అన్వేషించండి

Weather Updates: వేడెక్కుతున్న ఏపీ, తెలంగాణ ! అక్కడ మాత్రం చలి తీవ్రత తగ్గలేదు

AP Weather Updates: గత కొన్ని రోజులుగా 15 డిగ్రీలుగా నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని ప్రాంతాలల్లో 20 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల చలి ప్రభావం ఇంకా తగ్గలేదు.

Weather Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో వాతావరణం వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా 15 డిగ్రీలుగా నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని ప్రాంతాలల్లో 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు.

దక్షిణ, నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, వాతావరణం మరింత వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన లేదని కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతాయిని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని చెప్పారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 17.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామలో 18.6 డిగ్రీలు, కళింగపట్నంలో 22 డిగ్రీలు, బాపట్లలో 19.3 డిగ్రీలు, అమరావతిలో 19.3 డిగ్రీలు, విశాఖపట్నంలో 22.6 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amaravati AP (@mc_amaravati)

రాయలసీమ​, తెలంగాణ ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా మారింది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ సైతం భారీగానే పెరిగాయి. ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 15.5 డిగ్రీలు నమోదైంది. అనంతపురంలో 17.5 డిగ్రీలు, నంద్యాలలో 18.5 డిగ్రీలు, తిరుపతిలో 19 డిగ్రీలు, కర్నూలులో 21.1 డిగ్రీలు, కడపలో 21.6 డిగ్రీల మేర రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ వెదర్ అప్‌డేట్.. 
Telangana Weather Updates: తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో వాతావరణం వేడెక్కుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యల్పంగా నల్గొండలో కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదు కాగా, ఆదిలాబాద్ లో 18.1, భద్రాచలంలో 20.8, దుండిగల్‌లో 18.2, మెదక్ జిల్లాలో 19 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.

Also Read: Petrol-Diesel Price, 21 February: నేడు అన్ని చోట్లా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ ఒక్కచోట భారీ తగ్గుదల

Also Read: Gold-Silver Price: నేడు పసిడి ప్రియులకు స్వల్ప ఊరట! తగ్గిన బంగారం ధర, వెండి రేటు నేడు ఎంతంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Amberpet Flyover: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, శివరాత్రి నుంచి అంబుబాటులోకి మరో ఫ్లైఓవర్
Amberpet Flyover: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, శివరాత్రి నుంచి అంబుబాటులోకి మరో ఫ్లైఓవర్
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Inter Halltikets: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Amberpet Flyover: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, శివరాత్రి నుంచి అంబుబాటులోకి మరో ఫ్లైఓవర్
Amberpet Flyover: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్, శివరాత్రి నుంచి అంబుబాటులోకి మరో ఫ్లైఓవర్
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Inter Halltikets: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - ఇలా పొందండి
AAP MLAs Suspension: ఢిల్లీ అసెంబ్లీలో నిరసన, మాజీ సీఎం అతిషి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు
ఢిల్లీ అసెంబ్లీలో నిరసన, మాజీ సీఎం అతిషి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు
Salaar Re Release: ఖాన్సార్‌కు తిరిగి వస్తున్న దేవా... 'సలార్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్... డార్లింగ్ ఫాన్స్‌కు పూనకాలే
ఖాన్సార్‌కు తిరిగి వస్తున్న దేవా... 'సలార్' రీ రిలీజ్ డేట్ ఫిక్స్... డార్లింగ్ ఫాన్స్‌కు పూనకాలే
Daggubati Meets Chandrababu: ఎన్నాళ్లకెన్నాళ్లకూ.. చంద్రబాబును నివాసానికి వెళ్లి కలిసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
ఎన్నాళ్లకెన్నాళ్లకూ.. చంద్రబాబును నివాసానికి వెళ్లి కలిసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు
Annamayya Elephants Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి - రూ.10 లక్షల పరిహారం
Embed widget