అన్వేషించండి

Ethanol Blending India: ఇథనాల్‌తో జల సంక్షోభం వస్తుందా? ఒక లీటర్ కోసం ఎంత నీరు ఖర్చు అవుతుంది? 

Ethanol Blending India: భారత్‌ ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి ఇథనాల్‌ బ్లెండింగ్‌ వేగవంతం చేసింది. అయితే ఇథనాల్ ఉత్పత్తిపై చాలా అనుమానాలు ఉన్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్ ఇంధన అవసరాల కోసం ముడి చమురు దిగుమతి తగ్గింపు ప్రయత్నిస్తోంది.
  • ఇథనాల్ ఉత్పత్తికి వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలపై ఆధారపడుతుంది.
  • ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి వేల లీటర్ల నీరు అవసరమవుతుంది.
  • ఇథనాల్ ఉత్పత్తి నీటి కొరతను, పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతుంది.

Ethanol Blending India: భారత్‌ తన ఇంధన అవసరాల కోసం విదేశీ ముడి చమురుపై ఎక్కువ ఆధారపడి ఉంది. దీనిని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మొక్కల ఆధారిత ఇథనాల్ కలపడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ హరిత ఇంధన ప్రయాణంలో భారత్‌ ఒక భారీ మూల్యాన్ని చెల్లించబోతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

వరి, చెరకు, మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీ

ఇథనాల్ ఉత్పత్తికి భారత్ ప్రధానంగా వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఈ పంటల అత్యధికంగా నీటిని వినియోగించుకునేవి కావడమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతుందని అంటున్నారు. 

లీటర్ ఇథనాల్ తయారీకి 0,790 లీటర్లు నీరు ఖర్చు 

ఒక లీటర్ ఇథనాల్‌ను వరి నుంచి  ఉత్పత్తి చేయడానికి దాదాపు 10,790 లీటర్లు నీరు అవసమవుతుంది. ఇందులో పంట సాగుకు అవసరమయ్యే సాగునీరు కూడా కలిసి ఉంది. ఒక కేజీ వరి పండించడానికి మూడు వేల నుంచి ఐదు వేల లీటర్ల నీరు అవసరమైతే, ఒక లీటరు ఇథనాల్‌ తయారు చేయడానికి సుమారు 2.5 నుంచి 3కేజీల వరి అవసరం అవుతుంది. మొక్కజొన్న నుంచి ఒక లీటరు ఇథనాల్‌ ఉత్పత్తికి దాదాపు 4, 670 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. చెరకు నుంచి ఒక లీటర్ ఇథనాల్‌ పొందడానికి 3,630 లీటర్ల నీరు అవసరం అవుతుంది. 

ఇథనాల్‌ ఉత్పత్తికి ప్రయత్నాలు

ప్రభుత్వం తన ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాలను సాధించడానికి ఆహార ధాన్యాల కేటాయింపును భారీగా పెంచుతోంది. 2024-25లో 52 లక్షల టన్నుల బియ్యాన్ని ఇథనాల్‌ ఉత్పత్తికి కేటాయించగా, 2025-26 నాటికి ఈ లక్ష్యాన్ని 90 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించింది. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంలో నూకల వాటాను 25 శాతం నుంచి పది శాతానికి తగ్గించి, మిగిలిన నిల్వలను నేరుగా డిస్టిలరీలకు తరలించడం ద్వారా ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో నీటి కొరత 

ఈ ఇథనాల్‌ విప్లవం దేశంలో ఇప్పటికే ఉన్న నీటి ఎద్దడిని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. నీతి అయోగ్‌ నివేదిక ప్రకారం 2039 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. భారత్‌ ప్రస్తుతం 1822 కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్లాంట్లు ఎక్కువగా మహారాష్ట్ర(396కోట్ల), ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. విచిత్రమేంటంటే ఈ ప్రాంతాలు ఇప్పటికే  తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. 

కేవలం నీటి వినియోగమే కాకుండా, ఇథనాల్ మిల్లుల నుంచి వెలువడే వ్యర్థాలు కూడా పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. వీటిని సరిగ్గా శుద్ధి చేయకపోతే ఉపరితల జలాలు, భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక రైతు ఒక కేజీ వి పండిస్తూ 3000 లీటర్ల నీటిని వాడుతుంటే, వనరుల వృథా అంటున్న వ్యక్తులు అదే పంటను ఉపయోగించి ఇండస్ట్రీ ఒక లీటరు ఇథనాల్‌ కోసం  పదివేల లీటర్ల నీటిని వాడుతుంటే, దానిని గ్రీన్ ఎనర్జీ అని పిలుస్తున్నారని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంధన భద్రత కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమే అయినా అవి నీటి భద్రతను పణంగా పెట్టి జరగకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే వరి, చెరకు వంటి పంటల కంటే తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో వాహనాలు నడపడానికి ఇంధనం ఉండొచ్చు కానీ మనుషులు తాగడానికి నీరు ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Frequently Asked Questions

భారతదేశం ఇథనాల్ ఉత్పత్తికి ఏ పంటలపై ఎక్కువగా ఆధారపడుతోంది?

భారతదేశం ఇథనాల్ ఉత్పత్తికి ప్రధానంగా వరి, చెరకు, మొక్కజొన్న వంటి పంటలపై ఆధారపడుతోంది. ఈ పంటలకు అధిక మొత్తంలో నీరు అవసరం అవుతుంది.

ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి ఎంత నీరు అవసరం అవుతుంది?

వరి నుంచి ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి సుమారు 10,790 లీటర్ల నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నకు 4,670 లీటర్లు, చెరకుకు 3,630 లీటర్లు నీరు అవసరం.

ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

ప్రభుత్వం తన ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాలను సాధించడానికి ఆహార ధాన్యాల కేటాయింపును పెంచుతోంది. రేషన్ బియ్యంలో నూకల వాటాను తగ్గించి, మిగిలిన నిల్వలను డిస్టిలరీలకు తరలించాలని యోచిస్తోంది.

ఇథనాల్ ఉత్పత్తి వల్ల నీటి కొరతపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ఇథనాల్ ఉత్పత్తికి అధిక నీటి వినియోగం దేశంలో ఇప్పటికే ఉన్న నీటి ఎద్దడిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. 2039 నాటికి 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cockroach Janta Party: దేశానికి 'బొద్దింక' ముప్పు..? 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ అకౌంట్ బ్యాన్.. అసలేం జరిగింది?
Cockroach Janta Party: దేశానికి 'బొద్దింక' ముప్పు..? 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ అకౌంట్ బ్యాన్.. అసలేం జరిగింది?
Supreme Court on Reservation: తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
Kailash Mansarovar Yatra : కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్నారా? అవసరమైన డాక్యుమెంట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్నారా? అవసరమైన డాక్యుమెంట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Nara Lokesh vs P Chidambaram: చిదంబరం వర్సెస్ నారా లోకేష్ - నియోజకవర్గాల పునర్విభజనపై ట్విట్టర్ యుద్ధం.. దక్షిణాదికి మేలు ఎవరి వల్ల?
చిదంబరం వర్సెస్ నారా లోకేష్ - నియోజకవర్గాల పునర్విభజనపై ట్విట్టర్ యుద్ధం.. దక్షిణాదికి మేలు ఎవరి వల్ల?
Advertisement

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akunuri Murali Resignation: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా - ప్రభుత్వంపై అసంతృప్తే కారణమా?
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా - ప్రభుత్వంపై అసంతృప్తే కారణమా?
Bandi Bhagirath Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
Cockroach Janta Party: దేశానికి 'బొద్దింక' ముప్పు..? 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ అకౌంట్ బ్యాన్.. అసలేం జరిగింది?
Cockroach Janta Party: దేశానికి 'బొద్దింక' ముప్పు..? 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ అకౌంట్ బ్యాన్.. అసలేం జరిగింది?
Vijayawada Patamata Thar Incident: అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !
అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !
Satya Dev Samavarthi : సమవర్తిగా సత్యదేవ్ - వెర్సటైల్ హీరో వైల్డ్ యాక్షన్ మోడ్
సమవర్తిగా సత్యదేవ్ - వెర్సటైల్ హీరో వైల్డ్ యాక్షన్ మోడ్
Miheeka Daggubati: రానా భార్య మిహీకా దగ్గుబాటి లేటెస్ట్ స్టైలిష్ ఫోటోస్
రానా భార్య మిహీకా దగ్గుబాటి లేటెస్ట్ స్టైలిష్ ఫోటోస్
Nalagandla Land Rates: అప్పట్లో వద్దు అనుకున్నారు... ఇప్పుడు కొనలేకపోతున్నారు! హైదరాబాద్‌ నలగండ్లలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు
అప్పట్లో వద్దు అనుకున్నారు... ఇప్పుడు కొనలేకపోతున్నారు! హైదరాబాద్‌ నలగండ్లలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు
కడప నుంచి గుజరాత్‌కు విద్యుత్ సరఫరా! లోకేష్ స్టార్ట్ చేసిన పవర్‌ఫుల్ ప్రాజెక్టు!
కడప నుంచి గుజరాత్‌కు విద్యుత్ సరఫరా! లోకేష్ స్టార్ట్ చేసిన పవర్‌ఫుల్ ప్రాజెక్టు!
Embed widget