అన్వేషించండి

PM Modi: రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్, చర్చించే దమ్ములేక పారిపోయారంటూ మోదీ చురకలు

PM Modi Speech: రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సమయంలోనే విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆ తరవాత గట్టిగా నినదిస్తూ వాకౌట్ చేశాయి.

PM Modi Speech in Rajya Sabha: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేశారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మూడోసారి NDAకి పట్టంకట్టారని అన్నారు. కొందరు ప్రజా తీర్పుని అంగీకరించలేకపోతున్నారని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. తమ విజయాన్ని చూసి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. తాము చేసిన అభివృద్ధి పనులే ఎన్నికల ఫలితాలకు నిదర్శనమని తేల్చి చెప్పారు. రాజ్యాంగం తమకు చాలా పవిత్రమైందని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. గతంలో రిమోట్ ప్రభుత్వం నడిచిందని కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. ప్రజలు ఓడించినా ఇంకా ఆ పార్టీలో మార్పు రాలేదని మండి పడ్డారు. గత పదేళ్లలో ప్రభుత్వం ఎంతో చేసిందని వెల్లడించారు. అయితే..ఇదంతా శాంపిల్ మాత్రమేనని, భవిష్యత్‌లో అసలు అభివృద్ధి చూస్తారని స్పష్టం చేశారు. మోదీ ప్రసంగిస్తుండగానే విపక్ష నేతలు నినదించారు. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. ఆ తరవాత సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపైనా ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. చర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారని ఎద్దేవా చేశారు. 

"నిజాలు వినే సత్తా లేని వాళ్లను, అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసే వాళ్లను దేశ ప్రజలు గమనిస్తున్నారు. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేని వాళ్లకు సభలో సమాధానాలు వినే ధైర్యమూ ఉండదు. వాకౌట్‌ చేసి ఈ సభను తీవ్రంగా అవమానించారు. సభా సంస్కృతికే మచ్చతెచ్చారు"

- ప్రధాని మోదీ 

కాంగ్రెస్ మాజీ చీఫ్‌ సోనియా గాంధీని రిమోట్ అని మోదీ సెటైర్లు వేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం ఆటో పైలట్, రిమోట్ పైలట్‌ మోడ్‌లో నడిచిందని విమర్శించారు ప్రధాని. అయితే..సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలను మాత్రం కాంగ్రెస్ ఖండించింది. మోదీ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. తనకు మాట్లాడే అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాజ్యసభ ఛైర్మన్‌ని కోరారు. కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. దీనికి నిరసనగా వెంటనే నినాదాలు చేసి సభ నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. 

మహిళా అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిచ్చిందని తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. ఆ చర్యలే ఇప్పుడు ఫలితాలనిస్తున్నాయని వెల్లడించారు. మహిళల ఆరోగ్యంపైనా దృష్టి పెట్టామని వివరించారు. బెంగాల్‌లో ఓ మహిళపై రోడ్డుపైనే దాడి జరిగిన ఘటనను సభలో ప్రస్తావించారు ప్రధాని మోదీ. ఆ ఘటనపై ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సీనియర్ నేతలు కూడా మౌనంగా ఉండిపోయారని విమర్శించారు. 

Also Read: Hathras Stampede: బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Hyderabad Crime News: ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
ఘట్‌కేసర్‌లో రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య! లంగర్ హౌజ్ లాడ్జిలో యువతి మృతి
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
160 km రేంజ్‌, రూ.1.40 లక్షల రేటు - ఇదే కాదు, Revolt RVX గురించి మీకు ఇంకా తెలియాలి!
చూడ్డానికి స్టైల్‌గా ఉందని Revolt RVX కొనబోతున్నారా? ముందు ఈ 5 నిజాలు తెలుసుకోండి!
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Embed widget