అన్వేషించండి

India EU FTA: భారత్- ఈయూ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొన్న ఈయూ ప్రెసిడెంట్

భారత్- EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మంగళవారం కుదిరింది. ఇది రెండు బిలియన్ల ప్రజలకు స్వేచ్ఛా వాణిజ్య అవకాశాలు సృష్టిస్తుంది. సంతకాలు చేయడానికి 6 నెలలు పడుతుంది.

న్యూఢిల్లీ: భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదరింది. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముగిసినట్లు మంగళవారం నాడు ప్రకటించారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ ఒప్పందాన్ని అన్ని వాణిజ్య ఒప్పందాలకు తల్లి (Mother Of All Trade Deals) అని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమ్మిట్ కోసం EU అగ్ర నేతలతో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో చారిత్రాత్మక ఒప్పందంపై ప్రకటన 

ఈయూ ప్రెడిసెంట్ వాన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాతో భారత ప్రధాని మోదీ చర్చలు జరిపారు. రెండు పక్షాలు ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి వేళ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నించాయి. వాణిజ్య ఒప్పందం అనంతరం ఈయూ ప్రెసిడెంట్ వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ.. “యూరప్, భారతదేశం ఈ రోజు చరిత్ర సృష్టించాయి. మేం అన్ని ఒప్పందాలకు తల్లిగా ఈ వాణిజ్య ఒప్పందాన్ని భావిస్తున్నాం. మేం 2 బిలియన్ల ప్రజల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అవకాశం కల్పించాం.  రెండు వైపులా ప్రయోజనం పొందడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రమే. మేం మా వ్యూహాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నాం”అని ఆమె అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ ఒప్పందం కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని, ప్రపంచ సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి ఒక ప్రధాన అడుగు అన్నారు. భారత విద్యార్థులు, కార్మికులకు కొత్త అవకాశాలను తెరుస్తుందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుతుందని తెలిపారు. భారత రక్షణ కంపెనీలకు ఈయూ సహకారం లభిస్తుందని, సరికొత్త ఆవిష్కరణలు వస్తాయని దీమా వ్యక్తం చేశారు.

EU ఒక ప్రధాన వాణిజ్య భాగస్వామి
భారత్, ఈయూ ట్రేడ్ డీల్ ద్వారా 27 దేశాలతో ఈ FTA రైతులు, చిన్న పరిశ్రమలు, MSME లకు యూరోపియన్ మార్కెట్‌కు అవకాశాలు పెరుగుతాయి. యూరోపియన్ యూనియన్ భారతదేశానికి  ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. ఎందుకంటే మొత్తం వాణిజ్యంలో సుమారు 17 శాతం వాటాను కలిగి ఉంది. వస్తువుల ఎగుమతి, దిగుమతితో పాటు , రెండు వైపులా సేవల రంగంలో కూడా బలమైన భాగస్వామ్యం ఉంది. 2024 లో భారత్- EU సేవలలో వాణిజ్యం $83.10 బిలియన్లకు చేరుకుంది. వీటిలో IT, వ్యాపార సేవలు, టెలికమ్యూనికేషన్లు కీలకంగా మారాయి.

సోమవారం కర్తవ్య పథ్ లో జరిగిన భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇద్దరు EU నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారతదేశం, EU FTA చర్చల ముగింపును అధికారికంగా ప్రకటిస్తూ ప్రస్తుతం తాత్కాలిక ఒప్పంద పత్రంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై రెండువైపులా చట్టపరమైన పరిశీలన జరగనున్నందున, అధికారికంగా సంతకం చేయడానికి కనీసం 6 నెలలు పట్టవచ్చని అధికారులు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదట 2007 లో ప్రారంభమయ్యాయి.  విభేదాల కారణంగా 2013 లో నిలిపివేశారు. జూన్ 2022 లో చర్చలు పునరుద్ధరించారు.

వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక సహకారం

EU భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు USD 136 బిలియన్లుగా ఉంది. ఇందులో భారత్ ఎగుమతులు USD 76 బిలియన్లు కాగా, దిగుమతులు USD 60 బిలియన్లుగా ఉన్నాయి. వాణిజ్యంతో పాటు, ఈ సమ్మిట్ రక్షణ, భద్రతా సహకారం, వాతావరణ చర్య, టెక్నాలజీ అంశాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. FTA తో పాటు, రెండు పక్షాలు రక్షణ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం, విస్తృత వ్యూహాత్మక ఎజెండాను ఆవిష్కరించనున్నాయి. 

రక్షణ, భద్రతా ఒప్పందాలు

భారతదేశం, EU 2004 నుండి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ప్రతిపాదిత భద్రత, రక్షణ భాగస్వామ్యం (SDP) రక్షణ, భద్రతలో సహకారాన్ని మరింత పెంచుతుందని,  EU SAFE (యూరప్ కోసం భద్రతా చర్య) కార్యక్రమం కింద భారత కంపెనీలకు అవకాశాలను తెరుస్తుందని అధికారులు తెలిపారు. SAFE చొరవ అనేది EU సభ్య దేశాలలో రక్షణ సన్నద్ధతను పెంచడానికి చేపట్టిన యూరో 150 బిలియన్ల ఆర్థిక సాధనం.

సమాచార ఒప్పందం భద్రత (SOIA) కోసం చర్చలను ప్రారంభించాలని కూడా 2 పక్షాలు భావిస్తున్నాయి. ఇది పారిశ్రామిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత కార్మికుల యూరప్‌కు వలసలను సులభతరం చేసే ఒక ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. ఇది EU సభ్య దేశాల ద్వారా మెరుగైన కార్యక్రమాలకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది.

ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఇప్పటికే భారతదేశంతో వలసలు, ఇతర అంశాలపై భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్దం సహా ప్రధాన ప్రపంచ సవాళ్లపై నేతలు అభిప్రాయాలను షేర్ చేసుకోనున్నారు. పలు ఇతర రంగాలలో కూడా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: హర్మూజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. 92,612 టన్నుల ఎల్పీజీ సామర్థ్యం
హర్మూజ్ దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. 92,612 టన్నుల ఎల్పీజీ సామర్థ్యం
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
TVK Election Manifesto 2026: జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Advertisement

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS MI: కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
కేకేఆర్ భారీ స్కోరు.. ర‌హానే, ర‌ఘువంశీ ఫిఫ్టీలు, రాణించిన శార్దూల్ 
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget