అన్వేషించండి

Vaikunta Ekadasi News: తిరుమల సహా వివిధ దేవాలయాల్లో తెరుచుకున్న వైకుంఠ ద్వారం- పోటెత్తిన భక్త జనం

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వారం తెరుచుకుంది. శనివారం వేకువజామున 1:30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయానిక పక్కనే ఉన్న వైకుంఠ ద్వారం తెరిచారు.

Vaikunta Ekadasi News: తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకవజాము నుంచి తెరుచుకున్న వైకుంఠ ద్వారం గుండా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా తిరుమలలో ఏడు కొండలు పూర్తిగా జనంతో నిండిపోయాయి. విఐపీలు, సామాన్యులు అంతా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పరవశించిపోతున్నారు. Image

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వారం తెరుచుకుంది. శనివారం వేకువజామున 1:30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయానిక పక్కనే ఉన్న వైకుంఠ ద్వారం తెరిచారు. Image

ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టిటిడి అధికారులు అనుమతించారు. ఈ సందర్భంగా టిటిడి పాలక మండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినంను తిరుమలలో ఘనం నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులంతా చాలా సంతృప్తితో వైకుంఠ ద్వరం గుండా స్వామి వారిని దర్శించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. Image

ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించడంలో టిటిడి సఫలం అయ్యిందన్నారు. అనంతరం టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం 1:40 గంటలకు ప్రారంభమైందన్నారు. మొత్తం 4వేల విఐపి టోకెన్లు జారీ చేయగా 3,850 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయినట్టు వెల్లడించారు.  వేకువజామున 1:40కి ప్రారంభంమైన విఐపి బ్రేక్ దర్శనాలు ఉదయం 5:15కి ముగిసిందన్నారు.

‌ ఎస్ఎస్డి, ఎస్ఈడి స్లాట్స్‌ను ఉదయం 6 గంటలకు ఇచ్చామని ధర్మారెడ్డి తెలిపారు. 45 నిమిషాల ముందే సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించామని వివరించారు. ప్రతి స్లాట్ కూడా గంటన్నర ముందుగా తీసుకుని వైకుంఠంలో కూర్చోబెట్టి, భక్తులకు దర్శనం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 

ఒక వేళ భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే పరిస్ధితి వస్తే, గంటా, రెండు గంటల కంటే ఎక్కువ సేపు వేచి ఉండే పని ఉండదని, భక్తులందరికి ఆహార పదార్థాలు, కాఫీ, టీ,‌పాలు అందిస్తున్నామని ఈవో వెల్లడించారు. తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశామన్నారు. ఎస్ఎస్డి, ఎస్ఈడి టోకెన్లు కలిపి ప్రతి రోజు స్వామి వారి కైంకర్యాలు బట్టీ రోజుకి 70 నుంచి 75 వేల మందికి దర్శనం కల్పిస్తామన్నారు. పది రోజుల్లో ఎనిమిది లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
Live In Relation: సహజీవనం చేస్తున్న జంటలకు కుటుంబ హోదా- India Census పై కేంద్రం కీలక నిర్ణయం
సహజీవనం చేస్తున్న జంటలకు కుటుంబ హోదా- India Census పై కేంద్రం కీలక నిర్ణయం
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Embed widget