అన్వేషించండి

Haryana Stubble Management: మద్దతు ధర ఇచ్చి మరీ గడ్డి కొంటారట, హరియాణా ప్రభుత్వం నిర్ణయం!

Haryana Stubble Management: రైతుల నుంచి గడ్డిని కొనుగోలు చేయాలని హరియాణా ప్రభుత్వం భావిస్తోంది.

Haryana Stubble Management: 

నగదు ప్రోత్సాహకాలు కూడా..

పంజాబ్, హరియాణాలో రైతులు "గడ్డి కాల్చడం" వల్ల చుట్టు పక్కల రాష్ట్రాల్లో కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీలో ప్రజలు గాలి పీల్చుకోటానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ సమస్య తీవ్రంగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి స్థాయిలో సత్ఫలితాలు రావటంలేదు. సబ్సిడీ కింద రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంట పొలాల్లో నుంచి గడ్డిని తొలగించే మెషీన్లను రాష్ట్రాలకు అందిస్తోంది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిని వినియోగిస్తున్నాయి. ఈ చర్యలు సరిపోవని భావించిన హరియాణా ప్రభుత్వం...గడ్డికి కనీస మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. హరియాణా వ్యవసాయ మంత్రి జేపీ దలాల్ ఈ మేరకు
ఓ ప్రకటన కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి గడ్డిని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే కమిటీని నియమించిన ప్రభుత్వం...ఆ సభ్యుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంది. ఆ సలహాల మేరకు గడ్డిని డిస్పోస్ చేసే విధానాలపై మేధోమథనం సాగిస్తున్నారు. వీటికి ఎంత మద్దతు ధర ఇవ్వాలనేదీ నిర్ణయించనున్నారు. దీంతో పాటు రైతుల్లో అవగాహన పెంచే చర్యలనీ చేపడుతోంది హరియాణా ప్రభుత్వం. ఇప్పటికే రైతులకు 80 వేల సూపర్ సీడర్స్ యంత్రాలను అందజేసింది. పంట పొలాల్లో గడ్డి కాల్చకుండా ఉండాలని చెబుతోంది. ఈ నిబంధన పాటించిన రైతులకు హెక్టార్‌కు రూ.1000 చొప్పున నగదు ప్రోత్సాహకాన్నీ అందజేయనుంది. ఈ చర్యలతో గతేడాది కన్నా ఈ సారి హరియాణాలో "గడ్డి కాల్చుతున్న" ఘటనలు తగ్గిపోయాయి. ఇది పూర్తి స్థాయిలో నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది హరియాణా. 

పంజాబ్‌లో తీవ్రం..

పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించలేకపోతోందని భాజపా ఫైర్ అవుతోంది. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయిందని వెల్లడించారు. పంజాబ్‌లో గడ్డి కాల్చుతుండటాన్ని ప్రస్తావించారు. "పంజాబ్‌లో జరుగుతున్న దానికి పూర్తి స్థాయి బాధ్యత వహిస్తాం. మేము అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు అవుతోంది. ఇప్పటి వరకూ ఎన్నో కట్టడి చర్యలు తీసుకున్నాం. వచ్చే ఏడాది నాటికి రైతులు అలా గడ్డికాల్చకుండా జాగ్రత్తపడతాం" అని హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే పంజాబ్‌లో శాంతి భద్రతలు అదుపులోకి వస్తున్నాయని, మిగతా సమస్యలు పరిష్కరించడానికి ఇంకాస్త సమయం ఇవ్వాలని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. "కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తే కలిసి కట్టుగా ఈ కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు వీలవుతుంది" అని స్పష్టం చేశారు. కేవలం తమ వైపే వేలెత్తి చూపించటం సరికాదని వెల్లడించారు. "ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా మారటానికి మా ప్రభుత్వం మాత్రమే కారణం కాదు" అని చెప్పారు. 

Also Read: Mobile Phones Recovery : మీ సెల్ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ ఇలా చేస్తే మళ్లీ దొరికేస్తుంది?


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Embed widget