అన్వేషించండి

మణిపూర్‌లో సర్జికల్ స్ట్రైక్‌లు చేయండి, బీజేపీ మిత్రపక్ష నేత సంచలన వ్యాఖ్యలు

Manipur Violence: మణిపూర్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలని ఎన్‌పీపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Manipur Violence: 

ఎన్‌పీపీ నేత సంచలన వ్యాఖ్యలు..

మణిపూర్ సమస్యకి పరిష్కారం చూపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో మణిపూర్‌లో బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) నేత ఎమ్ రామేశ్వర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులు,మిలిటెంట్స్‌పై సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు. మూడు నెలులగా మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అల్లర్లలో 150 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పార్లమెంట్‌లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై చర్చించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రధాని మోదీ మణిపూర్‌పై మాట్లాడారు. త్వరలోనే శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే...అంత సుదీర్ఘ ప్రసంగంలో మణిపూర్‌ గురించి మాట్లాడింది కాసేపే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్య ఎలా పరిష్కరిస్తారో చెప్పకుండా విపక్షాలపై జోక్‌లు వేశారని రాహుల్ గాంధీ కూడా విమర్శించారు. ఈ క్రమంలోనే NPP నేత చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

"మణిపూర్‌ సరిహద్దు ప్రాంతంలో కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్‌లు అక్రమంగా చొచ్చుకుని వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యల్ని బట్టి ఇదే అర్థమవుతోంది. బయట నుంచి ఎవరో ఈ హింసకు ఆజ్యం పోస్తున్నారని నేను మొదటి నుంచి చెబుతున్నాను. జాతీయ భద్రత విషయంలో రాజీ పడొద్దు. కేవలం మణిపూర్‌నే కాదు. మొత్తం దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరముంది. సర్జికల్ స్ట్రైక్ లాంటి దాడులు చేసి మరీ హింసను అదుపులోకి తీసుకురావాలి"

- ఎమ్‌ రామేశ్వర్ సింగ్, NPP నేత

విదేశీ సంస్థల జోక్యం..

అమిత్‌షాతో ఇప్పటికే ఈ విషయమై చర్చించినట్టు వెల్లడించారు రామేశ్వర్ సింగ్. కుకీ మిలిటెంట్స్‌ క్యాంప్‌లలోనే ఉంటున్నారని, ఆయుధాలు స్వాధీనం చేసుకుని హింసకు పాల్పడుతున్నారని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. కచ్చితంగా ఈ హింసాకాండలో విదేశీ సంస్థల జోక్యం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 

"కుకీ మిలిటెంట్స్‌ క్యాంప్‌లలోనే మకాం వేస్తున్నారని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇదే విషయాన్ని అమిత్‌షాతో చెప్పాను. కావాలనే ఇలాంటివి చెప్పి మభ్యపెడుతున్నారు. రాష్ట్రాన్ని తగలబెడుతున్న ఈ మంటలు ఎక్కడ పుట్టాయో అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి ఇదంతా చేస్తున్నారో తెలియట్లేదు"

-  ఎమ్‌ రామేశ్వర్ సింగ్, NPP నేత

అక్రమ వలసలు..

గత నెల మణిపూర్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మయన్మార్ నుంచి మణిపూర్‌కి అక్రమంగా వలస వచ్చిన వాళ్ల బయోమెట్రిక్ డేటాను సేకరించింది. జులైలోనే దాదాపు 700 మంది అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చినట్టు నిర్ధరించింది. హోంశాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం...718 మంది అక్రమ వలసదారులున్నారు. వీరిలో 301 మంది పిల్లలే. జులై 22,23 తేదీల్లో వీళ్లు రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చినట్టు తేలింది. మణిపూర్‌కి ఆర్మీని పంపితే రెండ్రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమత బిశ్వ శర్మ స్పందించారు. అక్కడ పరిస్థితులు చక్కదిద్దడం సైన్యం వల్ల కాదని తేల్చి చెప్పారు. బులెట్‌లతో కాకుండా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. ఆర్మీ వెళ్తే ఆ రాష్ట్రంలో హింస తగ్గిపోతుందని రాహుల్ చేసిన కామెంట్స్‌ని ఖండించారు. "అక్కడి ప్రజలను కాల్చిపారేయని చెబుతున్నారా" అంటూ మండి పడ్డారు. 

Also Read: నాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు, ఓటు వేయమని వాళ్లను అడగను - అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jana Nayagan : విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ 'జన నాయకుడు' మూవీకి బిగ్ రిలీఫ్ - విడుదలకు లైన్ క్లియర్... రిలీజ్ ఎప్పుడంటే?
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మద్య తీవ్రమైన వార్‌!
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
Google Chrome Hidden Tools : Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Chrome వాడుతున్నారా? ఈ హిడెన్ ఫీచర్‌లు మీకు తెలుసా?
Andhra Pradesh Weather Update: సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
సంక్రాంతి వేళ ఏపీపై డబుల్ అటాక్; తుపాను, చలితో టెన్షన్ 
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
The Raja Saab OTT : 'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
'ది రాజా సాబ్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్! - ఆ ఛానల్‌లో చూడొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Embed widget