అన్వేషించండి

Power Point : ప్రజలకు కోతలు విధించి ఎక్స్ఛేంజీలలో కరెంట్ అమ్మకం .. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ఆగ్రహం !

ప్రజలకు కరెంట్ కోతలు విధించి కరెంట్‌ను ఎక్స్ఛేజీలలో అమ్ముకుంటున్నారని కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి రాష్ట్రాలకు అదనపు విద్యుత్ ఇవ్వబోమని స్పష్టం చేసింది.


దేశంలో పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. బొగ్గు సరఫరాను పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదు రోజులకు సరి పడా ఉండేలా ప్రతి రాష్ట్రానికి బొగ్గు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు విద్యుత్ ను బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్న విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో ఆయా రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఎవరికైనా మిగులు విద్యుత్ ఉంటే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలి కానీ అత్యధిక రేటుకు పవర్ ఎక్స్ఛేంజ్‌లలో అమ్మడం కరెక్ట్ కాదని హెచ్చరించింది. అలాగే కొన్ని  రాష్ట్రాలు ప్రజలకు కోత విధించి మరీ అమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Also Read : గుడ్ న్యూస్.. పిల్లలకు టీకా.. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశంలో కరెంట్ సంక్షోభంపై కేంద్రం సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇప్పటికే నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్డానికి కేంద్రం సిద్ధమయింది. ముందుగా రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది.  కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్ వాడుకోవాలని ఆఫర్ ఇచ్చింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలు అధిక ధరలకు విద్యుత్ విక్రయిస్తున్నాయిని... వినియోగదారులకు ఇవ్వకుండా విద్యుత్ అమ్ముకోకూడదని స్పష్టం చేసింది.ఎక్కువ ధర కోసం విద్యుత్ అమ్ముకునే రాష్ట్రాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలా చేస్తే కేటాయించని విద్యుత్ వాడుకునే వెసులుబాటు తొలగిస్తామని హెచ్చరించింది. 

Also Read : తెలంగాణలో కలిసేందుకు మహారాష్ట్ర, కర్ణాటక సరిహ్దదు ప్రాంతాల ఆసక్తి ! కారణం ఏమిటంటే ?

విద్యుత్ సరఫరా బాధ్యత డిస్ట్రిబ్యూషన్ కంపెనీలదే నని..మిగులు ఉన్న రాష్ట్రాలు ఆ విషయం కేంద్రానికి తెలియచేయాలని ఆదేశించింది.  మిగులు ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం పవర్ ఎక్స్ఛేంజీలో విద్యుత్ రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా కొన్ని రాష్ట్రాలు తమ ప్రజలకు కరెంట్ కోతలు విధించి మరీ అమ్ముకుంటున్నాయి. ఈ విషయం తెలిసి కేంద్రం తాజా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 


Also Read : టీఆర్ఎస్‌కు ఆదాయం ఎక్కువ.. టీడీపీకి ఖర్చెక్కువ ! ప్రాంతీయ పార్టీల జమాఖర్చుల్లో చిత్రాలెన్నో !

దేశంలో బొగ్గు కొరత లేదని.. కరెంట్ సంక్షోభం రానే రాదని కేంద్రం చెబుతోంది. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం బీద అరుపులు అరుస్తూనే ఉన్నాయి. బొగ్గుకు డబ్బులు కట్టకపోవడం వల్ల కొందరికి.. ఆలస్యం అవుతోంది. అయితే బకాయిలు చెల్లించకపోయినా బొగ్గు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. కరెంట్ సంక్షోభం కారణంగా రాష్ట్రాలకు కేంద్రం చేసిన హెచ్చరికలు హాట్ టాపిక్ అవుతున్నాయి. 

Also Read : "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
DC vs GT Match Highlights: 'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
Actor Raghubabu Car Incident: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Embed widget