అన్వేషించండి

Petrol : పెట్రోలు అవసరం కార్లున్న వారికేనట.. తేల్చేసిన యూపీ బీజేపీ మంత్రి !

పెట్రో రేట్లు తగ్గించమన్న వారిపై యూపీ బీజేపీ మంత్రి తివారీ మండి పడుతున్నారు. కార్లున్న వారికి మాత్రమే పెట్రోల్ అవసరం ఉంటుందని.. ఇంకెవరికి సంబంధం లేదని ఆయన అంటున్నారు.

 

దేశంలో 95శాతం మందికి పెట్రోల్ అవసరం లేదట. అవసరం లేకుండానే ప్రభుత్వం పన్నులను టన్నుల కొద్దీ పెంచేసినా కొనేసి బండ్లేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారట. ఈ విషయాన్ని ఘనత వహించిన భారతీయ జనతా పార్టీ నేతలే చెబుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ రేట్లపై ఎక్కిడికక్కడ ప్రజలు నిలదీస్తూంటే ఏం చెప్పాలో తెలియని బీజేపీ నేతలు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. గతంలో పలువురు చేసిన వివాదాస్పద కామెంట్లకు కొనసాగింపుగా.. బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఉపేంద్ర తివారి మన సమాజంలో 95 శాతం మందికి పెట్రోల్‌ అవసరమే లేదని తేల్చేశారు.  కేవలం కార్లు ఉన్న 5 శాతం మందికి మాత్రమే పెట్రోల్‌ ధరల గురించి ఆందోళన ఉందని చెప్పుకొచ్చారు. 

Also Read : '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!

మంత్రి పదవులతో ప్రజల మీద సవారీ చేస్తున్న తివారీ అంతటితో ఆగలేదు.. పెట్రోల్ రేట్లు పెరిగితే ఏమీ కొనలేరా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మోడీ, యోగి హయాంలో జనాల తలసరి ఆదాయం బాగా పెరిగిందని ఆ మాత్ర పెట్రోల్ కోసం ఖర్చు పెట్టలేరా అంటున్నారు. ఒక్క తివారీ మాత్రమే కాదు. పెట్రోల్ రేట్ల గురించి అడిగితే తిక్క సమాధానాలు చెప్పే వారు బీజేపీలో కోకొల్లలుగా ఉన్నారు. ఒకరేమో పెట్రోల్ రేట్లు పెరగడానికి తాలిబన్లు అంటారు. మరొకరు నెహ్రూ కారణం అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ నేతల ప్రకటనలు చాలా నవ్విస్తాయి. కానీ పెట్రోల్ కొనేవాళ్లకు మాత్రం మంట పుట్టిస్తాయి.  

Also Read: 100 Crore Vaccinations: 'ఇక తగ్గేదేలే.. నవ చరిత్రను లిఖించాం.. 100 కోట్ల మార్క్‌పై మోదీ ప్రశంసలు'

ఓ వైపు ప్రతిపక్షాలు పెరుగుతున్న పెట్రో ధరల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.గత పదేళ్లలలో దేశంలో టూ వీలర్‌, 4 వీలర్‌ వినియోగం బాగా పెరిగింది. దాంతో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం కూడా పెరుగుతూనే ఉంది.  కానీ మంత్రికి ఈ విషయంలో పెద్దగా అవగాహన లేనట్లుగా ఉంది. మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కార్లు ఉన్నవారికే మాత్రమే పెట్రోల్‌ అవసరం ఉంటుందా.. బైకులు ఉన్న వారు నీళ్లతో నడుపుతరాా అని ప్రశ్నిస్తున్నారు.  

Also Read: Corona Vaccine For Children: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీ నేతలు ఒకప్పుడు రూ. అరవై లీటర్ పెట్రోల్ ధర ఉంటేనే అర్థనగ్నంగా రోడ్లెక్కారు. తాము వస్తే ప్రభుత్వ దోపిడిని నిలుపుదల చేస్తమన్నారు. కానీ బీజేపీ వచ్చార.. పెట్రోల్ రేటు రెండింతలు అయింది. కానీ వారికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. కానీ ఎదురుదాడికి మాతరం దిగుతున్నారు.

Also Read : 'నీ కూతురికి ఎవరితోనో సంబంధం ఉంటే.. నువ్యు రేప్ చేసేస్తావా?'

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rohit Sharma Records: ఈ ఏడాది 50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్
ఈ ఏడాది 50 రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Invest Small & Gain Big : కొత్త సంవత్సరం నుంచి ఖర్చులు తగ్గించి ఈ పని చేయండి.. ఫ్యూచర్​లో మంచి లాభం పొందుతారు
కొత్త సంవత్సరం నుంచి ఖర్చులు తగ్గించి ఈ పని చేయండి.. ఫ్యూచర్​లో మంచి లాభం పొందుతారు
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Embed widget