్టుగా ఆడుతున్నారు. మాతో ఉంటే శిక్ష పడక తప్పదనే ఇలా చేస్తున్నారు" అని అన్నారు థాక్రే. 

అడిగితే ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేవాడిని..

"నాతో ఓ మాట చెప్పి ఉంటే మీకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చేలా ప్రయత్నించే వాడిని కదా" అంటూ షిండేని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిజానికి ఎప్పుడో షిండే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని, ఇప్పుడు సందర్భం రాగానే వెళ్లిపోయాడని అన్నారు. హిందూ ఓట్‌ బ్యాంక్‌నిచీల్చటం ఇష్టం లేకే భాజపా ఇలాంటి కుట్రలు చేస్తోందని విమర్శించారు థాక్రే. ఇప్పటికిప్పుడు భాజపాతో చేతులు కలిపి షిండే ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవలేదని, చాలా మంది ఎమ్మెల్యేలు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారని అన్నారు. ఈరెబల్స్ నేతలు వచ్చే ఎన్నికల్లో గెలవటం అసాధ్యమని చెప్పారు. 

ప్రస్తుతానికి ఏక్‌నాథ్ షిండేకి ఎమ్మెల్యేల మద్దతు బాగానే ఉంది. ఈ వారాంతం గడిచేలోగా వారి సంఖ్య 50కి చేరనుందని అంచనా. అదే నిజమైతే ప్రభుత్వం ఏర్పాటు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. అయితే వీరిలో ఎంత మంది స్థిరంగా ఉంటారు అన్న విషయంలో ఇంకా స్పష్టతరావాల్సి ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

RK Roja: మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
ABP Desam Top 10, 27 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 27 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Embed widget