Hyderabad Police: హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్; 16 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ₹127 కోట్ల సైబర్ స్కామ్ గుట్టు రట్టు
Hyderabad Police Operation Octopus : దాదాపు ₹127 కోట్ల సైబర్స్కామ్కు సంబంధించిన మోసంలో పాల్గొన్న 104 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్లో 32 ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి.

Hyderabad Police Operation Octopus : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైబర్ నేరాల ప్రపంచంలో హైదరాబాద్ పోలీసులు ఒక పెద్ద ముందడుగు వేశారు. మంగళవారం మధ్యాహ్నం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ (సిపి) విజయ్ కుమార్, డిసిపి (సైబర్ నేరాలు) వి. అరవింద్ బాబు ఆపరేషన్ ఆక్టోపస్ కింద 16 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న భారీ సైబర్ మోసాల సిండికేట్ను పోలీసులు బ్రేక్ చేశారను ప్రకటించారు.
ఈ ప్రధాన ఆపరేషన్లో, దాదాపు ₹127 కోట్ల మోసంలో పాల్గొన్న 104 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కామ్లో 1,055 కేసులు ఉన్నాయి, ఇది దాని స్థాయిని తెలియజేస్తోంది. ఈ ఆపరేషన్ కోసం పోలీసులు 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు, ఇది 10 రోజుల పాటు నిరంతర దాడులు నిర్వహించి, ముఠాను వెలుగులోకి తీసుకొచ్చారు.
మోసంలో బ్యాంకు అధికారి సూత్రధారి
ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితులు నకిలీ ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి బ్యాంకు అధికారి సహాయం చేసినట్టు పోలీసుల విచారలో తేలింది. అరెస్టయిన 104 మందిలో 86 మంది మ్యూల్ ఖాతాదారులు (మోసపూరిత నిధులను బదిలీ చేయడానికి ఉపయోగించే బ్యాంకు ఖాతాలు), 17 మంది ఈ ఖాతాలను అందించిన సరఫరాదారులు.
36 లక్షల రూపాయలతో పాటు 200కి పైగా మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం
నిందితుల నుంచి పోలీసులు ₹3.6 మిలియన్ల నగదు, 200కి పైగా మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 పాస్బుక్లు, 234 ATM కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్వర్క్ మూలాలై పోలీసులు మరింత దృష్టి పెట్టారు. పోలీసుల ప్రకారం, ఈ ముఠా సభ్యులు నిరుద్యోగ యువతను వారి బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డుల ఇవ్వలని ప్రలోభపెట్టి, వారికి చిన్న మొత్తాల్లో ఆశ చూపిస్తారు. తరువాత వాటిని సైబర్ మోసానికి ఉపయోగించారు.
గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ మోసాలు
చాలా కాలంగా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. "మ్యూల్ ఖాతాల" ద్వారా మోసపూరిత నిధులు లాండరింగ్ చేయడం సర్వసాధారణమైంది. సాధారణంగా, ఇటువంటి కేసుల్లో బాధితులకు న్యాయం జరగడానికి సంవత్సరాలు పడుతుంది. అయితే, టెక్నాలజీతోపాటు, పోలీసుల దర్యాప్తు వేగవంతం చేస్తే ఇటువంటి అంతర్రాష్ట్ర ముఠాలను బహిర్గతం చేయడం కష్టం కాదని హైదరాబాద్ పోలీసులు నిరూపించారు.
ప్రజలకు పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి
ప్రజలు తమ బ్యాంకు ఖాతాలను వేరొకరికి అద్దెకు ఇవ్వడం లేదా బదిలీ చేయవద్దని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే అలా చేయడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, సైబర్ నేరస్థులకు సహాయం చేసినట్టు అవుతుందని హెచ్చరించారు. ఖాతాలు తెరిచేటప్పుడు, సిమ్ కార్డులు జారీ చేసేటప్పుడు బ్యాంకు అధికారులు, టెలికాం కంపెనీలు కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ అరెస్టు కేవలం ఒక అడుగు మాత్రమే కాదని హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరస్థులను విడిచిపెట్టరనే సందేశం ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని వెల్లడి అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నెట్వర్క్ సూత్రధారుల వైపు పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.























