అన్వేషించండి

Ganesh Chaturthi 2025 : వినాయక చవితి స్పెషల్.. ఇండియాలో ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయాలివే

Ganesh Temples in India : వినాయక చవితి సందర్భంగా మీరు ఇండియాలో ప్రసిద్ధి చెందిన ఆలయాలను సందర్శించాలనుకుంటే ఈ ఆలయాలు బెస్ట్. ఆలయాల పేర్లు, వాటి ప్రాముఖ్యతలు చూసేద్దాం.

Must Visit Ganesh Temples in India : గణేష్ చతుర్థి 2025 (Vinayaka Chavithi 2025) సందర్భంగా చాలామంది భక్తులు వినాయకుడి ఆలయాలకు వెళ్తూ ఉంటారు. విఘ్నాలను తొలగించి శుభాలను అందిస్తాడని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వినాయక చవితి సమయంలో చాలామంది పవిత్రదేవాలయాలను సందర్శిస్తారు. మీరు కూడా ఈ సందర్భంగా ఇండియాలోని ప్రసిద్ధమైన వినాయకుడి ఆలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ 5 ఆప్షన్లు ఉన్నాయి. వినాయకుడికి ప్రసిద్ధి గాంచిన ఆలయాలు ఏంటి? ఎక్కడున్నాయి? వాటి ప్రాముఖ్యత ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

భారతదేశంలో వినాయకుడివి చాలా ఆలయాలు ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని చాలా పురాణమైవి. పైగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. పురాణాలు, పవిత్రతో నిండిన ఈ ఆలయాలను లక్షలాది మంది భక్తులను దర్శిస్తారు. కోరికలు నెరవేరడంతో పాటు ఆధ్యాత్మిక ఉపశమనం లభిస్తుందని చెప్తారు. మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు.. ప్రసిద్ధమైన టాప్ 5 ఆలయాలు ఏంటో.. వాటి వెనుక ఉన్న కథలు, నిర్మాణ వైభవం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

శ్రీ సిద్ధివినాయక్ ఆలయం

(Image Source: x/ SVTMumbai)

(Image Source: x/ SVTMumbai)

భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన గణేష్ దేవాలయాలలో ముంబైలోని శ్రీ సిద్ధివినాయక్ ఆలయాన్ని ఒకటిగా పరిగణిస్తారు. ఈ టెంపుల్​కు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ నల్లటి బండరాయితో చెక్కిన రెండున్నర అడుగుల ఎత్తైన శ్రీ సిద్ధివినాయకుడు ఉంటాడు. ఒకే రాయితో రూపొదిద్దుకొన్న ఈ విగ్రహాన్ని అందంగా అలంకరిస్తారు. గర్భగుడిలో విగ్రహంతో ఉంటుంది. అంతేకాకుండా లోపలి భాగం అంతా బంగారం, వెండితో పొదగబడి.. చూసేందుకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. 

గణేష్ టాక్ ఆలయం

(Image Source: x/ Fundotravelclub)

(Image Source: x/ Fundotravelclub)

6,500 అడుగుల ఎత్తులో ఉన్న గ్యాంగ్‌టక్‌లోని గణేష్ టాక్ ఆలయం.. అద్భుతమైన వీక్షణలతో భక్తులను ఆకట్టుకుంటుంది. ఎత్తైన శిఖరాలపై ఉన్న ఈ టెంపుల్​ను భక్తులు ఎక్కువగా విజిట్ చేస్తారు. ఆలయం నుంచి ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి. భక్తులకు ప్రశాంతమైన వాతావరణం అందుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పర్యాటకుల రద్దీ ఉంటుంది.  కాబట్టి దానిని బట్టి మీ విజిట్ ప్లాన్ చేసుకుంటే.. ఆలయంతో పాటు ప్రశాంతమైన పరిసరాలను ఆస్వాదించగలుగుతారు.

కనిపాకం వినాయక ఆలయం

(Image Source: x/ manachittooru)
(Image Source: x/ manachittooru)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అద్భుతమైన కనిపాకం వినాయక ఆలయం ఉంది. ఇది సహజంగా ఉద్భవించిన ఆలయం. ఎల్లప్పుడూ నీటిలో మునిగి ఉన్న గణేషుడు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. నీటి బావిలో మునిగి ఉన్న విగ్రహం శతాబ్దాలుగా కోతను తట్టుకుని నిలబడింది. ఈ విషయం శాస్త్రవేత్తలను, పర్యాటకులను కూడా ఆశ్చర్యపరుస్తుంది.  ఇక్కడ ఫిబ్రవరి-మార్చి నెలల్లో పెద్ద బ్రహ్మోత్సవం జరుపుతారు.

మనకుళ వినాయగర్ ఆలయం

(Image Source: x/ Namami_Bharatam)

(Image Source: x/ Namami_Bharatam)

పాండిచ్చేరిలోని మనకుళ వినాయగర్ ఆలయం చరిత్ర, సంస్కృతితో ముడిపడి ఉంది. ఇక్కడ గొప్పగా అలంకరించిన వినాయకుడి కాంస్య విగ్రహం చూడటానికి కళ్లు రెండు సరిపోవు. డిసెంబర్-జనవరి బ్రహ్మోత్సవం సమయంలో స్వామి మరింత వైబ్రేట్‌గా కనిపిస్తారు. ఈ సమయంలో ఆలయాన్ని బాగా అలంకరించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. 

మధుర్ మహా గణపతి ఆలయం

(Image Source: x/ desiredelayer)

(Image Source: x/ desiredelayer)

కేరళలో ఉన్న మధుర్ మహా గణపతి ఆలయం వెయ్యేళ్ల నాటి ప్రాముఖ్యతను కలిగి ఉంది. పురాణ మధురాష్టకం శ్లోకంతో ఇది ముడిపడి ఉంది. శతాబ్దాల నాటి ఆలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ టెంపుల్​ని కూడా చాలామంది చూసేందుకు వెళ్తూ ఉంటారు. 

మీరు కూడా వినాయక చవితి సమయంలో లోకల్​వే కాకుండా వేరేవి చూడాలనుకుంటే ఈ ఆలయాలను హ్యాపీగా విజిట్ చేయవచ్చు. కుటుంబంతో లేదా ఫ్రెండ్స్​తో వెళ్లగలిగేందుకు బెస్ట్ ప్లేస్​లు ఇవి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
AC Buying Guide : ఎండలు పెరుగుతున్నాయని AC కొనడానికి వెళ్తున్నారా? ఈ విషయాలు మరచిపోకండి, లేదంటే నష్టమే
ఎండలు పెరుగుతున్నాయని AC కొనడానికి వెళ్తున్నారా? ఈ విషయాలు మరచిపోకండి, లేదంటే భారీ నష్టం
ITR Filing : మీరు ITR ఫైల్ చేయలేదా? పొరపాట్లు ఉన్నా సరే.. మార్చి 31లోపు సవరించుకోండి, పూర్తి డిటైల్స్ ఇవే
మీరు ITR ఫైల్ చేయలేదా? పొరపాట్లు ఉన్నా సరే.. మార్చి 31లోపు సవరించుకోండి, పూర్తి డిటైల్స్ ఇవే
Everest Masala : ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా నిజంగానే ఉన్నాయా?
ఎవరెస్ట్ మసాలాల్లో నాణ్యత సమస్యలు? పురుగుల మందులు, ఎంటెరోబాక్టీరియా నిజంగానే ఉన్నాయా?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget