అన్వేషించండి

IndiGo crisis: ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP CM Chandrababu: ఇండిగో సమస్యను తాము పర్యవేక్షించడం లేదని చంద్రబాబు అన్నారు. టైమ్ ఇచ్చినా ఇండిగో ప్రమాణాలను పాటించలేదన్నారు.

AP CM Chandrababu Naidu responds to IndiGo crisis:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గారు  ఏపీ సెక్రటేరియట్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభంపై స్పందించారు.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్  నిబంధనలు పాటించకపోవడం వల్ల విమానాల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇది ఎయిర్‌లైన్ మేనేజ్‌మెంట్ లోపమని  స్పష్టం చేశారు.   DGCA టైమ్ ఇచ్చినా ప్రమాణాలను ఇండిగో పాటించలేదు. దీంతో విమానాలు రద్దు అయ్యాయి, ఇబ్బందులు వచ్చాయి. క్షమాపణలు చెప్పినా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని అని చంద్రబాబు  వ్యాఖ్యానించారు.  నా హెలికాప్టర్ కూడా నిబంధనల మేరకు కొన్ని గంటలే ప్రయాణం చేస్తుందని గుర్తు  చేశారు.                                

తాము ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించడం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఓ టీడీపీ నేత.. నారా లోకేష్ కూడా మానిటర్ చేస్తున్నారని చెప్పడం వివాదాస్పదమయింది. ఈ అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. తాము మానిటర్ చేయడం లేదన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని త్వరలోనే పరిష్కరిస్తుందన్నారు. కేంద్ర పరిధిలోని అంశమని..కేంద్ర మంత్రి .. కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీ అని గుర్తు చేశారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి .. రామ్మోహన్ నాయుడు టీడీపీ ఎంపీ కావడంతో.. జాతీయ మీడియాలో ఎక్కువగా టీడీపీపై విమర్శలు వస్తున్నాయి.                           
 
నవంబర్ 2025లో అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్  నిబంధనలు ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టారు.   ఈ నిబంధనల ప్రకారం పైలట్లకు 36 నుంచి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి. అయితే, ఇండిగో ఈ మార్పులకు సరైన సన్నాహాలు చేయకపోవడంతో డిసెంబర్ మొదటి వారంలో 1,500కి పైగా విమానాలు రద్దయ్యాయి. 5.86 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.  హైదరాబాద్, విజయవాడ వంటి ఏపీ ఎయిర్‌పోర్టుల్లో కూడా  ప్రయాణికులు ఆందోళన చేశారు.                                            

  
కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఇండిగోకు   రిఫండ్‌లు పూర్తి చేయాలని ఆదేశించింది. ఫేర్ క్యాప్‌లు విధించి సర్జ్ ప్రైసింగ్ నిరోధించారు. రైల్వేలు 89 స్పెషల్ ట్రైన్‌లు ఏర్పాటు చేశాయి. DGCA హై-లెవల్ ఇంక్వైరీ ప్రారంభించింది, ఫెబ్రవరి 10, 2026 నాటికి స్థిరత్వం వస్తుందని అంచనా.   ఈ సంక్షోభం విమానయాన రంగంలో పోటీ పెంచాలని, మరిన్ని ఎయిర్‌లైన్‌లు ఏర్పాటు చేయాలన్న సూచనలు వస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Rawalakot Protest PoJK: పాకిస్తాన్‌కు పీఓకే షాక్.. భారత్‌లో కలుస్తామంటూ రావాలాకోట్‌లో వేలాది మంది నిరసనకారుల ర్యాలీ!
పాకిస్తాన్‌కు పీఓకే షాక్.. భారత్‌లో కలుస్తామంటూ రావాలాకోట్‌లో వేలాది మంది నిరసనకారుల ర్యాలీ!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Embed widget