అన్వేషించండి

Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?

Sabarimala Darshan: కేరళ శబరిమల ఆలయం శుక్రవారం సాయంత్రం తెరుచుకుంది. మండలం - మకరవిళక్కు సీజన్‌లో భాగంగా అధికారులు భక్తులను దర్శనాలకు అనుమతించారు.

Sabarimala Ayyappa Temple Opens: మండల - మకరవిళక్కు సీజన్‌లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం (Sabarimala Temple) శుక్రవారం సాయంత్రం తెరుచుకుంది. తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఓ గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం (Travencore Devasthanam Board) బోర్డు వెల్లడించింది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఈ సీజన్‌లో దర్శన సమయాలను 18 గంటలకు పొడిగించినట్లు తెలిపింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్‌కుమార్ నంబూథిరి తెరవనున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, మండల సీజన్ అధికారికంగా శనివారం ప్రారంభమై డిసెంబర్ 26 వరకూ కొనసాగుతుంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి మొదలయ్యే మకరవిళక్కు.. జనవరి 20, 2025 వరకూ కొనసాగుతుంది. ప్రతీ రోజూ 18 గంటల పాటు దర్శనాలకు అనుమతిస్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ.. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ భక్తుల దర్శనాలు కొనసాగుతాయి. రోజుకు గరిష్టంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. వర్చువల్ బుకింగ్ సమయంలోనే.. యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని సైతం ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటవీ మార్గంలో అన్నీ సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

రూ.5 లక్షల ఉచిత బీమా

మరోవైపు, స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఉచిత బీమా కల్పించనున్నట్లు ఇప్పటికే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ప్రమాదవశాత్తు మరణించే భక్తులను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను చేస్తామని తెలిపింది. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Hyderabad Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Embed widget