అన్వేషించండి

Bhairav ​​Commandos News : భారత సైన్యంలో కొత్తగా భైరవ్ కమాండోల దళం, ఇది ఏం చేస్తుంది? ఎలా పని చేస్తోంది?

Bhairav ​​Commandos News : భారత సైన్యంలో బైరవ్ కమాండోలు చేరారు. ఆశ్చర్యకర దాడులకు పేరుగాంచారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో తొలిసారిగా ప్రదర్శన.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

 Bhairav ​​Commandos News : సరిహద్దుల్లోకి చొరబడే వారిని మట్టుబెట్టడానికైనా లేదా సరిహద్దు అవతల ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికైనా, భారతదేశపు కొత్త భైరవ్‌ సైన్యం ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. భారత సైన్యంలో భైరవ్‌ కమాండోల కొత్త బెటాలియన్ ఏర్పడింది, ఇది శత్రువుతో పోరాడటానికి సిద్ధంగా ఉంది.

రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం (అక్టోబర్ 24, 2025)న పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న జైసల్మేర్లో మొదటి భైరవ్‌ బెటాలియన్ కమాండోలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం జైసల్మేర్లో మూడు రోజుల (అక్టోబర్ 23-25) ఆర్మీ కమాండర్ల సమావేశం జరుగుతోంది. రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఈ సైనిక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

చైనా-పాకిస్తాన్ సరిహద్దులో భైరవ బెటాలియన్ మోహరింపు

ఈ సందర్భంగా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న థార్ ఎడారిలో సైన్యం తన శక్తిని ప్రదర్శించింది. మొదటిసారిగా భైరవ్‌ బెటాలియన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. సమాచారం ప్రకారం, ఈ నెలాఖరు నాటికి ఐదు భైరవ్‌ బెటాలియన్లు సిద్ధమవుతాయి. ఈ బెటాలియన్లను చైనా, పాకిస్తాన్ సరిహద్దులు, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించారు.

భైరవ్‌ బెటాలియన్, ఇన్ఫాంట్రీ బెటాలియన్లు, స్పెషల్ ఫోర్సెస్ (పారా-ఎస్ఎఫ్) మధ్య వారధిగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా, సైన్యాన్ని మరింత పటిష్టంగా స్ట్రాంగ్‌గా  మార్చే ఉద్దేశ్యంతో భైరవ్‌ బెటాలియన్లను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఒక బెటాలియన్లో దాదాపు 250 మంది కమాండోలు

సైన్యంలో మొత్తం 25 బెటాలియన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి బెటాలియన్లో దాదాపు 250 మంది కమాండోలు ఉంటారు. ఈ కమాండోలకు ప్రత్యేక శిక్షణతోపాటు ఆధునిక ఆయుధాలను కూడా అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ తరువాత, భైరవ్‌ బెటాలియన్లను ఏర్పాటు చేశారు, ఇది సైన్యం ఇన్ఫాంట్రీ బెటాలియన్లకు బలాన్ని చేకూరుస్తుంది.

ఈ భైరవ బెటాలియన్లు ఏర్పడిన తరువాత, పారా-ఎస్ఎఫ్ కమాండోలను ప్రత్యేక మిషన్ల కోసం ఉపయోగిస్తారు. ప్రస్తుతం, జమ్మూ కాశ్మీర్ నుంచి ఈశాన్య ప్రాంతం వరకు ఉగ్రవాదులతో పోరాడటానికి, శత్రువుల వెనుక మిషన్ల కోసం పారా-ఎస్ఎఫ్ను ఉపయోగిస్తున్నారు. ఈ పారా-ఎస్ఎఫ్ కమాండోలు ఆకాశం నుంచి పారా-జంప్ చేయడంతో పాటు భారీ ఆయుధాలను కలిగి ఉంటారు.

ఆశ్చర్యకరమైన దాడుల కోసం మోహరించిన భైరవ బెటాలియన్    

భైరవ్‌ కమాండోలను లీన్ అండ్ థిన్‌గా తయారు చేశారు, అంటే చిన్న ఆయుధాలతో నేలపై పోరాడటానికి సిద్ధం చేశారు. భైరవ్‌ బెటాలియన్‌ను శత్రువులపై ఆశ్చర్యకరమైన దాడులు చేయడానికి, సున్నితమైన సరిహద్దుల్లో గస్తీ నిర్వహించడానికి కూడా ఉపయోగిస్తారు. భారత సైన్యంలో ప్రస్తుతం 350 ఇన్ఫాంట్రీ బెటాలియన్లు ఉన్నాయి.

ప్రతి బెటాలియన్లో ఇప్పటికే ఒక పటిష్టమైన ప్లాటూన్ ఉంది, ఇందులో 15-20 మంది కమాండోలు ఉన్నారు, కాని భైరవ బెటాలియన్ ఈ కమాండోల కంటే మరింత ప్రమాదకరంగా ఉండబోతున్నారు. భైరవ్‌ బెటాలియన్ కమాండోలు ఇన్ఫాంట్రీతో పాటు సైన్యం ఫిరంగి దళం, సిగ్నల్, ఎయిర్ డిఫెన్స్ వంటి యూనిట్లలో కూడా చేరవచ్చు.                  

Frequently Asked Questions

భారత సైన్యంలో కొత్తగా ఏర్పడిన భైరవ్ కమాండో బెటాలియన్ల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

సరిహద్దుల్లోకి చొరబడే వారిని అడ్డుకోవడం లేదా సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడం వీరి ముఖ్య ఉద్దేశ్యం.

భైరవ్ బెటాలియన్లను ఎక్కడ మోహరించనున్నారు?

ఈ బెటాలియన్లను చైనా, పాకిస్తాన్ సరిహద్దులు, జమ్మూ కాశ్మీర్, మరియు ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించనున్నారు.

ఒక భైరవ్ బెటాలియన్లో ఎంత మంది కమాండోలు ఉంటారు?

ప్రతి భైరవ్ బెటాలియన్లో దాదాపు 250 మంది కమాండోలు ఉంటారు. మొత్తం 25 బెటాలియన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

భైరవ్ కమాండోల ప్రత్యేకతలు ఏమిటి?

వీరిని ఆశ్చర్యకరమైన దాడులు చేయడానికి, సున్నితమైన సరిహద్దుల్లో గస్తీ నిర్వహించడానికి, మరియు నేలపై చిన్న ఆయుధాలతో పోరాడటానికి సిద్ధం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Advertisement

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget