అన్వేషించండి

UPSC Civil Services Result: యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

UPSC CSE 2025 Results | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ upsconline.nic.in లో రిజల్ట్స్ చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది.

UPSC CSE Result 2025 | దేశంలోనే అత్యున్న సర్వీసులైన  UPSC CSE 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ శుక్రవారం మధ్యాహ్నం రిలీజ్ చేశారు. అనూజ్ అగ్నిహోత్రి యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా నిలిచాడు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొత్తం 958 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జనరల్‌ కేటగిరీలో 317 మంది సెలక్ట్ కాగా, ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా నుంచి 104 మంది, ఓబీసీ నుంచి 306 మంది, ఎస్సీ కేటగిరిలో 158, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది పలు సర్వీసులకు ఎంపికయ్యారు. UPSC తన అధికారిక వెబ్‌సైట్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించింది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు నమోదు చేసి తమ ఫలితాలను చూడవచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా విజయం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆనందం నెలకొంది. ఇటీవల ఇంటర్వ్యూ నిర్వహించారు. పర్సనాలిటీ టెస్ట్ పాసైన అభ్యర్థుల మెరిట్ జాబితా తాజాగా విడుదల చేశారు. ఫలితాలు UPSC వెబ్‌సైట్‌లో http//www.upsc.gov.in లో కూడా అందుబాటులో ఉంటాయి. మార్కులను
ఫలితం ప్రకటించిన తేదీ నుండి 15 రోజుల్లోపు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ టాపర్లు వీరే

  1. అనూజ్ అగ్నిహోత్రి 
  2. రాజేశ్వరి సువె
  3. అకాన్ష్‌ ధూల్‌
  4. రాఘవ్‌ ఝున్‌ఝున్‌వాలా
  5. ఇషాన్‌ భట్నాగర్‌
  6. జిన్నియా అరోడా
  7. ఏఆర్‌ రాజా మొహియిద్దీన్‌
  8. పక్షల్‌ సెక్రటరీ
  9. అస్థా జైన్‌
  10. ఉజ్వల్‌ ప్రియాంక్‌


UPSC Civil Services Result: యూపీఎస్సీ సివిల్స్ టాపర్‌గా అనూజ్ అగ్నిహోత్రి.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ విడుదల

UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష మూడు దశల్లో నిర్వహిస్తారు. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ మూడు దశలను ఉత్తీర్ణులైన తర్వాతే అభ్యర్థులను సివిల్ సర్వీసెస్ కు ఎంపిక చేస్తారు. ఈసారి ఇంటర్వ్యూ ప్రక్రియ జనవరి 2026 నుండి ప్రారంభమై ఫిబ్రవరి చివరి వారం వరకు కొనసాగింది. ఢిల్లీలోని ధోల్‌పూర్ హౌస్‌లో ఉన్న UPSC ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్‌కు మొత్తం 275 మార్కులు నిర్ణయించారు. ఈ మార్కులను మెయిన్స్ పరీక్ష మార్కులతో కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. 

మెరిట్ జాబితా అభ్యర్థుల ఎంపిక 

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్‌తో పాటు, ఇతర గ్రూప్ A, గ్రూప్ B సర్వీసుల్లో కూడా ఎంపికైన అభ్యర్థులను నియమిస్తారు.

పరీక్ష ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది?

UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 మొత్తం ప్రక్రియ చాలా నెలల పాటు కొనసాగింది. మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన తర్వాత అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్‌కు పిలిచారు. ఈ అన్ని దశల తర్వాత ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక సైట్‌ను సంప్రదించవచ్చు.

UPSC CSE 2025 ఫలితాన్ని ఇలా చెక్ చేయండి

దశ 1: మొదట UPSC అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ని సందర్శించాలి.

దశ 2: హోమ్‌పేజీలో కనిపించే UPSC CSE Result 2025 లింక్‌పై క్లిక్ చేయండి.

దశ 3: దీని తర్వాత రిజల్ట్స్ PDF మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

దశ 4: ఈ PDFలో అభ్యర్థులు తమ రోల్ నంబర్ లేదా పేరును సెర్చ్ చేసి ఫలితాన్ని చూడవచ్చు.

అభ్యర్థుల EWS/ OBC/ SC/ ST, PwBD కింద వారి రిజర్వేషన్ కు సంబంధించిన క్లెయిమ్‌లు సంబంధిత అధికారుల వెరిఫికేషన్‌కు లోబడి ఉంటాయి. సిఫార్సు చేసిన 348 మంది అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని తాత్కాలికంగా హోల్డ్ చేశారు. ఇద్దరు అభ్యర్థుల ఫలితాలను నిలిపివేశారు. UPSC తన క్యాంపస్‌లోని పరీక్షా హాల్ దగ్గర “ఫెసిలిటేషన్ కౌంటర్”లో అభ్యర్థులు తమ పరీక్షలు / నియామకాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని వర్కింగ్ డేస్ లో ఉదయం 10:00 గంటల నుండి 5:00 గంటల మధ్య స్వయంగా లేదా టెలిఫోన్ నంబర్లు 23385271 / 23381125 / 23098543 ద్వారా పొందవచ్చు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Andhra Pradesh Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
ఆంధ్రప్రదేశ్‌లో పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్ విడుదల - ఏటా ఉగాదికి ఉద్యోగాల జాతర!
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget