Brahmos Supersonic Cruise Missile System:ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్పై కేంద్రం ఫోకస్- అప్డేట్ చేయడంలో భారత్ బిజీ
Brahmos Supersonic Cruise Missile System: భారతదేశం బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసింది. మధ్యప్రాచ్య దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.

Brahmos Supersonic Cruise Missile System: భారతదేశ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థ మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అజర్బైజాన్కు పర్యటనకు వెళ్ళిన పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని, దాని వల్ల అక్కడ భారీ నష్టం సంభవించిందని అన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో, పాకిస్థాన్లోకి దూసుకెళ్లిన బ్రహ్మోస్ క్షిపణులను చైనా వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. భారత క్షిపణి వ్యవస్థను ఎదుర్కోలేకపోవడంతో చైనా వైమానిక రక్షణ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే, బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్ వైమానిక రక్షణలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి కాదు. 2022లో సరిహద్దు దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు కూడా బ్రహ్మోస్ తన సామర్థ్యం, శక్తిని చూపించింది. బ్రహ్మోస్ విశ్వవ్యాప్తిని విస్తరించడానికి భారతదేశం వేగంగా ముందుకు సాగుతోంది.
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థపై 5 ముఖ్యమైన ప్రిపరేషన్స్
1. 800 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ క్షిపణి విస్తరించిన-శ్రేణి వెర్షన్ను వేగంగా ఉత్పత్తి చేస్తున్నారు.
2. నీటిపై పని చేసే వెర్షన్ను త్వరలోనే మళ్ళీ పరీక్షించనున్నార. భారతదేశ P75I కార్యక్రమం ద్వారా మరోసారి సత్తా పరీక్షించనున్నారు.
3. రాఫెల్, ఇలాంటి ఇతర ఫైటర్ జెట్ల కోసం ఒక తేలికైన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు.
4. అంతేకాకుండా, హైపర్సోనిక్ బ్రహ్మోస్ పై కూడా వర్క్ నడుస్తోంది, ఇది వేగం, మనుగడ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
5. భారతదేశం ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను ఎగుమతి చేసింది. అంతేకాకుండా, వియత్నాం, మధ్యప్రాచ్య దేశాలు సహా దక్షిణాసియా దేశాలు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలనే చూస్తున్నాయి.
సైనిక, సాంకేతిక స్వావలంబనకు శక్తివంతమైన ప్రదర్శనగా, భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. ఈ బహుళ డొమైన్ ఆపరేషన్ సరిహద్దు వెంబడి ఉగ్రవాద నెట్వర్క్ను నిర్వీర్యం చేసింది. "మేక్ ఇన్ ఇండియా" "ఆత్మనిర్భర్ భారత్" అనే సిద్ధాంతాల కింద అభివృద్ధి చేసిన భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాల కార్యాచరణ డెమోనిస్ట్రేషన్కు ప్లాట్ఫామ్గా గుర్తించింది.
"ఆకాశ్ SAM ,ఆకాశ్తీర్ వ్యవస్థతో సహా భారతదేశం స్వదేశీంగా అభివృద్ధి చేసిన వైమానిక రక్షణ వ్యవస్థను మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్కు చెందిన జాన్ స్పెన్సర్ నిస్సందేహంగా సైనిక విజయంగా ప్రశంసించారు."
2014లో దేశీయ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించే మేక్ ఇన్ ఇండియా ప్రారంభంతో భారతదేశంలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. గల్వాన్ ఘర్షణ, కరోనా మహమ్మారి తర్వాత 2020లో సెకండ్ జనరేషన్ ప్రారంభమైంది, ఆత్మనిర్భర్ భారత్ జాతీయ భద్రతా సిద్ధాంతంగా పరిణామం చెందింది. 2025 నాటికి, రక్షణ సేకరణలో స్వదేశీ కంటెంట్ 30% నుంచి 65%కి పెరిగింది. 2030 నాటికి 90% లక్ష్యంగా పెట్టుకుంది.
ఆపరేషన్ సిందూర్ ఈ మార్పును ధృవీకరించింది. భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యవస్థల సూట్ను మోహరించింది: బ్రహ్మోస్ క్షిపణులు కఠినమైన లక్ష్యాలను ఛేదించాయి. ఆకాష్ SAM , ఆకాష్టీర్ C2 వ్యవస్థ AI-ఆధారిత సమన్వయంతో వాయు బెదిరింపులను తటస్థీకరించాయి.రుద్రం క్షిపణులు శత్రు రాడార్లను సైలెంట్ చేశాయి.




















