By: ABP Desam | Updated at : 12 Oct 2021 11:54 AM (IST)
ఆదాయంలో ఫస్ట్..ఖర్చులో లాస్ట్
రాజకీయ పార్టీలు నడపడం అంటే చిన్న విషయం కాదు. కోట్లలోనే ఖర్చు ఉంటుంది. అనధికారికంగా పెట్టే దాని గురించి పక్కన పెడితే అదికారికంగా పెట్టాల్సిన ఖర్చే ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పార్టీలు పూర్తిగా విరాళాల మీద ఆధారపడాల్సిందే. అలాంటి విరాళాలు పొందడంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంతో ముందు ఉందని అసోసియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించింది. రాజకీయ పార్టీలు ప్రధానంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నాయి. జాతీయ పార్టీల సంగతి పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలకూ దండిగానే విరాళాలు వస్తున్నాయి.
Also Read : హుజూరాబాద్ లో ఉత్కంఠ... ఈటల రాజేందర్ పై కేసు నమోదు... బరిలో నలుగురు ఈ రాజేందర్ లు
గుర్తింపు పొందిన 42 ప్రాంతీయ పార్టీలకు 2019-20లో రూ.877.95 కోట్ల విరాళాల ఆదాయం వచ్చింది. ఈ పార్టీల్లో నెంబర్ వన్గా తెలంగాణ రాష్ట్ర సమితి నిలిచింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.130.46 కోట్ల ఆదాయం టీఆర్ఎస్కు వచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర అధికార పక్షంలో ప్రధాన భాగస్వామి అయిన శివసేనకు రూ.111.4 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రూ.92.7 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో ఉంది. ఈ మూడు పార్టీలకే దాదాపుగా 40శాతం నిధులు వెళ్లాయి.
Also Read: హుజురాబాద్ బలిపశువు హరీష్ రావే .. టీఆర్ఎస్ -బీజేపీ కలిసే రాజకీయం చేస్తున్నాయంటున్న రేవంత్
ఆదాయం పొందడంలోనే అగ్రగామిగా ఉంటున్న పార్టీలు ఖర్చు విషయంలో మాత్రం పసినారితనంతో వ్యవహరి్సతున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక ఆదాయం పొందుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి తనకు వచ్చిన ఆదాంయలో కేవలం 16.24 శాతం మాత్రమే ఖర్చు చేస్తోంది. మిగిలిన అంతా బ్యాంక్ అకౌంట్లలోనే భత్రంగా ఉంచుకుంది. అయితే చాలా పార్టీలు వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువగా ఖర్చు పెడుతున్నాయి. అలాంటి పార్టీల జాబిాతలో టీడీపీ ఉంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేసినట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. డీఎంకే, బీజేడీ, సమాద్వాదీ, జేడీఎస్ తదితర పార్టీలు కూడా ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశారు.
Also Read: కేసీఆర్ పీఠం కూలుస్తా... టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడను... ఈటల రాజేందర్ ఫైర్
2017లో ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశ పెట్టారు. ఎస్బీఐ రూ.1000, రూ.10,000, లక్షా, 10 లక్షలు, ఒక కోటి రూపాయాల డినామినేషన్లో విక్రయిస్తుంది. విరాళాలు ఇచ్చే వారు తమకు నచ్చిన పార్టీ పేరు మీద ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు లేదా విరాళంగా ఇవ్వవచ్చు. ఈ బాండ్లలో భాగంగా విరాళాలు ఎవరు ఇస్తున్నారు..? అనేది గోప్యంగా ఉంటుంది. అందుకే ఈ ఎలక్టోరల్ బాండ్లపై అనేక విమర్శలు ఉన్నాయి. ఎక్కువగా అధికార పార్టీలకు మాత్రమే ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు వస్తూటాయి. బీజేపీకి మొత్తం విరాళాల్లో 80 శాతం వరకూ అందుతూ ఉంటాయి.
"మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Post Office Jobs: పోస్టాఫీసుల్లో కొలువుల జాతర, 40 వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి! తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Delhi Hit And Drag Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ డ్రాగ్ కేసు - 350 మీ. ఈడ్చుకెళ్లిన కారు, ఒకరు మృతి
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Hyderbad Crime : ఆన్లైన్ లో కాంటాక్ట్ చేసి హైదరాబాద్ కు రప్పించి, వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన కేటుగాడు
AP Localbody Elections: ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు, నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!