COP26 Update: 'మీ అబద్ధాలు వినీవినీ విసిగిపోయాం..' మోదీ, బైడెన్ ముందే ధైర్యంగా బాలిక ప్రసంగం
అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్26)లో భారత్కు చెందిన ఓ బాలిక చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటోంది.
![COP26 Update: 'మీ అబద్ధాలు వినీవినీ విసిగిపోయాం..' మోదీ, బైడెన్ ముందే ధైర్యంగా బాలిక ప్రసంగం Indian Teen's Powerful Glasgow COP26 Speech. PM Modi, Biden Were Present, know in details COP26 Update: 'మీ అబద్ధాలు వినీవినీ విసిగిపోయాం..' మోదీ, బైడెన్ ముందే ధైర్యంగా బాలిక ప్రసంగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/03/c57ea939f96e88ac8518716448c57618_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్కు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక గ్లాస్గో వేదికగా జరిగిన అంతర్జాతీయ వాతావారణ సదస్సులో చేసిన ప్రసంగం యావత్ ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. ఆమె మాటలకు ఆ సదస్సు మొత్తం కరతాళధ్వనులతో దద్దరిల్లింది. ఆమె పేరు వినీశా ఉమాశంకర్.
"We have every reason to be angry, but I have no time for anger"
— Sky News (@SkyNews) November 2, 2021
15-year-old Earthshot prize finalist Vinisha Umashankar says "me and my generation will live to see the consequences of our actions today, yet none of what we've discussed today seems practical".#COP26 pic.twitter.com/jFaTIFqw59
చిన్నప్పటి నుంచే..
తమిళనాడుకు చెందిన వినీశా ఉమాశంకర్.. చిన్నప్పటి నుంచి కాలుష్యం గురించి ఆలోచించేది. 12 ఏళ్ల వయసులోనే సౌరశక్తితో పనిచేసే ఐరనింగ్ బండిని రూపొందించింది. ఆ ఆవిష్కరణతో బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియమ్స్ ప్రారంభించిన 'ఎర్త్షాట్ ప్రైజ్' పోటీలకు వెళ్లి ఫైనల్ వరకు చేరింది. తాజాగా ప్రిన్స్ విలియమ్స్ ఆహ్వానం మేరకు కాప్26 సదస్సులో పాల్గొని 'క్లీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్' అనే అంశంపై ప్రసంగించింది.
ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి ప్రపంచ నేతలు హాజరయ్యారు. ప్రపంచస్థాయి నేతలు, దేశాధినేతల ముందు ధైర్యంగా మాట్లాడిన వినీశా ప్రసంగాన్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.
Also Read: WHO on Covaxin: ఎట్టకేలకు 'కొవాగ్జిన్'కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం.. అత్యవసర వినియోగానికి ఓకే
Also Read: 100% Covid Vaccine: 'వ్యాక్సినేషన్లో అలసత్వం వహిస్తే.. మరో ముప్పు తప్పదు.. జాగ్రత్త'
Also Read: Vaccine for Children: చిన్నారుల వ్యాక్సినేషన్కు సర్వం సిద్ధం.. బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్ వెయిటింగ్!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)