అన్వేషించండి

కొంతమంది పిల్లల్లో నత్తి ఎందుకు వస్తుంది? తల్లిదండ్రులు ఏం చేయాలి?

కొంతమంది పిల్లలు అక్షరాలు సరిగా పలకరు. వారికి నత్తి వచ్చిందని అంటారు.

నత్తి... చిన్న సమస్యలా కనిపిస్తుంది, కానీ ఆ సమస్యతో బాధపడే వారికే దానిలోని లోతు తెలుస్తుంది. ఎదుటివారు హేళన చేసినప్పుడు మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నత్తి ఉన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. నత్తి సమస్య ఉన్న పిల్లల్లో కొందరికి ఒక అక్షరం పలకకపోవచ్చు, లేదా కొన్ని అక్షరాలు సరిగా రావు. సాధారణంగా నత్తి ఎక్కువగా అబ్బాయిల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అది కూడా రెండు నుంచి ఐదు ఏళ్ల వయసులో అధికంగా ఈ నత్తి వస్తుంది. వీరిలో ఏడేళ్ల వయసు వచ్చేసరికి దానంతట అదే పోతుంది. కానీ ఒక శాతం మందిలో మాత్రం పెద్దయ్యాక కూడా నత్తి వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారికి జీవితాంతం ఆ సమస్య ఉంటుంది. అయితే చాలామందికి ఒక సందేహం ఉంది. కొంతమందిలోనే ఎందుకు నత్తి వస్తూ ఉంటుంది అని, దానికి వివరణను ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

నత్తి ఉన్న పిల్లలు అమాయకులుగా కొంతమంది భావిస్తారు. నిజానికి నత్తికి, తెలివితేటలకు ఎలాంటి సంబంధం లేదు. సాధారణ పిల్లల కన్నా కూడా నత్తి ఉన్న పిల్లలు మరింత తెలివిగా వ్యవహరిస్తారు. అయితే మాట్లాడడానికి  అవసరమైన కండరాల మధ్య సమన్వయ లోపం తక్కువగా ఉన్నా, సమన్వయం సరిగా కుదరకపోయినా... కొన్ని అక్షరాలు సరిగా పలకలేరు. అదే నత్తి. దీంతో వారు మాట్లాడుతున్నప్పుడు కాస్త గాబరా పడుతూ ఉంటారు. నత్తి జన్యుపరంగా కూడా వస్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో వారసత్వంగా నత్తి రావడం సహజం. నత్తి ఉన్నవారు జీవితంలో ఎదగలేరు అనుకోవడం మాత్రం పూర్తిగా పొరపాటే. వారిలో తెలివితేటలు పుష్కలంగా ఉండే అవకాశం ఎక్కువ.

పిల్లల్లో నత్తి అధికంగా ఉన్నప్పుడు వారికి స్పీచ్ థెరపీ ఇప్పిస్తే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. నిజానికి నత్తికి ఇంతవరకు ఔషధం లేదు. రావడం కూడా కష్టమే. ఇంట్లో పిల్లలతో తల్లిదండ్రులు అధికంగా మాట్లాడుతూ, వారి చేత అక్షరాలను పదేపదే పలికిస్తూ ఉంటే నత్తి సమస్య తగ్గే అవకాశం ఉంది. వేగంగా మాట్లాడుతున్న పిల్లల్లో నత్తి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి పిల్లలు నెమ్మదిగా మాట్లాడేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి. నత్తి ఎక్కువగా ఉన్న పిల్లలకు సంగీతం నేర్పించడం, పాటలు పాడించడం వంటివి చేస్తే ఆ సమస్య కొంత తగ్గుముఖం పడుతుంది. ఐదేళ్ల లోపే నత్తిని గుర్తిస్తే స్పీచ్ థెరపీని ఇప్పించండి. భవిష్యత్తులో వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. 

Also read: కాల్చిన మొక్కజొన్న vs ఉడికించిన మొక్కజొన్న, రెండింట్లో ఏది బెటర్?

Also read: మాంసాహారం తినడం తగ్గిస్తే బెటర్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మందికి పైగా మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మందికి పైగా మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మందికి పైగా మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మందికి పైగా మృతి
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2025 నోటిఫికేషన్ విడుదల - 979 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Chandrababu on Lokesh: రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో వారసత్వం ఓ భ్రమ - లోకేష్ నాయకత్వంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Andhra News: తిరుపతి తొక్కిసలాట ఘటన - న్యాయ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - న్యాయ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
UPSC IFS 2025: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2025 నోటిఫికేషన్ వెల్లడి - పోస్టులెన్నంటే?
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget