అన్వేషించండి

PM Modi About Olympics: 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సన్నద్ధమవుతోంది: ప్రధాని మోదీ

2036 Olympics in India | 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ వారణాసిలో ఆదివారం ప్రారంభమైంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణపై ప్రధాని మోదీ ప్రకటన చేశారు.

India likely to Host 2036 olympics | వారణాసి: 2026 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారతదేశం పూర్తిగా సన్నద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం నాడు (జనవరి 4న) ఈ విషయాన్ని ప్రకటించారు. గత పదకొండున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశంలో క్రీడా రంగంలో సమూల మార్పులు చేసి, 20కి పైగా ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లను నిర్వహించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. భారత్ 'పూర్తి సన్నద్ధతతో' 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోందని ఆయన అన్నారు.

20కి పైగా అంతర్జాతీయ టోర్నమెంట్స్ నిర్వహించిన భారత్

వారణాసిలో నేడు ప్రారంభమైన 72వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ‘గత దశాబ్దంలో ఫిఫా అండర్-17 ప్రపంచ కప్, హాకీ ప్రపంచ కప్ సహా 20కి పైగా ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లను దేశంలోని పలు నగరాల్లో నిర్వహించామని తెలిపారు. 2030 కామన్వెల్త్ క్రీడలు కూడా భారత్‌లోనే జరగనున్నాయి. భారత్ పూర్తి సన్నద్ధతతో 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని చూస్తోంది. ఎక్కువ మంది క్రీడాకారులకు ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కల్పించడం తమ లక్ష్యమని’ చెప్పారు.

క్రీడా రంగంలో సమూల మార్పులు

దేశం ప్రస్తుతం 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్' పై ప్రయాణిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి రంగం, అభివృద్ధి నిర్వచనం ఈ 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్' తో ముడిపడి ఉందని, క్రీడలు కూడా అందులో ఒకటని అన్నారు. ‘క్రీడా రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టింది. నేషనల్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్, ఖేలో ఇండియా పాలసీ 2025... వంటి నిబంధనల ద్వారా సరైన ప్రతిభకు అవకాశం లభిస్తుంది. తద్వారా క్రీడా రంగంలో పారదర్శకత పెరుగుతుంది. అలాగే దేశ యువత క్రీడలు, విద్య రెండింటిలోనూ ఒకేసారి ముందుకు సాగనున్నారు. ఒకవైపు మనం మెరుగైన మౌలిక సదుపాయాలు, నిధుల సమీకరణ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం. దాంతో పాటు యువతకు అద్భుతమైన జీవితాన్ని క్రీడల ద్వారా అందించడానికి కూడా కృషి చేస్తున్నాం’ అన్నారు.

క్రీడలపై ప్రభుత్వం, సమాజంలో చిన్న చూపు ఉండేది

ఒకప్పుడు క్రీడల పట్ల ప్రభుత్వం, సమాజంలో సైతం ఉదాసీనత ఉండేదని మోదీ అన్నారు. చాలా తక్కువ మంది యువకులు క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేవారు. గత దశాబ్దంలో క్రీడల పట్ల ప్రభుత్వం, సమాజం ఆలోచనలలో మార్పు కనిపిస్తోందని మోదీ అన్నారు. క్రీడా రంగంలో తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, ‘మేం స్కూల్ స్థాయిలో కూడా క్రీడాకారులకు ఒలింపిక్ అనుభవాన్ని అందించడానికి కృషి చేస్తున్నాం. ఖేలో ఇండియా ప్రచారం వల్ల వందలాది మంది యువకులకు జాతీయ స్థాయిలో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల కిందట ఎంపీ క్రీడా మహోత్సవం జరిగింది. ఇందులో కూడా దాదాపు కోటి మంది యువకులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపీ క్రీడా మహోత్సవం సందర్భంగా కాశీకి చెందిన దాదాపు 3 లక్షల మంది యువకులు మైదానంలో సత్తా చాటారు.

వారణాసిలో వివిధ క్రీడలకు సంబంధించిన స్టేడియాలు నిర్మిస్తున్నాం. కొత్త క్రీడా సముదాయంలో చుట్టుపక్కల జిల్లాల క్రీడాకారులకు కూడా శిక్షణ పొందే అవకాశం లభిస్తోంది. మెగా టోర్నీలకు వారణాసి సిద్ధమవుతుండటంతో నాకు సంతోషంగా ఉంది. వాలీబాల్ జాతీయ పోటీల ద్వారా దేశ క్రీడల్లో నగరం స్థానం సంపాదించుకుంటుందని’ ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
వైసీపీ నేతలపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ గూండాలు: అంబటి రాంబాబు
How to Prove Indian Citizenship: ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
Ayodhya Ram Mandir Donation Scam: అయోధ్య ఆలయంలో స్కామ్‌కు కారణం కింది స్థాయి వ్యక్తులేనా ? - పెద్దలకు తెలియకుండా జరుగుతుందా?
అయోధ్య ఆలయంలో స్కామ్‌కు కారణం కింది స్థాయి వ్యక్తులేనా ? - పెద్దలకు తెలియకుండా జరుగుతుందా?

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
K Bhagyaraj : భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
భాగ్యరాజ్ చివరి వీడియో - రెండు రోజుల క్రితం పెళ్లి వేడుకలో సందడి... ఫ్యాన్స్ ఎమోషనల్
పల్సర్ N250 నుంచి KTM 250 డ్యూక్ వరకు - 200cc-250cc రేంజ్‌లో 5 బెస్ట్ బైక్‌లు, ధరలు ఎంతంటే?
ఈ ఏడాది యువతను ఊపేస్తున్న 200cc-250cc బైక్‌లు, వాటి రేట్లు
YSRCP Leaders: అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
అమరావతిలో పర్యటనకు వెళ్లిన వైసీపీ లీడర్లు! కోడిగుడ్లతో దాడి చేసిన రాజధాని రైతులు!
Crime Thriller OTT : ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఏడాది తర్వాత ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget